Srikakulam

News December 17, 2024

రాజాం: Way2News కథనానికి స్పందన

image

 రాజాం మండలం <<14900613>>గెడ్డవలస<<>>లోని గ్రామస్థులు విషజ్వరాల బారిన పడ్డారని  Way2News లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎంపీడీఓ శ్రీనివాసరావు  గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం వైద్యులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురిని పరీక్షించారు. ఎంపీడీఓ గ్రామంలో పర్యటించి జ్వర పీడితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇవి అదుపులోకి వచ్చేంత వరకు శిబిరం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.  

News December 17, 2024

టెక్కలి: మేస్త్రి కుమారుడికి ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

image

టెక్కలి మండలం స్థానిక ఎన్టీఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న పైల గణేశ్ ఇటీవల విడుదలైన CRPF, SSC GD, INDIAN NAVY SSR ఫలితాల్లో విజేతగా నిలిచి మూడు ఉద్యోగాలు సాధించాడు. తండ్రి పైల రాము ఒక సాధారణ తాపీ మేస్త్రి. చిన్నప్పటి నుంచి కష్టాలు తెలిసిన గణేశ్ సరైన ప్రణాళికతో ప్రభుత్వ ఉద్యోగం పొంది పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు, బందువులు గణేశ్‌ను అభినందించారు.

News December 17, 2024

టీడీపీ నేత హత్యకు స్కెచ్? ఉలిక్కిపడ్డ పలాస

image

పలాస TDP నేత హత్యకు బిహార్ గ్యాంగ్ స్కెచ్ వేసిందనే వార్త శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. టెక్కలిలో అనుమానాస్పదంగా కనిపించిన బిహార్‌కు చెందిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరు పలాస టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజుని చంపేందుకు స్కెచ్ వేసినట్లు పలు పత్రికలు పేర్కొన్నాయి. దీనిపై మంత్రి అచ్చెన్న, MLA గౌతు శిరీష సీరియస్ అయ్యారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు.

News December 16, 2024

పలాసలో బీహార్ గ్యాంగ్‌పై మంత్రి అచ్చెన్న సీరియస్

image

పలాసలో టీడీపీ నేతను హత్య చేసేందుకు బీహర్ ముఠా వేసిన పన్నాగంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. దీని వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా శిక్షించాలన్నారు.

News December 16, 2024

SKLM:ఎస్సీ వర్గీకరణ పై ఏకసభ్య కమిషన్ పర్యటన

image

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉప-వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ సోమవారం జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఈనెల16 నుంచి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సోమవారం జరిగిన సమావేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో పాల్గొన్నారు.

News December 16, 2024

పోలీసు నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: దువ్వాడ

image

టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు దువ్వాడకు 41ఏ నోటీసులు జారీచేసిన విషయం విదితమే. నోటీసులపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని దువ్వాడ అన్నారు. రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని అన్నారు. అధికారంలో ఉన్నపుడు తాను అవినీతి చేయలేదన్నారు.

News December 15, 2024

SKLM: బ్యాట్ పట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్

image

టీబీ ముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో లోక్‌సభ XI- రాజ్యసభ XI టీమ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్‌ ఆదివారం జరిగింది. ఈ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనడం గర్వంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. టీబీ వ్యాధిని 2025 నాటికి నిర్మూలించాలని ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాన్ని చేపట్టామని టీబీపై అవగాహన ఉండాలన్నారు.

News December 15, 2024

ఒకే ఊర్లో నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు

image

సంతకమిటి మండలం మల్లయ్యపేటలో రైతు కుటుంబం నుంచి ssc ఫలితాలలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఒక చిన్న గ్రామంలో నలుగురు ఉద్యోగాలు పొందడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన బొడ్డేపల్లి రాజశేఖర్(BSF), పేడాడ భవాని(BSF), పొట్నూరు శివప్రసాద్ సీఆర్పిఎఫ్, పోతిన శివ ఏఆర్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News December 15, 2024

వదినకు అంత్యక్రియలు చేసిన ఆడపడుచు

image

నరసన్నపేట మండలం ఉర్లాంలోని నివసిస్తున్న దొంపాక వరహాలమ్మ ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం బారిన పడి ఆమె శనివారం మృతి చెందింది. వరహాలమ్మ తమ్ముడు కొన్నేళ్ల క్రితం మరణించారు. అయితే ఆమె మృతి విషయం తెలుసుకున్న వరహాలమ్మ తమ్ముడి భార్య లక్ష్మి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతురాలికి ఎవరూ లేకపోవడంతో తానే స్వయంగా ఆడపడుచుగా లక్ష్మీకి తలకొరివి పెట్టింది.

News December 15, 2024

శ్రీకాకుళ: జిల్లాలో 2,606 నీటి సంఘాలకు ఎన్నికలు పూర్తి

image

జిల్లాలోని BRR వంశధార, నారాయణపురం ఆనకట్ట, మైనర్ ఇరిగేషన్ కింద మొత్తం 2,628 నీటి సంఘాల ప్రాదేశిక స్థానాలకు శనివారం ఎన్నికలు జరగగా 2606 స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. పలు కారణాలతో ఇంకా 22 ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 344 నీటి సంఘాలకు గాను రెండు మినహా మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా ఎన్నికల ఘట్టం ముగిసింది. గెలుపొందిన వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.