Srikakulam

News June 7, 2024

శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన ఎన్నికల కోడ్

image

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ గురువారంతో ముగిసింది. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు 50 రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో జిల్లా ఎస్పీ రాధిక, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆధ్వర్యంలో ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగనున్నాయి.

News June 6, 2024

శ్రీకాకుళం: బీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో రెండేళ్ల బీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూలై 31 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని AU పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

News June 6, 2024

శ్రీకాకుళం జిల్లాలో NOTAకు 37,783 ఓట్లు

image

శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లలో కలిపి NOTAకు 37,783 ఓట్లు పడ్డాయి. నియోజకవర్గాల వారీగా నోటాకు పడ్డ ఓట్ల సంఖ్య:☞ శ్రీకాకుళం- 3373☞ ఆముదాలవలస- 2300☞ పలాస- 2742☞ పాలకొండ- 4260☞ పాతపట్నం- 3604☞ టెక్కలి- 7342☞ ఇచ్చాపురం- 4374☞నరసన్నపేట- 3300☞ రాజాం- 2536☞ ఎచ్చెర్ల- 3952 పడ్డాయి.

News June 6, 2024

టెక్కలి: రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి

image

మణిపుర్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలికి చెందిన మెట్ట తేజేశ్వరరావు(33) అనే సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఎన్నికల విధులకు హాజరై తిరిగి తమ బెటాలియన్‌తో కలిసి వాహనంలో వెళ్తున్న సమయంలో వెనుక నుంచి లారీ బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తేజేశ్వరరావు మృతి చెందాడు. దీంతో జవాన్ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని టెక్కలి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.

News June 6, 2024

శ్రీకాకుళం: నోటాకు అత్యధిక.. అత్యల్పం ఇక్కడే

image

ఇచ్ఛాపురం, ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. గడిచిన ఎన్నికల్లో అత్యధికంగా ఎచ్చెర్లలో నోటాకు ఓట్లు నమోదు కాగా, అత్యల్పంగా ఆమదాలవలసలో పడ్డాయి. ఈసారి అత్యధికంగా శ్రీకాకుళంలో 4,270 మంది, అత్యల్పంగా ఇచ్ఛాపురంలో 744 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఉన్నప్పటికీ వారి కంటే NOTAకే పడటం గమనార్హం.

News June 6, 2024

శ్రీకాకుళం: అన్ని శాఖలు సమన్వయం.. సమిష్టి కృషి

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల సహాయ, సహకారాలు, భాగస్వామ్యం మరువలేనిదని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ అన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. జిల్లాలో గెలుపొందిన పార్లమెంట్ అభ్యర్థి, 8 నియోజకవర్గాల శాసన సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

News June 6, 2024

శ్రీకాకుళం: ఓకే నియోజకవర్గానికి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ

image

ఇటీవలే విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా ఒకే నియోజకవర్గానికి చెందిన వారు గెలుపొందడంతో అక్కడ ప్రజానీకం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒకే నియోజకవర్గానికి చెందినవారు. ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశా భావం వ్యక్తం చేశారు.

News June 6, 2024

శ్రీకాకుళం: లోకేశ్‌ను కలిసిన అచ్చెన్నాయుడు

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్‌ను అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లి మండలం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఓడిన చోట పట్టుబట్టి అత్యధిక మెజారిటీతో గెలవడం గర్వించదగ్గ విషయమని అచ్చెన్నాయుడు కొనియాడారు.

News June 6, 2024

సౌదీ అరేబియాలో చినవంక యువకుడి మృతి

image

వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని చినవంక గ్రామానికి చెందిన మదనాల శంకర్ (32) సౌదీ అరేబియాలో మృతి చెందారు. అతను బుధవారం తెల్లవారుజామున మెదడు పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 4 నెలల క్రితం పని నిమిత్తం ఆతను సౌదీ వెళ్లినట్లు చెప్పారు. ఇటీవల శంకర్ తల్లి కాంతమ్మ కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఎదిగొచ్చిన కొడుకు చిన్న వయసులోనే చనిపోవడంతో తండ్రి సూర్యనారాయణ కన్నీరు మున్నీరయ్యారు.

News June 6, 2024

శ్రీకాకుళం: శాసనసభకు ఎవరు ఎన్నోసారంటే..!

image

శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదుగురు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేయగా, ఐదుగురు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ➤ సీనియర్లు: అచ్చెన్నాయుడు (6వ సారి), కూన రవికుమార్ (2వ సారి), బగ్గు రమణమూర్తి (2వ సారి), కోండ్రు మురళీ (3వ సారి), బెందాళం అశోక్ (3వ సారి) ➤ తొలిసారి: గౌతు శిరీష, నడకుదిటి ఈశ్వర్, గొండు శంకర్, మామిడి గోవింద్, నిమ్మక జయకృష్ణ ఎన్నికయ్యారు.