Srikakulam

News July 7, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

* ప్రతి ఎకరానికి సాగునీరు: కలెక్టర్
* 104 సిబ్బంది సమస్యలను పరిష్కరించండి: వైద్య సిబ్బంది
* థాంక్యూ సీఎం కార్యక్రమంలో రక్తదానం
* విధుల్లో నిర్లక్ష్యం.. ఉద్యోగి సస్పెండ్
* కేజీబీవీ సిబ్బందిపై అధికారుల ఆగ్రహం
* రెండు వరుస అల్పపీడనాలు: నిపుణులు
* నెల రోజుల్లో సాగునీరు అందించాను: గౌతు శిరీష
* మలేరియాతో చిన్నారి మృతి

News July 7, 2024

శ్రీకాకుళం: విధుల్లో నిర్లక్ష్యం.. ఉద్యోగి సస్పెండ్

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని సాంఘీక సంక్షేమ బాలురు కళాశాల వసతిగృహంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి డీ.ఎర్రన్నాయుడును సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టి.. రుజువవ్వడంతో ఆదివారం ఆయనని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News July 7, 2024

ఆమదాలవలస: కుప్పిలికి రాష్ట్ర స్థాయి బహుమతి

image

ఆమదాలవలస పట్టణానికి చెందిన సాహితీవేత్త, కవి, తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు కుప్పిలి వెంకటరాజారావుకు రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. నెల్లూరుకు చెందిన అక్షరం సంస్థ గతనెలలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన కవితల పోటీల్లో రాజారావు రచించిన ‘ఆ వేలి చుక్కకు ఎప్పుడూ చుక్కెదురే’ అనే
కవితకు ప్రథమ బహుమతి లభించినట్లు రాజారావు ఆదివారం తెలిపారు.

News July 7, 2024

శ్రీకాకుళంలో అతిపెద్ద జగన్నాథ రథం ఇక్కడే

image

పాలకొండ పట్టణంలోని జగన్నాథ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఒడిశాకి చెందిన జైపూర్ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏటా రథయాత్ర ఉత్సవాలు ఒడిశా సంప్రదాయంలోనే నిర్వహిస్తారు. ఇక్కడి జగన్నాథ రథం జిల్లాలోనే అతిపెద్దది. ఉత్తరాంధ్ర, ఒడిశా భక్తులు కూడా స్వామివారి ఉత్సవాలలో పాల్గొంటారు. పూరీ తర్వాత అంతటి నిష్ఠతో ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వేల మంది భక్తులు హాజరవుతారు.

News July 7, 2024

SKLM: ఒడిశా బీచ్‌‌లో దారుణ హత్య.. ముగ్గురు అరెస్ట్

image

ఇచ్చాపురానికి చెందిన బాలురెడ్డిని ముగ్గురు వ్యక్తులు ఒడిశా బీచ్‌లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మండలంలోని బెల్లుపడకు చెందిన ఏదురు రాజు, బలరాంపురానికి చెందిన బాకి గణేశ్, లొద్దపుట్టికి చెందిన సాలిన దుర్యోధనను నిందితులుగా గుర్తించి ఒడిశా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కత్తెర, కారు, సెల్‌ఫోన్ రూ.20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

News July 7, 2024

బారువ తీరంలో పడవ బోల్తా.. మత్స్యకారుడి మృతి

image

బారువ-కొత్తురు గ్రామానికి చెందిన వలిశెట్టి జోగరావు తోటి మత్స్యకారులతో కలిసి ఆదివారం వేకువజామున సముద్ర వేటకు బయలుదేరారు. ఇంతలో రాకాసి అలలకు తెప్ప బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జోగరావు మరణించగా మిగత మత్స్యకారులు దానయ్య, సింహాచలం, కుమార్ స్వామి, భాస్కరావు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. జోగరావు కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకార పెద్దలు కోరుతున్నారు.

News July 7, 2024

సరుబుజ్జిలి: మలేరియాతో చిన్నారి మృతి

image

సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల మూడో తరగతి విద్యార్థి బిడ్డిక రశ్మిత మలేరియాతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. పాఠశాలలో చిన్నారికి జ్వరం రావడంతో సరుబుజ్జిలి పీహెచ్సీ వైద్యులు చికిత్స చేశారు. వైద్యుల సలహా మేరకు ఈనెల 5న మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. బాలిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 7, 2024

రాజాం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

image

మానసిక పరిస్థితి బాగలేకపోవడంతో రాజాం మండలం పరశురాంపురం గ్రామానికి చెందిన బెవర అప్పలరాము పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాజాంలోని సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. భార్య అన్నపూర్ణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 7, 2024

ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ రాజీనామా

image

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ కేవీజీడీ బాలాజీ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని ఈ-మెయిల్‌ ద్వారా ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కె.సి రెడ్డికి పంపారు. 2023 నవంబరు 18న బాలాజీ బాధ్యతలు స్వీకరించినట్లు ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది తెలిపారు.

News July 7, 2024

శ్రీకాకుళం: అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

image

భారత ప్రభుత్వం అగ్నివీర్ వాయుసేన విభాగంలో అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొత్తలంక సుధా శనివారం తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 8 నుంచి 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులని స్పష్టం చేశారు.