Srikakulam

News September 10, 2024

SKLM: అడ్మిషన్లకు ఈనెల 19లోగా దరఖాస్తు చేసుకోండి

image

దేశవ్యాప్తంగా ఉన్న మిలిటరీ స్కూల్ లలో 6,9 తరగతుల్లో చేరేందుకు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి శైలజ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. అప్లై చేసిన వారికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు www.rashtriyamilitaryschools.edu.in వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరారు.

News September 10, 2024

SKLM: 15 మంది ఎస్సైలకు బదిలీ

image

శ్రీకాకుళం జిల్లాలో 15 మంది ఎస్.ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలకు బదిలీలు కాగా, అందులో ఇద్దరిని శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం విశాఖపట్నం వీఆర్‌లో ఉన్న వి.నాగరాజును శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీసుస్టేషన్, జి.ఆర్.కె. తులసీదాసు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 10, 2024

SKLM: విపత్తు నిర్వహణ బృందంలో చేరుటకు ఆహ్వానం

image

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా విపత్తు నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తోందని సేవ చేయాలనుకునే వారు చేరవచ్చని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. పేర్లు నమోదు చేసు కున్న వారికి శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు విపత్తుల సమయంలో సేవ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వివరాలకు 99486 33398, 90102 73741, 99633 99455 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News September 10, 2024

శ్రీకాకుళం: వర్షాలు తగ్గినా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాలు తగ్గుముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఒడిశాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేయాలన్నారు.

News September 9, 2024

నిమజ్జన ప్రదేశాల్లో భద్రత నియమాలు పాటించాలి: ఎస్పీ

image

శ్రీకాకుళంలో పొన్నాడ వంతెన ఇరువైపులా వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశాలను సోమవారం ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులతో సందర్శించారు. భద్రతపరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నాగావళి నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున పొన్నాడ వంతెన, ఏడు రోడ్ల-గుజారతిపేట వంతెన, డే&నైట్ వంతెన ఇరువైపులా నిమజ్జనం చేసే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

News September 9, 2024

సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయండి: జిల్లా కలెక్టర్

image

నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08942-2405575) ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ coskimsupdtd@gmail.com పంపించాలని తెలిపారు.

News September 9, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ

image

శ్రీకాకుళంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 8, 2024

వంశధార, నాగావళి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది: సీఎంఓ

image

శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాత్రి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారులను కోరారు. జిల్లా ఉన్నతాధికారులు వరద ప్రవాహాంపై క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు.

News September 8, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ

image

శ్రీకాకుళంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 8, 2024

శ్రీకాకుళం: తుఫాన్ ఎఫెక్ట్.. 200 అడుగులు ముందుకు సముద్రం

image

శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా జిల్లాలో అధికారులు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో సముద్రం సుమారు 200 అడుగులు ముందుకు రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక జిల్లాలోని భావనపాడు, కళింగపట్నం తీర ప్రాంతాల్లో కూడా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.