India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేగిడి మండలం దేవుదల కస్తూర్బా గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం స్వర్ణ కుమారి ఎంపీడీవో శ్యామల కుమారి, ఎంఈఓ ఎం వరప్రసాదరావు, ఎరకయ్య విచారణ చేపట్టారు. ఈనెల2 పాలకొండ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన తరుణంలో గుమ్మడికాయతో దిష్టి తీయడం పై లీగల్ సెల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. నివేదికలు జిల్లా కలెక్టర్ అందజేస్తామని తెలిపారు. ఎస్ ఓ లక్ష్మీ ఉన్నారు.
భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ శనివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈనెల 13వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో జరగనున్న పోలింగ్ కోసం బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పోలింగ్ తేదికి 48 గంటల ముందు అనగా ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుంచి ప్రచారం ఆపేయాలని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్ పేర్కొన్నారు. ఈ సైలెన్స్ పీరియడ్లో ఎవరు ప్రచారం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల12, 13 తేదీల్లో మద్యం అమ్మకాలు నిలిపి వేయాలని ఆయన ఆదేశించారు.
ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు దాదాపు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది.
జిల్లాలో 8 నియోజకవర్గాల పరిధిలో 2358 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 18,92,457 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ శనివారం తెలిపారు. వీరిలో పురుషులు 9,29,859 మంది కాగా, స్త్రీలు 9,45,945 మంది ఉన్నారని, వీరిలో సర్వీస్ ఓటర్లు (సైనికోద్యోగులు) 16448 మంది, 85 ఏళ్లకు పైబడిన వారు 11,422, దివ్యాంగ ఓటర్లు 21,546 మంది ఉన్నట్టు చెప్పారు.
పోలింగ్ శాతం పెంచేందుకు వీలుగా ఓటర్లను ఆకర్షించేలా ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించమని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ పేర్కొన్నారు. 8 నియోజకవర్గాల్లో 31 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా సిద్ధం చేశామన్నారు. యువత కోసం నాలుగు, మహిళల కోసం పింక్ స్టేషన్లు 8, దివ్యాంగుల కోసం రెండు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి వీల్ చైర్లు సిద్ధం చేశామని కలెక్టర్ వెల్లడించారు.
ఎన్నికల ప్రచార పర్వం మరో 2 గంటల్లో ముగియనుంది. అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున జగన్, చంద్రబాబు, పవన్ రాకతో శ్రీకాకుళం జిల్లా వార్తల్లో నిలిచింది. ఎన్నికల్లో మొదట అసమ్మతి సెగ ఉండగా తర్వాత సద్దుమణిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుండగా అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేశారు.
మే13న జరగనున్న పోలింగ్కు 2000 మంది పోలీసులు, 11 పారా మిలటరీ బృందాలు, 2 ఫ్లటూన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీ.ఆర్ రాధిక శనివారం పేర్కొన్నారు. 7 అంతరాష్ట్ర, 4 అంతర జిల్లాల చెక్పోస్టులు పని చేస్తున్నాయన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున 24 ఎస్ ఎస్టి, ఎఫ్ఎస్టీ బృందాలు పని చేస్తున్నాయని, ఇప్పటి వరకూ రూ.4.39 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం లాంటివి సీజ్ చేశామని తెలిపారు.
జిల్లాలో 2358 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, వాటిలో 298 ప్రాంతాలలో 520 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ జీ.ఆర్ రాధిక గుర్తించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 268 మంది సెక్టార్ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరాయంగా పోలింగ్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తారు. హింస జరిగే అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఉందన్నారు.
జిల్లాలో 70.18 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని లైవ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని, మొత్తం 1655 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుందన్నారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ ఉండేలా పూర్తి చర్యలు తీసుకున్నామని అన్నారు.
Sorry, no posts matched your criteria.