India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం పితాతొలి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పలాస నుంచి మందసకు వెళ్తుండగా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో సొండిపూడి లైన్ మేన్ జోగారావుతో పాటు మరో యువకుడు కిరణ్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విశాఖ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఓడ రేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీచేశారు.
పీఠాపురంలో ఈ నెల 18,19,20 తేదీల్లో సీనియర్ మెన్ బాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ జ్ఞానేశ్వర్రావు, పి.అప్పలరాజు, హేమంత్ కుమార్లు గోల్డ్ మెడల్ పొందారు. వీరితో పాటు పి.విశ్వేశ్వరరావు, ఎం.లోకేష్, ఎస్.ఏసు, కె. శ్రీకాంత్, డి.మనోజ్ కుమార్లు సిల్వర్ మెడల్ సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్-2ని కైవసం చేసుకున్నారు. వీరిని బుధవారం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందించారు.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో వెన్నెల కిశోర్ నటించిన ‘శ్రీకాకుళం షేర్లాక్హోమ్స్’ సినిమా నేడు రిలీజైంది. భీమిలి బీచ్లో హత్యకు గురైన ఓ మహిళ కేసు ప్రైవేట్ డిటెక్టివ్ హీరో వెన్నెల కిషోర్ చేతికి ఎలా వచ్చింది? ఆయన కేసును ఎలా చేధించారనేది కథాంశం. కాగా హీరో పాత్ర బలంగా లేకపోవడం, థ్రిల్లింగ్ అంశాలు కొరవడటం సినిమాకు మైనస్. కొన్ని ట్విస్టెడ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. మూవీపై మీ కామెంట్.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో బుధవారం వేకువజామున మగ శిశువు మృతిచెందాడు. నందిగాం మండలం కైజోల గ్రామానికి చెందిన శ్రావణి డెలివరీకి అడ్మిట్ అయ్యారు. బుధవారం వేకువజామున పురిటినొప్పులు అధికం కావడంతో సాధారణ కాన్పులో బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే అస్వస్థతకు గురైన శిశువు కొద్దిసేపటికి మృతిచెందింది. శిశువు మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణమని బంధువులు ఆసుపత్రిలో నిరసన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా క్రైస్తవ సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించి క్రిస్మస్ పండగ జరుపుకోనున్న ప్రతి ఒక్కరుకి జిల్లా ఎస్పీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండగ వేళ ప్రతి ఒకరు జీవితంలో వెలుగులు రావాలని చెప్పారు. దేవుడు మీ పట్ల దయ చూపాలని పేర్కొన్నారు.
కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు <<14965595>>మృతి<<>> చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్నం సీతమ్మధార నుంచి ఒడిశాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది. ఓవర్ స్పీడ్తో వెళ్తున్న కారు కరెంట్ పోల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విశాఖలోని సీతమ్మధారకు చెందిన కదిరిశెట్టి సోమేశ్వరరావు(48), ఎం.లావణ్య(43), స్నేహగుప్తా(18) మరణించారు.
జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ నూతన కమిటీని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం ప్రకటించారు. ఈ కమిటీల్లో భాగంగా సారవకోట మండలానికి చెందిన రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావును సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ ఎస్టీ కులం నుంచి తనను ఎంపిక చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు మంగళవారం ఉదయం కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర కాలేజీల సెలవుల షెడ్యూల్ను విడుదల చేశారు. దీని ప్రకారం ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రిస్మస్ సెలవులని వర్శిటీ రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అలాగే జనవరి 10వ తేదీ నుంచి అదే నెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులని.. తిరిగి కళాశాలలు జనవరి 20న రీఓపెన్ చేయాలని ఆదేశించారు.
అల్పపీడనం ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సోమవారం తెలిపారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ వివరాలు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.