India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలిలో జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఈ నెల 24న సంతబొమ్మాళి మండలం పెద్దమర్రిపాడు గ్రామానికి చెందిన టీ కల్పన అనే మహిళ ఆసుపత్రిలో డెలివరీ అయ్యింది. పుట్టిన మగ శిశువుకు ఆ రోజు మధ్యాహ్నం వ్యాక్సిన్ వేసే క్రమంలో ఇంజక్షన్ సూది శిశువు తొడ భాగంలో ఉండిపోయింది. దీన్ని కుటుంబసభ్యులు మంగళవారం గుర్తించారు. బుధవారం ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా స్పందించలేదని బాధితులు ఆరోపించారు.
ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల పరీక్షలు ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను జ్ఞానభూమి వెబ్సైట్, విశ్వవిద్యాలయ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామన్నారు. రీవాల్యుయేషన్కు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మార్కుల జాబితాలు విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు.
బావపై బావమరిది దాడి చేసన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు శ్రీకాకుళంలోని గోల్కొండరేవులో ఉన్న రామకృష్ణ, మొండేటీవీధికి చెందిన హేమలతను పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మంగళవారం అత్తవారి ఇంటికి వెళ్లిన రామకృష్ణ భార్య తనతో రావాలని గొడవ చేయగా బావ సతీష్ రాడ్డుతో దాడి చేశాడు. దీనిపై ఎస్సై ఎం. హరికృష్ణ కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పలాస, టెక్కలికి వెళ్లే బస్సులు రామలక్ష్మణ్ జంక్షన్ నుంచి పెద్దపాడు రోడ్డు మీదగా ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల సూచన మేరకు తాత్కాలికంగా బలగ జంక్షన్ నుంచి రాగోలు మీదుగా రాకపోకలు సాగిస్తాయని డిపో మేనేజర్ శర్మ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. యథాతథంగా రాకపోకలు సాగించేందుకు త్వరలో ప్రకటన విడుదల చేస్తామన్నారు.
అరసవెల్లి రథసప్తమి వేడుకలకు వచ్చే నెల 2, 3 తేదీలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్, జిల్లా స్థాయి వెయిట్లిఫ్టింగ్, గ్రామీణ క్రీడలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల విజేతకు రూ.లక్ష, జిల్లా స్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీల విజేతకు రూ.20 వేలు, గ్రామీణ క్రీడల విజేతలకు మొత్తం రూ.60 వేలు, చొప్పున ప్రైజ్ మని ఉంటుందన్నారు.
అరసవల్లి రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఫిబ్రవరి 3 నుంచి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ మంగ్లీ, జాతీయస్థాయి సంగీత కళాకారులు, నర్తకులు ఈ వేడుకలకు రానున్నారు.
కోటబొమ్మాళి మండలం పాడుగుపాడు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. స్థానికులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బోరుమజ్జిపాలేనికి చెందిన కరుకోల శ్రీనివాసరావు (55) పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు ఎస్సై వి సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ వారి ఆదేశాలు మేరకు ‘కోర్టుల సముదాయం టెక్కలిలో మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జి సీనియర్ సివిల్ జడ్జి ఛైర్మన్జె. శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పారా బ్యాడ్మింటన్లో జిల్లా క్రీడాకారుడు సతివాడ హిమ సాయి శేఖర్ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. కైరో(ఈజిప్ట్) వేదికగా ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు బి డబ్ల్యు ఎఫ్ పారా బ్యాడ్మింటన్ వరల్డ్ సర్క్యూట్ (గ్రేడ్ 2 లెవెల్ టు 2) పోటీలు జరిగాయి. శ్రీకాకుళం నగరానికి చెందిన హిమ సాయి శేఖర్ మన దేశం తరఫున పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఆడపిల్లల తక్కువ జననాలు సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, హిరమండలం, సంతబొమ్మాళి మండలాల్లో నమోదవుతున్నాయని వెంటనే ఆయాచోట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.