India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంతకవిటి మండలంలో గోళ్లవలస పంచాయతీలో జంట గ్రామాలుగా ఉన్న ఎస్సార్ అగ్రహారం, ఎమ్మార్ అగ్రహారం గ్రామాల ప్రజలను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వరపీడితులు ఉన్నారు. వందల మంది వరకూ టైఫాయిడ్ జ్వరాల బారిన పడి మంచం పట్టడంతో ఇరు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విజృంభించిన జ్వరాలు అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సారవకోట మండలంలోని 24 మంది సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీవో రాంబాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండలంలో 8,420 మంది సామాజిక భద్రత పింఛనుదారులు ఉండగా వీరికి పింఛను మొత్తాలు అందించడానికి 181 మంది సచివాలయ ఉద్యోగులను నియమించారు. ఈనెల 1న ఉదయం 5:30 గంటల నుంచి పింఛను మొత్తాలు అందించాలని సూచించినప్పటికీ 24 మంది ఉదయం 6:30 గంటల వరకు లాగిన్ కాకపోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు.
టెక్కలి డివిజన్ కేంద్రం పేరు చెబితే ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. పని చేసిన చోట పోస్టింగ్ అంటే చాలా మంది రావడం లేదు. రెవెన్యూ, పోలీసు ఇతర శాఖల అధికారులు సైతం టెక్కలి వచ్చేందుకు నిరాసక్తత చూపుతున్నారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అవి మంత్రి అచ్చెన్నాయుడు వెలికితీస్తారని భయపడుతునట్లు టాక్ నడుస్తోంది. టెక్కలి సబ్ కలెక్టర్, డీఎస్పీ స్థానాల విషయంలోను ఎలాంటి స్పష్టత రాలేదు.
కోటబొమ్మాళి మండలం రాయిపాడు గ్రామానికి చెందిన విశ్రాంతి తెలుగు ఉపాధ్యాయులు, ప్రముఖ ప్రవచనకారులు కోట రామారావు శుక్రవారం అనారోగ్యంతో తన స్వగ్రామంలో మృతి చెందారు. ఈయన మృతి పట్ల ప్రవచనకారులు సనపల కరుణ్కుమార్, ఎంపీపీ రోణంకి ఉమామల్లేశ్వరరావు, పేడాడ వెంకటరావు, బమ్మిడి గణపతి స్వామిలతో పాటు పలువురు ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి పరామర్శించారు.
ఉత్తరాంధ్రలో ఐటీఐ చేసిన విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ అదిరే శుభవార్త చెప్పింది. డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటింగ్, ఫిట్టర్, డ్రాప్ట్మన్(సివిల్) చేసిన ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్షిప్ కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జోనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. https://apprenticeshipindia.gov.in దరఖాస్తు చేసుకోవాలన్నారు.
డా. బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం దాని అనుబంధ పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి పీజీ, బీ.టెక్ రెండో సెమిస్టర్ పరీక్షల నిర్వహణ షెడ్యూల్ను వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డా.ఎస్.ఉదయ్ భాస్కర్ శుక్రవారం విడుదల చేశారు. ఈ రెండు పరీక్షలు వర్సిటీ కేంద్రంగా జరగనున్నాయి. పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలోని తన స్వగృహానికి చేరుకుంటారని, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన జిఎం, డీఆర్ఎంలతో సమీక్ష నిర్వహిస్తారని, మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ సన్రైజ్కు చేరుకుంటారని చెప్పారు.
రేపు శనివారం శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారిక ఖాతాలో తాజాగా ట్వీట్ చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అధికారులు స్పష్టం చేశారు.
BSNL దశలవారీగా 4G టెక్నాలజీని శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెడుతోందని వినియోగదారులు 2G/3G సిమ్ కార్డును తక్షణమే 4G సిమ్గా అప్గ్రేడ్ చేసుకోవాలని BSNL జిల్లా జనరల్ మేనేజర్ నాయుడు మర్రి శుక్రవారం పేర్కొన్నారు. 4Gకి అప్గ్రేడ్ చేసిన తర్వాత, 2G, 3G సేవలు కూడా కొనసాగుతాయన్నారు. తమ సిమ్ రకాన్ని (2G/3G/4G) 54040 కి “SIM” అనే సందేశాన్ని పంపించి తెలుసుకోవాలన్నారు.
పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా భువనేశ్వర్, చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణించే 2 రైళ్లకు అదనంగా 1 జనరల్ కోచ్ జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12830/12829 సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు 1 అదనపు జనరల్ కోచ్ జత చేస్తున్నామన్నారు. నం.12830 రైలుకు ఆగస్టు 8 నుండి సెప్టెంబర్ 26 వరకు, నం.12829 రైలుకు ఆగస్టు 9 నుండి సెప్టెంబర్ 27 వరకు అదనపు జనరల్ కోచ్తో నడుపుతామన్నారు.
Sorry, no posts matched your criteria.