India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ (ఎన్నికల నియంత్రణ కేంద్రం)లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ బుధవారం పరిశీలించారు. అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
*టెక్కలి: ముగిసిన సీఎం జగన్ బస్సుయాత్ర
*ఆమదాలవలస: తమ్మినేనికి రోజులు దగ్గరపడ్డాయి: చంద్రబాబు
*జలుమూరు: శ్రీముఖలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
*పాతపట్నం: నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్న కలమట
*పాలకొండ: రిటర్నింగ్ ఆఫీసర్గా శుభం బన్సాల్
*శ్రీకాకుళం: ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నామినేషన్
*ఎల్.ఎన్.పేట: ఈదురు గాలులతో వర్షం
*ఎచ్చెర్ల: ఆలయంలో 30 తులాల బంగారం చోరీ
శ్రీకాకుళం:ఆదిత్యుని సన్నిధిలో కూచిపూడి
➤పలాస:JBNP-అనిల్ కుమార్, ➤ ఇచ్ఛాపురం: YCP- పిరియా విజయ, TDP- అశోక్, INCP- చక్రవర్తి రెడ్డి, BCYP-బడి ముఖలింగం ➤ టెక్కలి: INCP-విక్రాంత్, JBNP- పరమేశ్వరరావు ➤ శ్రీకాకుళం: YCP – ప్రసాదరావు, BSP-సూర్యనారాయణ,➤ ఆమదాలవలస: JCVIVP- రేవతి, ➤ పాతపట్నం: BSP- కృష్ణారావు, ➤ ఎచ్చెర్ల: BJP అభ్యర్థిగా – ఈశ్వరరావు .. NOTE:- పై వారితో పాటుగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ఉంటుందని.. అదే విధంగా 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వీలుంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆర్వో లు, నోడల్ అధికారులతో నిర్వహించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సింబల్ అలాట్మెంట్ జరుగుతుందని వివరించారు.
ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురమయ్యపేట దేవీ ఆశ్రమంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు 30 తులాల బంగారం, 100 తులాల వెండి, రూ.44 లక్షల నగదు చోరీకి గురైనట్లు అర్చకుడు బాల భాస్కర శర్మ తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగిందని బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయంలోని సీసీ ఫుటేజ్ని దొంగలు ధ్వంసం చేశారు. ఈ మేరకు క్లూస్ టీం ఆలయంలో వివరాలు సేకరిస్తున్నారు.
శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, కలమట వెంకటరమణ, కింజరాపు హరి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు నామినేషన్ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమూన్కు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలిద్దరూ జిల్లాలోనే ఉన్నారు. నిన్న పాతపట్నం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు.. ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎం జగన్ కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. మేమంతా బస్సు యాత్ర భాగంగా ఈరోజు ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం బైపాస్ మీదుగా టెక్కలి చేరుకుని.. అక్కడ సభలో ప్రసంగించనున్నారు.
టీడీపీ టికెట్ ఆశించి బంగపడిన పాతపట్నం మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు మంగళవారం రాత్రి కలమటను పిలిచి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తామని కలమటకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో కలమట ఆయన అనుచరులతో మాట్లాడి, నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.
పాలకొండ రిటర్నింగ్ ఆఫీసర్, సీతంపేట ఐటిడిఏ పిఓగా శుభం బన్సాల్ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరి బుధవారం మధ్యాహ్నం 1:00 లోపు జాయినింగ్ రిపోర్టును సమర్పించాలని ఐటిడిఏకు సమాచారం అందింది. ఐటిడిఏ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసిన కల్పనా కుమారిని బదిలీ చేశారు. అనంతరం జేసి శోభికకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం సీఎం జగన్ పర్యటన వివరాలు మంగళవారం వెలువడ్డాయి. సీఎం జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాన్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్కు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు టెక్కలి మండలం అక్కవరం గ్రామం వద్ద జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం పాల్గొనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.