Srikakulam

News August 8, 2024

శ్రీకాకుళం: పంట వివరాలను నమోదు చేయాలి

image

రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబరు 15వ తేదీలోగా ఈ- పంట పేరిట నమోదు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఈ సమావేశానికి వ్యవసాయ దాని అనుబంధ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతులకు పంట సాయం, పంట నష్టరిహారం, పంటల బీమా సమాచారం సేకరించాలన్నారు.

News August 7, 2024

శ్రీకాకుళం: యథాస్థానాలకు ఎంపీడీఓలు

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చిన ఎంపీడీఓలను వారి యథాస్థానాలకు బదిలీ చేస్తూ బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బదిలీపై జిల్లాకు ఎంపీడీఓలు వారి స్థానాలకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని మండల పరిషత్ అధికారులు, సిబ్బంది సాధారణ బదిలీలపై స్పష్టత రావాల్సి ఉంది.

News August 7, 2024

శ్రీకాకుళం: పంట వివరాలను నమోదు చేయాలి

image

రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబరు 15వ తేదీలోగా ఈ- పంట పేరిట నమోదు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఈ సమావేశానికి వ్యవసాయ దాని అనుబంధ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతులకు పంట సాయం, పంట నష్టరిహారం, పంటల బీమా సమాచారం సేకరించాలన్నారు.

News August 7, 2024

శ్రీకాకుళం: రీవాల్యుయేషన్ ఫలితాల విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ జనవరి-2024 సంబంధించి డిగ్రీ 1వ సెమిస్టర్, 3వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ రీవాల్యూయేషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు.‌ ఈ సందర్భంగా అభ్యర్థులు ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్ ‌లో పొందుపరిచామని అన్నారు. మరిన్ని వివరాల కోసం https://drbrau.in/ వెబ్ ‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

News August 7, 2024

పొందూరు ఖాదీ ఖండాంతర ఖ్యాతి

image

పొందూరుల ఖాదీఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇటలీ, జర్మనీ, కెనడా, యూఎస్ఏ, నార్వే, థాయలాండ్ దేశాల విద్యార్థులు, ప్రముఖులు సందర్శించారు. సుమారు 900 మంది చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఈ వస్త్రం మీటరు రూ.341 ధర నుంచి అత్యధికంగా రూ.2,107లుగా ఉంది. పంచెలు రూ.2వేలు నుంచి రూ.10వేలు, చీరలు రూ.6 వేలు నుంచి రూ.15 వేలు వరకు ఉన్నాయి. ఏటా వస్త్ర వ్యాపారం రూ.8 కోట్లు టర్నోవర్ ఉంటుందని వ్యాపారులు తెలిపారు.

News August 7, 2024

శ్రీకాకుళం: హౌరా- యశ్వంత్‌పూర్ రైలు రద్దు  

image

పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా హౌరా(HWH)- యశ్వంత్‌పూర్(YPR) మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లను నిర్వహణ కారణాల రీత్యా కొద్దిరోజులపాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 8, 15వ తేదీల్లో నం.02863 HWH- YPR, నం.02864 YPR- HWH రైలును ఆగస్టు 10, 17వ తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

News August 7, 2024

శ్రీకాకుళంలో చేనేతకు ప్రత్యేక గుర్తింపు ఉంది

image

దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్దది చేనేత రంగమని, అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అభిప్రాయపడ్డారు. చేనేత, జౌళి శాఖ మరియు సిక్కోలు వీవర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో 10వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక బాపూజీ కళామందిర్లో ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో చేనేతకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

News August 7, 2024

శ్రీకాకుళం: ITI ప్రవేశాలకు మూడో విడత దరఖాస్తు

image

శ్రీకాకుళం జిల్లాలో ఐటిఐలో ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్, జిల్లా ప్రవేశాల కన్వీనర్ ఎల్. సుధాకర్ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సిలింగ్‌లో మిగిలిన సీట్ల ప్రవేశాలు కల్పిస్తామని ఆయన వివరించారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు iti.ap.gov.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 26వ తేదీతో గడువు ముగుస్తుందని ఆయన చేప్పారు.

News August 7, 2024

శ్రీకాకుళం: పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు సిద్ధం

image

శ్రీకాకుళం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నిర్వహించనున్న పాఠశాల యజమాన్య కమిటీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా సర్వ శిక్ష అభియాన్ అధికారులు తెలిపారు. జిల్లాలో 2,934 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహణకు తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు. పాఠశాలల హెచ్ఎంలు, మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

News August 7, 2024

SKLM: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. LNపేట మండలం మోదుగువలస నిర్వాసితకాలనీ చిన్నకొల్లివలసకు చెందిన బి.చిన్నారావు, శ్రీకాంత్ పెద్దపాడులోని స్నేహితుడి ఇంటికి వెళ్లారు. తిరిగి బైకుపై ఇంటికి బయల్దేరారు. ఆమదాలవలస ఓయోడెక్టు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డారు. శ్రీకాకుళం రిమ్స్‌లో చిన్నారావు మృతిచెందగా.. శ్రీకాంత్ చికిత్స పొందుతున్నాడు.