India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం, పలాస మీదుగా తిరునల్వేలి(TEN), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. ఈ మేరకు నం.06087 TEN- SHM ట్రైన్ను జులై 18, 25 తేదీలలో, నం.06088 SHM- TEN ట్రైన్ను జులై 20, 27 తేదీలలో నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.
BR అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకై(ఇయర్ ఎండ్) స్పెషల్ డ్రైవ్ పరీక్షల నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. 2011-15 మధ్య అడ్మిషన్ తీసుకున్న డిగ్రీ విద్యార్థులు రాయాల్సిన ప్రాక్టికల్, థియరీ పరీక్షలకై విద్యార్థులు ఆగస్టు 14లోపు ఫీజు చెల్లించాలని వర్శిటీ సూచించింది. ఆగస్టు 22 నుంచి ప్రాక్టికల్స్, సెప్టెంబరు 3 నుంచి థియరీ పరీక్షలు జరుగుతాయని, వివరాలకు వర్శిటీ అధికారిక వెబ్సైట్ చూడాలంది.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జమ్మూకశ్మీర్లోని అనంత్ నాగ్లో ఉగ్రవాదుల దాడులలో వీరోచితంగా పోరాడి అమరులైన జిల్లాకు చెందిన జవాన్లు డి.రాజేశ్, జగదీశ్వర్ రావుకు జోహార్లు అర్పించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషయం వారి కుటుంబాలతో మాట్లాడి పార్థివ దేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, వారికి అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.
జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన సనపల జగదీశ్వరరావు, డొక్కరి రాజేష్ అనే ఇద్దరు సైనికులు మృతిచెందడం తీవ్ర బాధాకరం అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈమేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. దేశసేవలో సైనికులుగా ఉన్న జవాన్లు మృతిచెందడం చాలా బాధాకరం అన్నారు.
జమ్మూకశ్మీర్లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలానికి చెందిన డొక్కరి రాజేశ్(25) అనే జవాన్ కూడా మృతిచెందారు. ఇదే ఘటనలో నందిగం మండలానికి చెందిన సనపల జగదీశ్వరరావు అనే జవాన్ మృతి చెందిన విషయం విదితమే. కాగా సంతబొమ్మాళి మండలానికి చెందిన రాజేశ్ మృతిచెందటంతో టెక్కలి నుంచి ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.
టెక్కలి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు గుర్తుతెలియని వ్యక్తులు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు అజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో జనవరి- 2024లో నిర్వహించిన MBA 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. MBA -ఫారిన్ ట్రేడ్, రూరల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రాంచ్ల ఫలితాలు విడుదల చేశామని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) ద్వారా ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. సోమవారంతో గడువు ముగియగా, జులై 31 వరకు గడువు పొడిగించినట్లు వర్శిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు శ్రీకాకుళంలోని ఇగ్నో స్టడీ సెంటర్లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.
శ్రీకాకుళం జిల్లాలోని డా.బి.ఆర్ అంబేడ్కర్ గురుకులంలో గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి బాలాజీ నాయక్ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. కొల్లివలసలో జేఎల్ మ్యాథ్స్, కంచిలిలో జేఎల్ కెమిస్ట్రీ, ఎచ్చెర్లలో జేఎల్ జువాలజీ, పాతపట్నంలో టీజీటీ బయాలజీ, పీజీటి సోషల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 18న ఉదయం 10గంటలకు ఆదివారం పేట కార్యాలయంలో హాజరు కావాలని కోరారు.
విజయవాడ డివిజన్లో ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం, పలాస మీదుగా వెళ్లే నం.12509 SMV బెంగుళూరు- గౌహతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ జులై 29 నుంచి ఆగస్టు 30 వరకు విజయవాడ- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.