India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసన్నపేటలో పోటీ చేసిన, విజయం సాధించిన ఏకైక మహిళగా బి.సరోజమ్మ నిలిచారు. ఈవిడ 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి సిమ్మ జగన్నాదంపై 2,454 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. కాగా ఇప్పటివరకు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగిన 16 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక మహిళ ఈవిడే కావడం విశేషం.
నరసన్నపేట నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అత్యధికంగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ , TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం 2024 ఎన్నికల బరిలో కూడా YCP, TDP నుంచి వీరే ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి ఈసారైనా TDPని విజయం వరిస్తుందా..లేదా..2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కానున్నాయా? కామెంట్ చేయండి.
ఉద్దానం ప్రాంతంలో నిన్న ఎలుగుబంటి ఇద్దరిని చంపిన విషయం తెలిసిందే. జీడితోటకు వెళ్లిన రైతులపై దాడి చేయగా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లికి చెందిన చిడిపల్లి లోకనాథం(46), అప్పికొండ కూర్మారావు(48) చనిపోయారు. మహిళా రైతు చిడిపల్లి సావిత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరి మరణానికి కారణమైన ఎలుగుబంటి సమీప తోటల్లో చనిపోయినట్లు సమాచారం.
ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా (జీరో వయలెన్స్.. నో రీపోల్), పూర్తి స్వేచ్ఛగా, సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. శనివారం ఆయన మందస, పలాస, నందిగాం మండలాల్లో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
బొడ్డపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పోతనపల్లి సరోజవర్మ విధుల నుంచి తప్పించినట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకులు జి.వి.చిట్టి రాజు తెలిపారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. దీంతో అతని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.
కోటబొమ్మాళి మండల కేంద్రం స్టేట్ బ్యాంకు సమీపంలో పలాసకు చెందిన బతకల పార్వతి(45) శనివారం ఆటోనుంచి జారిపడి మృతి చెందింది. రెండు రోజుల క్రితం కోటబొమ్మాళి వంట పనులకు వచ్చి తిరిగి వెళుతుండగా ఆటోలో నుంచి జారిపడి తలకు దెబ్బ తగిలింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కోటబొమ్మాళి ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో శనివారం పలువురు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, గౌతు శిరీష, బెందాళం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్, తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జి.ఆర్ రాధిక హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన జారీ చేశారు. అలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి, చీపురుపల్లి సమీపంలో ఘోర ఘటన జరిగింది. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. జీడి తోటలో పనులకు వెళ్లిన సీహెచ్.లోకనాథం, అప్పికొండ కుమార్ అనే రైతులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో 1952 నుంచి 2019 వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం ఎంపీగా కె.రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. ఈసారి కూడా కూటమి కె.రామ్మోహన్ నాయుడుకే టికెట్ కేటాయించింది. అటు వైసీపీ నుంచి పేరాడ తిలక్ను జగన్ బరిలో దింపారు. వైసీపీని ఓడించి కె.రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కొడతారా..? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.