Srikakulam

News May 20, 2024

శ్రీకాకుళం: పెట్రోల్ బంకులకు జిల్లా కలెక్టర్ సూచనలు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో సీసాలు, క్యాన్‌ల ద్వారా పెట్రోల్ అమ్మకంపై నిషేధం విధించినట్లు కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం చేపట్టినట్టు ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న 120 పెట్రోల్ బంకుల నుంచి
లూజ్ పెట్రోల్ విక్రయాలు చేయకుండా సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలని డియస్ఓ బి.శాంతి శ్రీని ఆదేశించారు.

News May 20, 2024

మెలియాపుట్టి: నాటుసారా ధ్వంసం

image

మెలియాపుట్టి మండలం పాత్రులలోవ, నెరేళ్లలోవ గ్రామాల్లో సోమవారం ఎస్ఈబీ దాడులు నిర్వహించారు. గ్రామాల్లోని కొండల ప్రాంతంలో తయారు చేస్తున్న 1300 లీటర్ల బెల్లం ఊటతో పాటు 50 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు టెక్కలి ఎస్ఈబీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జీ.ఎస్ రాజశేఖర్ నాయుడు తెలిపారు. ఈ దాడుల్లో పాతపట్నం, మెలియాపుట్టి పోలీసులతో పాటు టెక్కలి ఎస్ఈబీ సిబ్బంది ఉన్నారు.

News May 20, 2024

శ్రీకాకుళం జిల్లాలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

image

నాటుసారా స్థావరాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఆదేశాలతో సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్‌లు, ఎస్సైల ఆధ్వర్యంలో ‘కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ఎవరూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయరాదని హెచ్చరించారు.

News May 20, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

image

కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ రోజున పటిష్ఠమైన భద్రత ఉండాలన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధికతో కలిసి సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్ కొనసాగాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు కొనసాగించాలన్నారు.

News May 20, 2024

శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి హౌస్ అరెస్ట్

image

కోటబొమ్మాలి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తోట మల్లేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ సోమవారం బయలు దేరారు. అయితే కణితివూరులో పోలీసులు తిలక్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. మల్లేష్ అంతిమయాత్రలో కూడా పాల్గొనకుండా చేయడంపై తిలక్ అసహనం వ్యక్తం చేశారు.

News May 20, 2024

శ్రీకాకుళం: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

మడ్డువలస నుంచి తన స్వగ్రామమైన వీరఘట్టం మండలం నందివాడ బైకుపై వస్తోన్న గౌతం మోటార్ సైకిల్ మడ్డువలస, సరసనాపల్లి మధ్య శుక్రవారం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో గౌతం తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు బలమైన గాయం కావడంతో గత రెండు రోజులుగా శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై జనార్దన్ రావు తెలిపారు. చిన్న వయసులోనే మృతి చెందడంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 20, 2024

ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు 144 సెక్షన్: ఎస్పీ

image

ఎన్నికలు తుది ఫలితాలు వరకు 144 సెక్షన్, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని శ్రీకాకళం ఎస్పీ జి.ఆర్ రాధిక అన్నారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నమోదైన కేసుల దర్యాప్తు, ముద్దాయిలు అరెస్టు, ప్రాపర్టీ సీజ్ తదితర అంశాలపై ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీకెట్లు నియమించాలని సూచించారు.

News May 20, 2024

శ్రీకాకుళంలో ఈఏపీ సెట్‌కు 999 మంది హాజరు

image

ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీ 25-2024 జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష జరిగింది. ఎచ్చెర్లలోని రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, నరసన్నపేటలోని ఒక కేంద్రం, టెక్కలిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాల్లో 999 హాజరు కాగా 38 మంది గైర్హాజరయ్యారు.

News May 20, 2024

నరసన్నపేటలో మేకల దొంగలు

image

నరసన్నపేట మండలం చోడవరం ఎస్సీ కాలనీకి చెందిన బక్క నీలం పెంచుకుంటున్న 30 మేకలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పశువుల శాలలో కట్టిన 55 మేకల్లో 30 మూగజీవాలను ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నరసన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మేకల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

News May 20, 2024

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టెక్కలి విద్యార్థికి 62వ ర్యాంకు

image

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టెక్కలికి చెందిన మల్లిపెద్ది ప్రణవ్ సాయి అనే విద్యార్థి 62వ ర్యాంకు సాధించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివిన ప్రణవ్ సాయి తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 132.4 మార్కులు సాధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 62వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థిని పలువురు స్థానికులు అభినందించారు.

error: Content is protected !!