Srikakulam

News February 6, 2025

విద్యార్థులకు నులి పురుగుల మాత్రలు వేయించాలి: కలెక్టర్ 

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు ఈ నెల 10న పక్కాగా వేయించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎంపీడీఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.

News February 5, 2025

శ్రీకాకుళం జిల్లా బెంతు ఒరియా అధ్యక్షుడిగా రజనీ కుమార్

image

బెంతు ఒరియాల శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా బల్లిపుట్టుగకు చెందిన రజనీ కుమార్ దొళాయిని నియమితులయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో సంఘం సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఉన్న శ్యాంపురియా ఇటీవల మృతి చెందడంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా బెంతు ఒరియా కుల సంఘం అధ్యక్షుడిగా రజిని కుమార్ దోళాయి, ఉపాధ్యక్షుడిగా ఢిల్లీ మజ్జి, తదితరులను ఎన్నుకున్నారు.

News February 5, 2025

1.20లక్షల మందికి సూర్యనారాయణ స్వామి దర్శనం

image

అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా అధికారుల ప్రోద్భలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని కొనియాడారు. ఈఏడాది సూర్యనారాయణ స్వామిని 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.

News February 5, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం అందెపల్లి గ్రామానికి చెందిన ఉదయ్(25) మృతి చెందాడు. యువకుడు లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

News February 5, 2025

పలాస: అబాకస్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

image

పలాస మండలం రామకృష్ణాపురంలో గల ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి మంగళవారం తెలిపారు. 5వ తరగతి చదువుతున్న గీత చరిష్మా శ్రీకాకుళంలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ప్రిన్సిపల్‌ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని టీచర్స్ కోరారు.

News February 4, 2025

అరసవల్లి: భక్తుల రాకపోకలను పరిశీలించిన కలెక్టర్

image

అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్  రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా భక్తుల సందర్శన, రాకపోకలను శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం పరిశీంచారు. ఇంద్రపుష్కరిణిని పరిశీలించి అక్కడ భవిష్యత్తులో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు.

News February 4, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

డాక్టర్ బీఆర్‌.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 2015, 2016, 2017, 2018, 2019 ఎడ్మిట్ విద్యార్థుల మొదటి, మూడో సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ ఫిబ్రవరి 17 నుంచి 28వ తేదీ వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు.

News February 4, 2025

శ్రీకాకుళం: 6న విజయ గౌరీ నామినేషన్

image

శ్రీకాకుళంలోని UTF భవనంలో సంబంధిత టీచర్ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పాల్గొన్నారు. ఆయన  మాట్లాడుతూ.. విశాఖలో ఫిబ్రవరి 6న పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ నామినేషన్ వేస్తారని చెప్పారు. ఇందులో అందరూ పాల్గొనాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్ మూర్తి, సహాధ్యక్షులు ధనలక్ష్మి,రవికుమార్ పాల్గొన్నారు.

News February 4, 2025

భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి: విశాఖ డీఐజీ

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డితో బందోబస్తు విధులు నిర్వహణ, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.

News February 3, 2025

శ్రీకాకుళం: కారులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

image

శ్రీముఖలింగేశ్వరుని దర్శనానికి వెళ్తున్న భక్తుల కారులో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం విశాఖ మద్దిలపాలానికి చెందిన ఐదుగురు భక్తులు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ, శ్రీకూర్మనాథుడిని సోమవారం దర్శించుకున్నారు. శ్రీముఖలింగం వెళ్తుండగా దొంపాక వద్ద కారులో మంటలు వ్యాపించాయి. దీంతో వారు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు నియంత్రించారు.