India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం మండలంలో బుధవారం రాత్రి 10:56 గంటల సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్ప ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
మెళియాపుట్టి పరిసర ప్రాంతాల్లో బుధవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై తీస్తున్న సినిమా చిత్రీకరణ మండలంలోని కరజాడలో బుధవారం జరిగింది. హీరో, హీరోయిన్లుగా గోపాల్ రెడ్డి, శృతి, ప్రధాన పాత్రల్లో డా.కుమార్ నాయక్, ఆశిష్ చోటు ఉన్నారని సినిమా దర్శకుడు శివశంకర్ తెలిపారు. వీరితో పాటు నిర్మాత స్వాతి ఉన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, ఒడియా మూడు భాషల్లో విడుదల కానుంది.
విశాఖపట్నంలో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బుధవారం ఉదయం నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యవేక్షించారు. పలువురు అధికారులతో వారితో మాట్లాడి సూచనలు చేశారు.
కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి చెందిన తమరాల అవినాశ్కి ఒకేసారి రెండు బ్యాంక్ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో కెనరా బ్యాంక్, ఏపీజీవీబీ పీఓ ఉద్యోగాలు సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సాధారణ కుటుంబ నేపథ్యం గల యువకుడు ఒకేసారి రెండు బ్యాంక్ ఉద్యోగాలు సాధించడంపై కుటుంబసభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎచ్చెర్ల మండల పరిధిలో వివిధ చోరీలకు పాల్పడుతున్న అనుమానితుడిని పోలీసులు విచారించగా మొత్తం కక్కేశాడు. గత నెలలో కేశవరావుపేట గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో బంగారం పోయింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రెండు నెలల క్రితం ఫరీదుపేటలో ఓ మహిళ ఇంట్లో బంగారం చోరీకి గురవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఫైనాన్స్లో బంగారం తనఖా పెట్టినట్లు చెప్పాడు.
విశాఖలో ప్రధాని మోదీ సభకు వచ్చే ప్రజలకు మధ్యాహ్నం పులిహోరా, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్ రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వనున్నారు. GVMC పరిధిలో వాహనాలు బయలుదేరే చోటే ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయనున్నారు. అనకాపల్లి, విజయనగరం నుంచి వచ్చేవారికి ఆ జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి నాతవలస చెక్పోస్టు వద్ద ఆహారం అందిస్తారు.
కంచిలి మండలానికి చెందిన అంకుల శణ్ముఖరావు(51) అనే వ్యక్తిని తన భార్య మంగళవారం వేకువజామున హత్యచేసింది. సుమారు ఆరు నెలలుగా దంపతులు ఇద్దరు రంగారెడ్డి జిల్లా ఆధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూలిపనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇరువురు మద్యం మత్తులో గొడవపడటంతో భర్తపై ఉమాపతి తీవ్రంగా దాడిచేయడంతో ఆయన మృతిచెందాడు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
టెక్కలి మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావుతో పాటు 13 మందిపై 2022 ఫిబ్రవరిలో నమోదైన కేసు కొట్టివేస్తూ మంగళవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి SHR తేజాచక్రవర్తి తీర్పు వెల్లడించారు. 2022లో టీడీపీ నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన క్రమంలో అప్పటి టెక్కలి మండల పరిషత్ అధికారి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేనందున కేసును కొట్టివేసినట్లు న్యాయవాది ప్రభుచంద్ తెలిపారు.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.