Srikakulam

News December 7, 2024

శ్రీకాకుళం: హత్యకు దారి తీసిన భూవివాదం

image

శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో ఓ వ్యక్తి శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇదే గ్రామానికి చెందిన రాజేశ్ (38), రాములపై నలుగురు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. రాముకు తీవ్రగాయాల్యయి. స్థానిక కుటుంబంతో భూవివాదాలపై జరిగిన గొడవలు ఈ హత్యకు కారణమని ఎస్సై జనార్దన్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News December 6, 2024

SKLM: సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్

image

సిక్కోలు జిల్లా వాసి ఒకరు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. జలుమూరు(M) లింగాలవలసకు చెందిన జి.సంతోష్(34) HYDలో క్యాబ్ నడుపుతూ తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. స్కూల్ ఫీజ్ కోసం చింటూ అనే వ్యక్తి దగ్గర రూ.60వేలు అప్పు తీసుకున్నారు. 3నెలలు వడ్డీ చెల్లించాక కారు రిపేర్‌ కావడంతో డబ్బులు కట్టలేకపోయారు. చింటూ నుంచి వేధింపుల రావడంతో మంగళవారం సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకున్నాడు. నిన్న కేసు నమోదైంది.

News December 6, 2024

ఎచ్చెర్ల: ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం

image

ఎచ్చెర్లలోని పోలీస్ మైదానంలో 62వ హోంగార్డు ఆవిర్భవ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలోని హోంగార్డుల సేవలను ఎస్పీ కొనియాడారు. వాళ్ల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News December 6, 2024

జగన్‌తో సమావేశానికి ధర్మాన, దువ్వాడ గైర్హాజరు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ బుధ, గురువారం కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడంతో పలు అంశాలపై చర్చించారు. ఇంతటి కీలకమైన సమావేశానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరు కాలేదు. ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నారు. కీలకమైన సమావేశానికి సైతం గౌర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ సైతం ఈ సమావేశానికి రాలేదు.

News December 6, 2024

శ్రీకాకుళం: ఈనెల 12 నుంచి డిగ్రీ పరీక్షలు

image

శ్రీకాకుళంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రధమ సంవత్సర విద్యార్థులకు ఈనెల 12వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ.. 12 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

News December 6, 2024

శ్రీకాకుళం: జీజీహెచ్ పాఠశాలను విజిట్ చేసిన కలెక్టర్ 

image

శ్రీకాకుళం పట్టణ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను గురువారం సాయంత్రం కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఈనెల 7వ తేదీన జరగబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాట్లు కోసం సమీక్షించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలను అందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ విజయ కుమారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. 

News December 6, 2024

శ్రీకాకుళం: ‘ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి’

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, కొనుగోలుకు సంబంధించి సకాలంలో చెల్లింపులు జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు.

News December 6, 2024

శ్రీకాకుళం: స్పోర్ట్స్ స్కూల్‌కు డీపీఆర్ పంపాలి

image

రహదారి పనులకు ప్రతిపాదనలు తక్షణమే పంపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐటీడీఎ అధికారులను ఆదేశించారు. ఐటీడీఎ సంక్షేమం, అభివృద్ధి పథకాలపై అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ కార్యాలయ మందిరంలో గురువారం ఆయన సమీక్షించారు. ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. 

News December 5, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

డాక్టర్. బీఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలను యూనివర్సిటీ డీన్ గురువారం విడుదల చేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

News December 5, 2024

ఆమదాలవలస: ‘ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోండి’

image

ఆమదాలవలస పెద్ద జొన్నవలస గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లయర్స్ ఎండీ మంజీర్ జిలాని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి ఫర్మానా అహ్మద్ ఖాన్, ఎమ్మార్వో రాంబాబు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.