India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సారవకోట మండలంలోని అంగూరు, అన్నుపురం, గొర్రిబంద క్షేత్ర సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీలోగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు ఉపాధిహామీ పథకం ఏపీవో నారాయణరావు తెలిపారు. అంగూరు క్షేత్ర సహాయకుడు మృతి చెందగా ఆ పోస్టు ఖాళీ అయ్యిందని, అన్నుపురం, గొర్రిబంద క్షేత్ర సహాయకులు ఇటీవల రాజీనామా చేసినట్లు చెప్పారు. కిడిమి పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ న్యాయస్థానంలో విచారణలో ఉందన్నారు.

జిల్లాలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయని వాటి వివరాలను సంపూర్ణంగా తనకు అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఆదివారం జిల్లా పర్యాటక శాఖ ఏడీ, నడిమింటి నారాయణరావు తన సిబ్బందితో కలిసి జేసీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన జిల్లాలో పర్యాటక కేంద్రాలతోపాటు పలు చారిత్రక ఆలయాలు ఉన్నాయని వాటి వివరాలు తెలపాలన్నారు.

సీతంపేటలోని ఆడలి వ్యూ పాయింట్ పనులను ITDA, PO రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఆడలి వ్యూ పాయింట్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సీతంపేట సంతను పరిశీలించి, పైనాపిల్, ఇతర ఉత్పత్తుల ధరలను గిరిజనులను గురుకుల పాఠశాలను పరిశీలించి, తాగు నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం పరిధిలో అగ్నివీర్, అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. ఈనెల 8 నుంచి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. అవివాహిత యువత ఇంటర్, 10వ తరగతిలో 50శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు agnipathvayu.cdac.in వెబ్ సైట్ను సందర్శించాలన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో శాఖాపరమైన పరీక్షలు ఆదివారం నుంచి 3 కేంద్రాల్లో 6 రోజుల పాటు నిర్వహించనున్నట్లు డీఆర్వో గణపతిరావు పేర్కొన్నారు. నేటి నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు జరిగే పరీక్షలకు మొత్తం 1,715 మంది ఉద్యోగులు హాజరవుతారన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు గంటన్నర ముందు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్రతీరంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులను తిరిగి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే జరిపి హార్బర్ పనులకు అడ్డంకి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం కలెక్టర్ ఆయన ఛాంబర్లో మత్స్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. హార్బర్ పనులను ప్రారంభించి ప్రతి 15 రోజులకు ఒకసారి తనకు నివేదిక అందించాలన్నారు.

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అక్రమ ఇసుక తరలిపోకుండా జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీతో ఇసుక రవాణాకు సంబంధించి ధర నిర్ణయంపై కలెక్టర్ జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో శనివారం సమీక్షించారు. ఇసుక అక్రమంగా తరలిపోకుండా మండలాల్లో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఏపీఎస్సీపీసీఆర్ సభ్యుడు గొండు సీతారాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 26న జాతీయ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ్ బాల్ పురస్కారాలను ప్రదానం చేసేందుకు దరఖాస్తులను జులై 31లోగా పంపించాలని మొదట గడువు విధించారని, ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారని తెలిపారు.

జిల్లాలోని దాదాపు 5,25,912 మంది రైతులకు పంట బీమా చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 6,47,504 ఎకరాల పంట భూమి ఉంది. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య రూ.360 కోట్లను వివిధ రూపాల్లో రైతులకు లబ్ధి చేకూర్చింది. YCP ప్రభుత్వం కొందరికి బీమా చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది రైతులందరికి లబ్ధి చేకూర్చేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.