India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో టెక్కలి సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ (ఈసీఈ) 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వర్షప్రియకు చోటుదక్కింది. ఈ మేరకు కళాశాల యాజమాన్యం శనివారం వివరాలు వెల్లడించింది. 17.15 నిమిషాలలో పెన్సిల్ కొన మీద 26 అక్షరాలు చెక్కినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించినట్లు తెలిపారు. యువతిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. కురుపాం మండలానికి చెందిన యువతి(30), భర్త పిల్లలను వదిలి సీతంపేట మండలానికి చెందిన యువకుడి(35)తో హైదరాబాద్ వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఇద్దరిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే క్రమంలో మార్గం మధ్యలో దిగి విషం తాగారు. కొద్ది సేపటికి నోటి వెంట నురగలు వచ్చాయి. వెంటనే ఇద్దరిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.
జిల్లా సంయుక్త కలెక్టర్(జేసీ)గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జేసీగా పని చేస్తున్నారు. ప్రస్తుత జేసీ ఎం.నవీన్ను సీఆర్డీఏ అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు. 2022 అక్టోబరు 12న నవీన్ జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు గడువును ఈ నెల 25 వ తేదీ వరకు పెంచారు. వెబ్ ఆప్షన్ ప్రక్రియ 26 తేదీ నుంచి 29 తేదీ వరకు ఉంటుందని తెలిపారు. సీట్ అలాట్మెంట్ వచ్చే నెల 3వ తేదీన ఇచ్చి 5వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం: ప్రయాణికులకు రైల్వే సూపర్ ఆఫర్ *ఈ నెల 23 నుంచి 27 వరకు జిల్లాలో ప్రత్యేక ఆధార్ డ్రైవ్ *మాదకద్రవ్యాల నిర్మూలనకి చర్యలు: రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అప్పారావు *రణస్థలం మండలం తోటపల్లి కాలువ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే *శ్రీకాకుళం జిల్లాకు తప్పిన వాయుగుండం ముప్పు: జేసీ నవీన్ *ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడి మృతి
ఇండియన్ రైల్వే ప్రత్యేక ఎయిర్ ప్యాకేజీలను ప్రారంభించినట్లు ఐఆర్సీటీసీ రీజనల్ మేనేజర్ డాక్టర్ క్రాంతి శనివారం తెలిపారు. థాయిలాండ్ టూర్ ఆరు రోజుల ప్యాకేజీ 7 సెప్టెంబరు నుంచి 12వ తేదీ వరకు, దక్షిణ దివ్య ఆలయ పర్యటన ప్యాకేజీ 6 రోజులకి 14 ఆగస్టు నుంచి 19వ తేదీ వరకు తక్కువ ధరలకు ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల ప్రయాణికులు 92810 30748 సంప్రదించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆధార్ ప్రత్యేక డ్రైవ్ లో ఐదేళ్ల లోపు పిల్లలకు బాల ఆధార్ చేయుట, బయోమెట్రిక్ అప్డేట్స్, అలాగే ఆధార్ లో మార్పులు చేర్పులు వంటివి చేస్తారన్నారు. ఈ ఆధార్ స్పెషల్ క్యాంపులను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో సూరాడ లక్ష్మణ (40) శనివారం ఉదయం చేపల వేటకు వెళ్లగా అలల తాకిడికి దుర్మరణం చెందారు. అటుగా వెళ్లిన జాలర్లు మృతదేహాన్ని గుర్తించారు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన తహశీల్దార్లు సొంత జిల్లాకు రానున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన 45మంది తహశీల్దార్లు ఒకటి లేదా 2రోజుల్లో తిరిగి రానున్నారు.
వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారుల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ కృష్ణమూర్తి తెలిపారు. తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజలు తమ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల ఫిర్యాదు చేసేందుకు 9490612633 హెల్ప్ డెస్క్ నంబరును సంప్రదించాలని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1912కు విద్యుత్ సమస్య వస్తే కాల్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.