Srikakulam

News August 4, 2024

సీతంపేట: గిరిజన విద్యార్థులు టెట్, డీఎస్సీకి ఉచిత శిక్షణ

image

ఐటీడీఏ ఆధ్వర్యంలో టెట్, డీఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను పొందేందుకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ నెల 3 నుంచి 10వ తేదీ లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.

News August 3, 2024

శ్రీకాకుళంలో TODAY TOP HEADLINES

image

☛ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ☛ ఫిష్ హార్బర్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ☛ IIIT రెండో విడత కౌన్సెలింగ్ జాబితా విడుదల ☛ దివ్యాంగులకు అండగా ఉంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ ☛ రాగోలులో డీసీఎం-లారీ ఢీ ☛ ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీలు ☛ చంద్రబాబును ప్రజలు మనసారా దీవిస్తున్నారు: ఎమ్మెల్యే

News August 3, 2024

ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు

image

రాత్రి వేళలో ముమ్మురంగా పెట్రోలింగ్ చేయడంతో పాటు గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శనివారం రాత్రి ఆమదాలవలస మండల పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌లోని రిసెప్షన్ కేంద్రంతో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పలు ముఖ్యమైన డ్యూటీ రిజిస్టర్ నిర్వహణ క్షుణ్ణంగా చూసి, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సిబ్బంది సూచించారు.

News August 3, 2024

OMR ఆన్సర్ బుక్లెట్ల కోసం టెండర్ల ఆహ్వానం

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యార్థులు రాసిన పాత OMR ఆన్సర్ బుక్లెట్ల కోసం టెండర్లకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పీ.రజని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఏజెన్సీల నుండి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం పూర్తి వివరాలను https://drbrau.in/ పొందుపరిచామన్నారు.

News August 3, 2024

దివ్యాంగులకు అండగా ఉంటాం: కేంద్ర మంత్రి

image

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు హోటల్లో శనివారం సాయంత్రం వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆలింకో) సహకారంతో వికలాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.

News August 3, 2024

కేంద్ర మంత్రిని కలిసిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

image

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని శ్రీకాకుళం ఎస్పీ కే.మహేశ్వరరెడ్డి శనివారం కలిశారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మహిళా సంరక్షణ, లా అండ్ ఆర్డర్ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీతో కేంద్ర మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. యువత పెడదారిన పడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఈ భేటీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే ఉన్నారు.

News August 3, 2024

శ్రీకాకుళం: IIIT రెండో విడత కౌన్సెలింగ్ జాబితా విడుదల

image

శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం UG అడ్మిషన్లు-24కు సంభందించిన రెండో విడత కౌన్సెలింగ్ ఎంపిక జాబితాను శనివారం సంబంధిత అధికారులు విడుదల చేశారు. శ్రీకాకుళం క్యాంపస్ కు ఎంపిక అయిన వారు నూజివీడు క్యాంపస్‌లో ఈ నెల 9న కౌన్సెలింగ్ జరుగుతుందని వెల్లడించారు. వికలాంగులు, NCC, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన జాబితా వచ్చే వారంలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

News August 3, 2024

SKLM: డీసీఎం- లారీ ఢీ, తప్పిన పెను ప్రమాదం

image

శ్రీకాకుళం జిల్లా రాగోలు పరిధిలోని వాకలవలస జంక్షన్‌లో శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి వస్తున్న డీసీఎం లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోడ్డులో వాహనాలు రాకపోకలు ఎక్కువ ఉండడంతో మరింత ట్రాఫిక్ సమస్య నెలకొంది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ట్రాఫిక్ ని క్లియర్ చేసి క్రమబద్ధీకరించారు

News August 3, 2024

శ్రీకాకుళం: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలన

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం ప్రభుత్వం బాలుర డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల అధికారులతో ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులకు సలహాలు సూచనలు అందజేశారు. అందరికీ సరిపడే సిట్టింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

News August 3, 2024

ఎచ్చెర్ల: హార్బర్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

బుడగట్లపాలెం సముద్రతీరంలో నిర్మిస్తున్న ఫిషింగ్‌ హార్బర్‌ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ శనివారం తన పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే జరిపి హార్బర్ పనులకు అడ్డంకి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.