Srikakulam

News May 11, 2024

శ్రీకాకుళం: రాజకీయ పార్టీలకు ఎస్పీ సూచనలు

image

పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల దూరంలో మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రాధిక సూచించారు. ఆ ప్రదేశంలో ఎక్కువమంది గుమిగూడకూడదని, ఆయా నియోజకవర్గాల్లో బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవ్వరూ ఉండేందుకు వీలు లేదని అన్నారు. లాడ్జిల్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్‌‌‌‌లో ఉండేవారు వెళ్లిపోవాలని ఎస్పీ ఆదేశించారు.

News May 11, 2024

శ్రీకాకుళం జిల్లాలో 18.92 లక్షల ఓటర్లు.. 2,358 పోలింగ్ కేంద్రాలు

image

నిష్పక్షపాతంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 18.92 లక్షల ఓటర్లకు 2358 పోలింగ్ కేంద్రాలు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.

News May 11, 2024

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు మరో 2 రోజులు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధన ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాలి. శనివారం సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోపాటు వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులంతా ముమ్మర ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మనజీ జిలానీ సమూన్‌ తెలిపారు.

News May 11, 2024

నందిగాం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం మద్దిలోడు పేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 11, 2024

REWIND: టెక్కలిలో అత్యధిక మెజారిటీ NTRదే..

image

టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన ఎన్టీఆర్ 40,890 ఓట్ల మెజారిటీతో టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఏ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కూడా అంత మెజారిటీతో గెలవలేదు. ఎన్టీఆర్ పోటీ చేసిన నేలగా టెక్కలికి గుర్తింపు ఉంది.

News May 11, 2024

శ్రీకాకుళం: ఓటర్లకు ప్రలోభాలు.?

image

శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల పండగకు సమయం ఆసన్నమైంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. నరసన్నపేటలో రూ.500 నుంచి రూ.1000, టెక్కలిలో రూ.2 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. పాతపట్నం, శ్రీకాకుళంలో రూ.1000 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. 2వసారి పంపిణీకీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

News May 11, 2024

యువత అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలి: కలెక్టర్

image

యువత అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ యువతకు శుక్రవారం పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “అందరూ ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనాలి” పై వీడియో తయారీ, పోస్టర్ రూపకల్పనలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన నగదుతో పాటు మెమోంటో, సర్టిఫికెట్‌లు అందజేశారు.

News May 11, 2024

ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ఎన్నికల విధులు సమర్ధవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు తదితరులతో ఎన్నికల సన్నద్ధత నిర్వహణపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఉండాలని ఆదేశించారు.

News May 11, 2024

పోలింగ్ పై దిశానిర్దేశం: శ్రీకాకుళం ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలోని మే 13 తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల విధులలో పాల్గొననున్న ఎక్స్ సర్వీస్ మెన్, NCC, NSS వాలంటీర్లు పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధి విధానాలపై.. శుక్రవారం ఎస్పీ జీ.ఆర్ రాధిక ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో గల వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, NCC కో-ఆర్డినేటర్స్, NSS, ప్రతినిదులు ఎక్స్ సర్వీస్ మెన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వారికి దిశానిర్దేశం చేశారు.

News May 10, 2024

శ్రీకాకుళం: రేపే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం రేపటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. రేపటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. మన శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

error: Content is protected !!