India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 08.00 నుంచి 04.00 గంటల వరకు జరగనుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 29వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయ పోస్టర్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
వజ్రపుకొత్తూరు మండలం వంకులూరు గ్రామానికి చెందిన లండ.రవి కుటుంబం గుజరాత్ రాష్ట్రం ముంద్రాకు వలస వెళ్లారు. మంగళవారం ఇంటిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలి లండ రవి కుమార్తె సజీవ దహనం అయింది. రవి భార్య కవిత హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు. మరణ వార్తతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)కు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి మొదటి సెమిస్టర్ పేపర్స్ వచ్చాయని “మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) నేటి నుంచి ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్ మొదలైన పేపర్స్ వచ్చాయన్నారు.
డీల్లీలో ఈ నెల 26న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ ప్రభుత్వం తరుపున ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మలు శకటాల ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మూడో స్థానంలో నిలవడం అభినందనీమయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మన సంస్కృతి చాటే సంప్రదాయ బొమ్మలకు జాతీయ స్థాయిలో పురష్కారం దక్కడం సంతోషంగా ఉందన్నారు.
శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)కు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి మొదటి సెమిస్టర్ పేపర్స్ వచ్చాయని “మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) రేపటి నుంచి ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్ మొదలైన పేపర్స్ వచ్చాయన్నారు.
కుంభమేళాకి శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి, ఏ.విజయకుమార్ బుధవారం తెలిపారు. శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో కుంభమేళాకి సంబంధించిన కరపత్రాలను/బ్యానర్లను ఆవిష్కరించారు. టికెట్లు www.apsrtconline.in ద్వారా శ్రీకాకుళం బస్ స్టేషన్లో పొందవచ్చని సూచించారు. వివరాలకు 99592 25608, 99592 25609, నంబర్లను సంప్రదించాలన్నారు.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో శిశువు తొడలో <<15299625>>ఇంజెక్షన్ సూది<<>> ఉండిపోయిన ఘటనపై బుధవారం జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఈమేరకు బుధవారం ‘టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం’ అనే శీర్షికతో Way2Newsలో కథనం రావడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనపై తక్షణమే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని టెక్కలి జిల్లా ఆసుపత్రి అధికారులను జిల్లా ప్రాంతీయ ఆసుపత్రుల సమన్వయకర్త (DCHS) ఆదేశించారు.
టెక్కలిలో జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఈ నెల 24న సంతబొమ్మాళి మండలం పెద్దమర్రిపాడు గ్రామానికి చెందిన టీ కల్పన అనే మహిళ ఆసుపత్రిలో డెలివరీ అయ్యింది. పుట్టిన మగ శిశువుకు ఆ రోజు మధ్యాహ్నం వ్యాక్సిన్ వేసే క్రమంలో ఇంజక్షన్ సూది శిశువు తొడ భాగంలో ఉండిపోయింది. దీన్ని కుటుంబసభ్యులు మంగళవారం గుర్తించారు. బుధవారం ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా స్పందించలేదని బాధితులు ఆరోపించారు.
ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల పరీక్షలు ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను జ్ఞానభూమి వెబ్సైట్, విశ్వవిద్యాలయ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామన్నారు. రీవాల్యుయేషన్కు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మార్కుల జాబితాలు విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు.
బావపై బావమరిది దాడి చేసన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు శ్రీకాకుళంలోని గోల్కొండరేవులో ఉన్న రామకృష్ణ, మొండేటీవీధికి చెందిన హేమలతను పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మంగళవారం అత్తవారి ఇంటికి వెళ్లిన రామకృష్ణ భార్య తనతో రావాలని గొడవ చేయగా బావ సతీష్ రాడ్డుతో దాడి చేశాడు. దీనిపై ఎస్సై ఎం. హరికృష్ణ కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.