Srikakulam

News January 2, 2025

SKLM: రథసప్తమి వేడుకల కోసం నేడు భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ

image

అరసవల్లి రథసప్తమి మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భక్తుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10 గంటలకు భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షత వహించనున్నారు.

News January 1, 2025

శ్రీకాకుళం జిల్లాలో రూ.5.5 కోట్ల అమ్మకాలు

image

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లాలో ఒక్క రోజు సుమారు రూ.5.5 కోట్ల అమ్మకాలు చేపట్టినట్లు Excise అధికారులు బుధవారం తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా మందుబాబులు మద్యం కోట్లలో కొనుగోలు చేశారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రావడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగినట్లు పలువురు అంచనా వేస్తున్నారు.

News January 1, 2025

SKLM: అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు: ఎస్పీ

image

స్టైపెండరీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్‌లో భాగంగా అభ్యర్థులు ఎవరూ దళారులు, పోలీసు ఉద్యోగులు ఇప్పిస్తామంటూ చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నోటిఫికేషన్ నిబంధనలు అనుసరించి జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా శారీరక దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామన్నారు. 

News January 1, 2025

SKLM: రథసప్తమి వేడుకల కోసం నేడు భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ

image

అరసవల్లి రథసప్తమి మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భక్తుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10 గంటలకు భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షత వహించనున్నారు.

News January 1, 2025

SKLM: ఎస్సీ కులగణన అభ్యంతరాల స్వీకరణ ఈనెల 7 వరకు పొడిగింపు

image

ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును ఈనెల 7 వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. డిసెంబర్ 31తో గడువు ముగియడంతో ప్రభుత్వం మరొక వారం రోజులు పొడిగించింది. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి స్వీకరించిన వివరాలను 11 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారన్నారు.

News January 1, 2025

శ్రీకాకుళం: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు

image

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం వివరాలు వెల్లడించారు. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 1, 2025

పలాస: బియ్యం గింజ సైజులో “వెల్కమ్ 2025” లోగో

image

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, బియ్యం గింజ సైజులో ‘వెల్కమ్ 2025 బంగారపు లోగో’ను తయారుచేశారు. పలాస-కాశీబుగ్గ గాంధీనగర్‌కు చెందిన ప్రముఖ సూక్ష్మశిల్పి, స్వర్ణరత్న బ్రహ్మర్షి కొత్తపల్లి రమేష్ ఆచారి. కేవలం 0.30 మిల్లీ గ్రాముల బంగారాన్ని ఉపయోగించి, కేవలం అర సెంటీమీటర్ ఎత్తు, అర సెంటీమీటర్ వెడల్పు ఈ లోగో తయారు చేశారు. సుమారు ఐదు గంటల సమయం పట్టినట్లుగా రమేష్ మంగళవారం తెలిపారు.

News January 1, 2025

నూతన సంవత్సర శుభాకాంక్షలు: శ్రీకాకుళం ఎస్పీ

image

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు 2025 నూతన సంవత్సరంలో ఏర్పరుచుకున్న, నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించి, వేడుకలను ప్రశాంతంగా ఇళ్ల వద్దనే జరుపుకోవాలన్నారు.

News December 31, 2024

SKLM: గతేడాది కంటే 17శాతం నేరాలు తగ్గుముఖం: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో ముందస్తు నిఘా, సమాచార సేకరణ, సత్వర స్పందన, సమర్థవంతమైన నియంత్రణ వల్ల శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో 2024 నేర గణాంకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 2023లో 11,017 కేసులు నమోదు అవ్వగా 2024లో 9,434 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 2023 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య 17 శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు.

News December 31, 2024

టీడీపీ సభ్యత్వ నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించండి: రామ్మోహన్

image

ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన అవకాశం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమమని ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సభ్యత్వ నమోదుకి డిసెంబర్ 31 చివరి రోజు కావడంతో పార్టీ సభ్యత్వ నమోదు కాని గ్రామాలలో, వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిందిగా కోరారు. సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొనవలసిందిగా కోరారు.