Srikakulam

News April 5, 2024

శ్రీకాకుళం: ACCIDENT.. కానిస్టేబుల్ మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అవుట్ పోస్టులో జీఆర్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బొడ్డేపల్లి గన్నయ్య(44) గురువారం రాత్రి రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. విధుల్లో భాగంగా విజయనగరం వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ కాలనీ రోడ్డు వద్ద లారీ ఢీకొట్టగా చనిపోయారు. మృతుని భార్య ఫిర్యాదుమేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్సై కేసు నమోదు చేశారు.  

News April 5, 2024

శ్రీకాకుళం: న్యాయమూర్తులకు స్థానచలనం

image

శ్రీకాకుళం జిల్లాలో పలువురు న్యాయమూర్తులకు స్థానచలనం కల్పిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. శ్రీకాకుళం 1వ అదనపు జిల్లా జడ్జి శ్రీదేవిని కాకినాడ జిల్లా పోక్సోకోర్టు న్యాయమూర్తిగా, వైజాగ్ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ హిమబిందును శ్రీకాకుళం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్‌గా, వైజాగ్ 1వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యుగంధర్‌ను శ్రీకాకుళం అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీచేశారు.

News April 5, 2024

శ్రీకాకుళం: రాత్రివేళ ఎలుగుబంటి సంచారం 

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మెట్టూరులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఇదే గ్రామంలో ఈ నెల 2న ఓ పాడుబడిన ఇంట్లో ప్రవేశించిన ఎలుగుబంటిని పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. గ్రామంలో గురువారం చీకటి పడే సమయానికి మరో ఎలుగుబంటి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. వీధుల్లో సంచరించిన ఎలుగు జీడి తోటలోకి వెళ్లిందని చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News April 5, 2024

ఎచ్చెర్ల: 6వ తేదీన బీఈడీ ప్రవేశాలు

image

బీఈడీ (ఎంఆర్) కోర్సులో డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం తక్షణ ప్రవేశాలు నిర్వహించనుందని వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ నెల 6 నుంచి వీటిని వర్శిటీలోని ఎడ్యుకేషన్ విభాగంలో నిర్వహించనున్నామని తెలియజేశారు. టీసీతో పాటు విద్యార్హతలతో కూడిన ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, నాలుగు ఫొటోలతో అభ్యర్థులు హాజరుకావాలన్నారు.

News April 4, 2024

శ్రీకాకుళం: వడదెబ్బకు వ్యక్తి మృతి

image

పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ రామకృష్ణ(54) గత కొంతకాలంగా చేపల చెరువుకు
కాపలా కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. తుమరాడ గ్రామ సమీపంలో ఉన్న చేపల చెరువు వద్ద గురువారం ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 4, 2024

శ్రీకాకుళం ఎంపీ స్థానంలో నోటాకు పెరుగుతున్న ఓట్లు

image

శ్రీకాకుళం పార్లమెంట్ (ఎంపీ) స్థానానికి 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పడుతున్న ఓట్లు సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. 2014 శ్రీకాకుళం ఎంపీ స్థానానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు 6,133 (0.58 శాతం) ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో నోటాకు 25,545 (2.19 శాతం) ఓట్లు వచ్చాయి. 2013లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్నికల కమిషన్ ఈవీఎం యంత్రాల్లో నోటాకు స్థానం కల్పించింది.

News April 4, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

సరుబుజ్జిలి మండలం రొట్టవలస సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హిరమండలం మండలం రెల్లివలసకి చెందిన కోట హరి మృతి చెందాడు. సరుబుజ్జిలి ఎస్సై బి.నిహార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస వైపు నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా.. రొట్టవలస వద్ద ట్రాక్టర్ ఒక్కసారిగా అడ్డం రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మరో యువకుడు గోక రామకోటికి గాయాలయ్యాయి. హరి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News April 4, 2024

ఎచ్చెర్ల: 6వ తేదీన బీఈడీ ప్రవేశాలు

image

బీఈడీ (ఎంఆర్) కోర్సులో డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం తక్షణ ప్రవేశాలు నిర్వహించనుందని వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ నెల 6 నుంచి వీటిని వర్శిటీలోని ఎడ్యుకేషన్ విభాగంలో నిర్వహించనున్నామని తెలియజేశారు. టీసీతో పాటు విద్యార్హతలతో కూడిన ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, నాలుగు ఫొటోలతో అభ్యర్థులు హాజరుకావాలన్నారు.

News April 4, 2024

సీక్రెట్ సర్వే చేయడం సంతోషం: గుండ

image

టీడీపీ గార మండల ముఖ్య నాయకులతో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు వారి నివాసంలో గురువారం సమావేశమయ్యారు. వాళ్లు మాట్లాడుతూ.. శ్రీకాకుళం నియోజకవర్గంలో నాయకుల మనోభావాలను తెలుసుకునేందుకు టీడీపీ అధిష్ఠానం ప్రయత్నిస్తోందని చెప్పారు. ముందస్తు సమాచారం లేకుండా సీక్రెట్‌గా నిన్న సర్వే చేయడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. టికెట్ మార్పు విషయమై పునఃపరిశీలన చేస్తున్నారని చెప్పారు.

News April 4, 2024

పొందూరు నుంచి వెళ్తూ ముగ్గురు మృతి

image

విశాఖ నగరంలోని పెందుర్తి సమీపంలో ఇవాళ ఉదయం <<12986188>>ఘోర రోడ్డు ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లా తాళ్లపూడి మం. తిరుగుడుమెట్ట రామకృష్ణ కాలనీకి చెందిన పలువురు శీకాకుళం జిల్లా పొందూరులో జరిగిన పెళ్లికి వచ్చారు. తిరిగి స్వగ్రామానికి టాటా ఏస్ వ్యాన్‌లో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. హనుమంతు ఆనంద్(40), హనుమంతు చంద్రశేఖర్(16), చింతాడ ఇందు(50) చనిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు.