Srikakulam

News August 16, 2024

కోటబొమ్మాళి: యువకుడు అనుమానాస్పద మృతి

image

విజయనగరం సమీపంలోని రాళ్లమళ్లపురం గ్రామం పరిధిలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం కోటబొమ్మాళి మండలం చిన్నహరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన ఉప్పాడ జగదీశ్ (25) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రైల్వే పోలీసులు వివరాల ప్రకారం.. జగదీశ్‌ విశాఖపట్నంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని వివరించారు. విజయనగరం ఎందుకు రావాల్సి వచ్చిందని, హత్యా లేక ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News August 16, 2024

కొలిక్కిరాని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య దువ్వాడ వాణి వివాదం కొలిక్కిరావడం లేదు. శ్రీనివాస్ నివాసం ఉంటున్న ప్రదేశంలో గత కొద్ది రోజులుగా ఆయన భార్య వాణి, కుమార్తెలు నిరసన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లుపై పూర్తి హక్కులు తనకు ఉన్నాయని శ్రీనివాస్ చెబుతుండగా, ఇంటిపై మాకు కూడా హక్కులు ఉన్నాయని వాణి, మాధురి అంటున్నారు. ఒకపక్క తనకు దువ్వాడ రూ.60 లక్షలు ఇవ్వాలని ఒక వ్యక్తి అంటున్నారు.

News August 16, 2024

మాజీ మంత్రి కృష్ణదాస్‌పై విచారణకు సీఐడీ ఆదేశం

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌పై విచారణకు గురువారం ఏపీ సీఐడీ అధికారులు ఆదేశించారు. ‘ఆడుదాం-ఆంధ్రా’, సీఎం కప్ కార్యక్రమం పేరిట అవినీతికి పాల్పడ్డారు అనే ఫిర్యాదు మేరకు విజయవాడ సీపీకి సీఐడీ ఏడీపీ సూచించారు. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆర్‌కె రోజాలను విచారణ చేయాలని ఆదేశించారు. ధర్మాన కృష్ణదాస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.

News August 16, 2024

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న.. నేడు ఆయన జయంతి

image

స్వాతంత్ర్య సమరయోధుడు డా.సర్దార్ గౌతు లచ్చన్న ఆగస్టు 16, 1909లో సోంపేట మండలం బారువ గ్రామంలో జన్మించారు. 21 ఏళ్ల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. పలుమార్లు జైలుకు వెళ్లారు. బ్రిటీష్ రాజులపై పోరాటాలు చేసినందుకు ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చింది. 1948-83 కాలంలో 35 ఏళ్లు సోంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001లో “నా జీవితం” అనే ఆటోబయోగ్రఫీ రచించారు.

News August 16, 2024

ఆమదాలవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆమదాలవలస మండలం దివాంజీపేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన పేడాడ రాము(37) కొత్తూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ పాంట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 16, 2024

ఆమదాలవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస ప్రభుత్వ ఆసుపత్రి సమీపం రాధాకృష్ణ పురం వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన పేడాడ రాము (37) కొత్తూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.స్టీల్ పాంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 15, 2024

శ్రీకాకుళం: ఈ నెల 17న జాబ్ మేళా

image

శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఈ నెల 17 వ తేదీ శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కె.ఎల్ గ్రూప్ (అమెజాన్ వేర్ హౌస్) కంపెని పాల్గొంటుందని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తయ్యి 18 నుంచి 35 సంవత్సరాల అర్హత కలిగిన స్త్రీ/పురుషులు అర్హులని తెలిపారు. 200 పోస్టులను భర్తీ చేయనున్నారని వివరించారు.

News August 15, 2024

సంతబొమ్మాళి: ఆర్మీ మేజర్ రాంగోపాల్‌కు కీర్తిచక్ర అవార్డు

image

సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ ప్రతిష్ఠాత్మకమైన ఆర్మీ కీర్తిచక్ర అవార్డుకు ఎంపికయ్యారు. మరాఠా లైట్ ఇన్ ఫ్రాంటరీ 56వ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్ మేజర్ గా ఉన్న రాంగోపాల్ గత ఏడాది జమ్మూకాశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించి తన సైన్యంతో దాడి చేసి ఉగ్రవాదులను హతమార్చడంలో ప్రత్యేక పాత్ర పోషించినందుకు గాను కీర్తిచక్ర అవార్డుకు ఆర్మీ అధికారులు ఎంపిక చేశారు.

News August 15, 2024

టెక్కలి: చాక్‌పీస్‌పై మహాత్మా గాంధీ రూపం

image

టెక్కలి మండలం స్థానిక మెట్ట వీధికి చెందిన సింహాద్రి రాజు అనే యువకుడు స్వాతంత్‌ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహాన్ని సుద్ధ మొక్క పై చెక్కి తన దేశభక్తిని చాటుకున్నాడు. సుద్ధ ముక్కపై గాంధీజీ విగ్రహం చెక్కటానికి 6 గంటల సమయం పట్టిందని యువకుడు తెలిపాడు. రాజు కార్పెంటర్ పని చేస్తూ జీవనోపాధి సాగిస్తూ ఇలా సుద్ద ముక్క పై విగ్రహాలు చెక్కుతూ తన ప్రతిభను కనబరుస్తుంటాడు. దీంతో పలువురు అభినందిస్తున్నారు.

News August 15, 2024

SKLM: స్వాతంత్ర్య సమర యోధుడు అప్పయ్య

image

స్వాతంత్ర్య సమరంలో సిక్కోలు జిల్లా యోధుల కృషి మరువలేనిది. వారిలో పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన అన్నెపు అప్పయ్య ఒకరు. క్విట్ ఇండియా ఉద్యమం సహా ఎన్నో స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొన్నందుకు ఆయన కృషి చేశారు. బొడ్డేపల్లి నారాయణ, నంద ఆదినారాయణ, గురుగుబెల్లి సత్యనారాయణ, నంద కృష్ణమూర్తి, బొడ్డేపల్లి రాములు, కూన యర్రయ్య, కూన బుచ్చి తదితరులున్నారు.