India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావుతో పాటు 13 మందిపై 2022 ఫిబ్రవరిలో నమోదైన కేసు కొట్టివేస్తూ మంగళవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి SHR తేజాచక్రవర్తి తీర్పు వెల్లడించారు. 2022లో టీడీపీ నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన క్రమంలో అప్పటి టెక్కలి మండల పరిషత్ అధికారి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేనందున కేసును కొట్టివేసినట్లు న్యాయవాది ప్రభుచంద్ తెలిపారు.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో ఓటర్ల జాబితా సోమవారం సాయంత్రం జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకటేశ్వరరావు విడుదల చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న ఓటర్లు 15,037 మంది ఉన్నట్లు ప్రకటించారు. దీనిలో నరసన్నపేటలో 2,347 మంది, ఎచ్చెర్ల లో 2884, ఆమదాలవలసలో 2105, శ్రీకాకుళం 2,661, పాతపట్నం 1,952, టెక్కలి 2,606, పలాస 2,301, ఇచ్చాపురంలో 2,459 మంది యువ ఓటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
సంక్రాంతి నేపథ్యంలో శ్రీకాకుళం రోడ్డు (ఆముదాలవలసకు) రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 7,8,9,10,12,13, 14,15 తేదీల్లో చర్లపల్లి, కాచిగూడ నుంచి శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ఈమేరకు సంక్రాంతి పండుగకు జిల్లాకు రానున్న ప్రయాణీకులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకులు టిక్కెట్లు బుక్కింగ్ కొరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలో సోమవారం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు వావిలపల్లి సురేశ్(25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మడకముడిగాం గ్రామానికి చెందిన యువకుడు పోర్టులో భోజనాలు అందించే వర్కర్గా పనిచేస్తున్నాడు. కాగా మృతదేహాన్ని సంతబొమ్మాళి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సింహాచలం తెలిపారు.
వాక్ఫ్ ఆస్తుల సమగ్ర సర్వే చేపట్టి రెవెన్యూ అధికారుల సమక్షంలో హద్దులు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా మైనార్టీ అధికారి మెంబర్ అండ్ కన్వీనర్ ఆర్ ఎస్ జాన్ సమక్షంలో జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని వాక్ఫ్ ఆస్తులను ఏడీ సర్వే ద్వారా సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.
పొందూరు తోలాపి గ్రామానికి చెందిన బొనిగి రమణారావు ఛత్తీసగఢ్ CRPF జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన పండగ సెలవులకు స్వగ్రామానికి వచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం వాష్ రూమ్కు వెళ్లారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఆమదాలవలసలో ఓ మైనర్ బాలికపై అదే వీధికి చెందిన కోటిపల్లి రాజు (23) మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన విధితమే. ఈ మేరకు సోమవారం ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని అన్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు పోలీసులు ఉన్నారు.
బాలికను ప్రేమ పేరుతో గర్భిణిని చేసిన ఘటన ఆమదాలవలస మండలంలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన కె.రాజు ప్రేమ పేరుతో బాలికకు దగ్గరయ్యాడు. రెండేళ్లుగా ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో లైంగికంగా దాడి చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో బాలిక గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై పోక్సో కేసు నమోదు చేశామని డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు.
Sorry, no posts matched your criteria.