India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలోని రాత్రి 7 గంటలకు మొత్తం 71.25 పోలింగ్ శాతం నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం 65.86%, పలాస 70.21%, టెక్కలి 74.50%, పాతపట్నం 68.04%, శ్రీకాకుళం 64.61%, ఆమదాలవలస 74.66%, ఎచ్చెర్ల 77.30%, నరసన్నపేట 77.29% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు మొత్తం 67.48శాతం పోలింగ్ నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం : 64%, పలాస:69.1%, టెక్కలి: 73.00%, పాతపట్నం: 63.25%, శ్రీకాకుళం 61.00%, ఆమదాలవలస: 70.18%, ఎచ్చెర్ల: 70.00%, నరసన్నపేట: 71.46% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
రాజాం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న టీచర్ రమణ ఉష్ణోగ్రత తీవ్రత, ఒత్తిడికి గురై సోమవారం అక్కడకక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది హుటాహుటిన రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య కోసం విజయనగరం తీసుకెళ్లారు. టీచర్ రమణ విజయనగరం వాసి.
శ్రీకాకుళం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు మొత్తం 54.87 పోలింగ్ శాతం నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం :52.04%, పలాస:52.48%, టెక్కలి: 60.00%, పాతపట్నం: 53.45%, శ్రీకాకుళం 54.00%, ఆమదాలవలస: 56.16%, ఎచ్చెర్ల: 54%, నరసన్నపేట: 57.13% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి అయిన తమ్మినేని వాణిశ్రీ స్థానిక పోలింగ్ బూత్లు 158, 159లో రిగ్గింగ్కు పాల్పడేందుకు ప్రయత్నించడం చాలా దారుణమని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈసీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు పేర్కొన్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంటకు మొత్తం 40.56 శాతం నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం :35.56 % , పలాస:40.56%, టెక్కలి: 46.00%, పాతపట్నం: 41.25%, శ్రీకాకుళం: 38.00%, ఆమదాలవలస: 40.5%, ఎచ్చెర్ల: 40.82%, నరసన్నపేట: 43.12% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఓటర్లను ఆకర్షించేందుకు, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం జిల్లాలో 45 పోలింగ్ కేంద్రాలను ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలను అధికారులు ముస్తాబు చేశారు. దివ్యాంగులు, యువ, మహిళ (పింక్) పేరుతో ఉండే ఆయా ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను అధికారులు సిద్ధం చేశారు. మహిళ పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలే విధులు నిర్వహించనుండటం విశేషం.
ఓటర్లను ఆకర్షించేందుకు, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం జిల్లాలో 45 పోలింగ్ కేంద్రాలను ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలను అధికారులు ముస్తాబు చేశారు. దివ్యాంగులు, యువ, మహిళ (పింక్) పేరుతో ఉండే ఆయా ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను అధికారులు సిద్ధం చేశారు. మహిళ పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలే విధులు నిర్వహించనుండటం విశేషం.
జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ తార స్థాయికి చేరింది. ఎక్కడకెళ్లినా, ఎవరి నోట విన్నా ఎన్నికల చర్చలే నడుస్తున్నాయి. గ్రామాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, సెలూన్ షాపులు.. ఇలా ఎక్కడ చూసినా రాజకీయంపైనే జోరుగా చర్చించుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు. ఈ నియోజకవర్గంలో ఎవరిది విజయం, ఎంత మెజార్టీ వస్తుందంటూ చర్చించుకోవడం కనిపిస్తోంది.
Sorry, no posts matched your criteria.