India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ప్రస్తుత వేసవిలో మంచినీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా పటిష్ఠమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డికి తెలిపారు. BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ప్రస్తుతం వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హరియాణాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఘన స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన కలెక్టర్ అనంతరం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై కొద్దిసేపు వివరించారు.
➤ పలాస: CPI- కామేశ్వరరావు
➤ ఇచ్ఛాపురం: BSP- వేదవర బైసాయి
➤ టెక్కలి: BSP- శ్రీనివాసరావు,
➤శ్రీకాకుళం: PPI-లక్ష్మణ
➤ ఆమదాలవలస: PPI-మధుసూదనరావు
➤ పాతపట్నం:INCP- వెంకట్రావు, స్వతంత్ర – మోహనరావు, JBNP- తిరుపతిరావు, కృష్ణ- స్వతంత్ర అభ్యర్థి, GDP- సంజీవరావు
➤ ఎచ్చెర్ల: గొర్లె కిరణ్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి, రమ్య సువ్వారు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు,16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ మంగళవారం తెలిపారు. ఆమదాలవలస,బూర్జ,గంగువారి సిగడాం, పొందూరు, సరుబుజ్జిలి, నర్సన్నపేట, జలుమూరు, టెక్కలి, కోటబోమ్మాళి, సారవకోట, పాతపట్నం, హిరమండలం, ఎల్ ఎన్ పేట మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో ఐఏఎస్ అధికారిణిని బదిలీ చేశారు. సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కల్పనా కుమారిని బదిలీ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ శోభితకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నియమించారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కాశీబుగ్గకు చెందిన విద్యార్థి ఎస్ శ్రీకర్ 597/600 మార్కులు సాధించి ఉత్తరాంధ్ర జిల్లాల టాపర్గా నిలిచాడు. సంతకవిటి మండలం వాసుదేవుపురం గ్రామానికి చెందిన శ్రీకర్ తండ్రి ఎస్ రామరాజు కాశీబుగ్గ శ్రీ చైతన్య కళాశాలలో ఎఓగా పని చేస్తుండగా తల్లి లలిత గృహిణిగా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకర్ కు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు
టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ప్రకటించిన వైసీపీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ముందుగా ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ పెద్దలు వాణితో సంప్రదింపులు జరిపారు. దీంతో నామినేషన్ వేసే నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
టెక్కలి అసెంబ్లి కూటమి అభ్యర్థి అచ్చెన్నాయుడు ఆస్తుల వివరాలను సోమవారం నామినేషన్ నేపథ్యంలో అఫిడవిట్లో పొందుపరిచారు. స్థిరాస్తులు: రూ.2,31,48,500 ఉండగా, చరాస్తులు: రూ. 1,32,05,511 ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు: రూ.42,90,153, చేతిలో నగదు: రూ. 2,50,000, వివిధ బ్యాంకుల్లో: రూ.64,18,869 ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు.
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 23,157 కాగా ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు 2,774 తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 902గా ఉంది. జిల్లా మొత్తం ఉత్తీర్ణులైన వారి సంఖ్య 26,833గా అధికారులు సోమవారం వెల్లడించారు. వీరందరికీ జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో పాటుగా పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.
➤ పలాస: YCP అప్పలరాజు
➤ ఇచ్ఛాపురం: స్వతంత్రంగా లక్ష్మీ
➤ టెక్కలి: TDP అచ్చెన్నాయుడు
➤ శ్రీకాకుళం: TDP శంకర్, INCP కృష్ణారావు,
➤ ఆమదాలవలస: YCP సీతారాం, INCP అన్నాజీ రావు, BSP సోమేశ్వరరావు, స్వతంత్రంగా సురేశ్
➤ పాతపట్నం: YCP రెడ్డి శాంతి, కూటమి మామిడి గోవిందరావు
➤ ఎచ్చెర్ల: PPI నీలాచలం, JBNP కొర్లయ్య, INCP మల్లేశ్వరరావు,
➤ నరసన్నపేట: YCP కృష్ణదాస్, NCP కామేశ్వరి, INCP నరసింహ మూర్తి.
Sorry, no posts matched your criteria.