India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐ దాడి మోహన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం రాజాం మండలం పొగిరి చెక్ పోస్ట్ వద్ద పాలకండ్యం నుంచి రాజాం వెళ్తున్న కారులో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.5,23,300 గుర్తించారు. సంబంధిత నగదుకు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
హోం ఓటింగ్ కు సానుకూలంగా ఉన్న 85 సంవత్సరాలు పైబడిన, అలాగే దివ్యాంగ ఓటర్ల వివరాలను ఆయా ఆర్వోలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఏ ఒక్కరు కూడా ఓటు వేయలేక పోయామని బాధపడే పరిస్థితి ఉండకూడదన్నదే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం సంబంధిత అధికారులకు ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి, అవగాహన కల్పించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను 18,249 మంది రాయగా.. వారిలో 10,408 మంది ఉత్తీర్ణత సాధించారు. 57 శాతంతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. సెకండియర్లో 16,769 మందికి 11,300 మంది పాసయ్యారు. 67%తో 24వ స్థానంలో ఉంది.
లావేరు మండలం వెంకటాపురం జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల ఎమ్మెల్యే వాహనాన్ని ఫ్లయింగ్ స్కాడ్ తనిఖీ చేపట్టింది. ఎలక్షన్ క్యాంపెనింగ్కి వెళ్తున్న ఎమ్మెల్యే వాహనంతో పాటు ఇతర వాహనాలను కూడా లావేరు, జి.సిగడాం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. రెండు మండలాలలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ తనిఖీలలో ఏవో ఉషారాణి, ఏఎస్ఐ రామారావు, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 45,702 మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 43,071 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,631 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 19,937 రెండో సంవత్సరం విద్యార్థులు 25,765 మంది ఉన్నారు. ఫలితాలు వెల్లడిపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో సోమరాజుపేట గ్రామంలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు ఎన్నికల నిబంధనలు, ప్రవర్తన నియమావళి, సి-విజిల్ యాప్, బైండోవర్ షరతుల గురించి వివరించారు. ఎన్నికల సమయంలో తగాదాలు పడవద్దని, పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల నేపథ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్, పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. ఈరోజు రాజాం మండలం జెండాల దెబ్బ సమీపంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు చేపట్టిన తనిఖీలలో భారీగా వెండి సామగ్రి పట్టుబడింది. విజయనగరం నుంచి టూ వీలర్ మీద రాజాం వస్తున్న ఒక వ్యక్తి వద్ద సుమారు రూ.5 లక్షల విలువ చేసే 8కిలోల వెండి సామగ్రి లభ్యమైంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
2024-25 ఏడాదికి గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు.
విశాఖ ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ శంకర్రావు గురువారం ఉదయం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐఓబీలో గన్మెన్గా పని చేసే ఇతని స్వగ్రామం రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం కొట్టిస. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఉ. 5 గంటలకు డ్యూటీకి హాజరైన శంకర్రావు తన వద్ద ఉన్న SLRతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బుధవారం శిల్పి గేదెల హరికృష్ణ నిర్మించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈ సైకత శిల్పం చేసినట్లు ఆయన చెప్పారు. పలువురు ముస్లిం సోదరులకు తన సైకత శిల్పం ద్వారా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. శిల్పి హరికృష్ణ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు
Sorry, no posts matched your criteria.