India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✵ నందిగాంలో నకిలీ నోట్ల కలకలం ✵ శ్రీకాకుళంలో నాలుగు ఇసుక ర్యాంపులు ✵ అలసత్వం వహిస్తే చర్యలు: అచ్చెన్న ✵ శ్రీకాకుళం-తిరుపతికి ప్రత్యేక రైళ్లు ✵ న్యూకాలనీలో తవిటమ్మ మృతి నేత్రాలు మరొకరికి దానం ✵ ఈనెల 14న జిల్లాకు జాతీయ ST కమిషన్ సభ్యుడు ✵ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు ✵ జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బి. ప్రసాదరావు ✵ వంశధార కాలువలో పడి వ్యక్తి మృతి ✵ సోంపేటలో పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. బూర్జ గ్రామానికి చెందిన ఖండ్యాపు లక్ష్మీ(53) గురువారం పొలానికి వెళ్లారు. అక్కడ పాము కాటు వేయడంతో పొలంలోనే మృతిచెందారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బర్ల ప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీ సురేష్ బాబు నుంచి పదవీ బాధ్యతలు తప్పకున్నారు. అనంతరం జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్పీకి పలువురు అభినందనలు తెలియజేశారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి ఫెస్టివల్స్కు శ్రీకాకుళం నుంచి తిరుపతికి (07443), తిరుపతి నుంచి శ్రీకాకుళానికి (07442) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ద.మ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. 07443 రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు నడుస్తుందన్నారు. 07442 రైలు అక్టోబర్ 06 నుంచి నవంబర్ 10 వరకు నడుస్తుందని..ప్రయాణికులు గమనించాలని కోరారు.

శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. 20 మంది ప్రయాణీకులతో శ్రీకాకుళం నుంచి బయలుదేరిన బస్సు సోంపేట మండలం మామిడిపల్లి గ్రామం సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.

తిరుపతి- శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. అక్టోబరు 6నుంచి నవంబర్ 10 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి ఆదివారం ఈ స్టేషన్ల మధ్య నడవనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, శ్రీకాకుళం- తిరుపతి మధ్య అక్టోబరు 7 నుంచి నవంబర్ 11 వరకు ఈ ప్రత్యేక రైలు.. ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని వివరించారు.

నీట మునిగి ఒకరు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామ సమీపంలోని వంశధార కుడి కాలువలో స్నానం చేయడానికి గుండ చంద్రుడు(44) బుధవారం వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఎస్ఐ వెంకటేశ్ మృతదేహాన్ని పరిశీలించి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సమాజ ఆర్థికాభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరం అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC), బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఇటీవలీ వరదల వల్ల నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. సహయార్థం తమ వంతు బాధ్యత వహించాలన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాలలో ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీలో మిగిలి సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం.ప్రదీప్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జీవశాస్త్రం సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అన్నారు. వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఉచిత ఇసుక నూతన విధానం అమలులోకి రానుంది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఇసుకకు సంబంధించి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18005994599 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇసుక నిర్వహణకు సంబంధించిన అంశాలపై సంబంధిత సిబ్బందికి శిక్షణ అందించనున్నట్లు గన్ను శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
Sorry, no posts matched your criteria.