Srikakulam

News October 9, 2025

శ్రీకాకుళం: రూ.40.23 కోట్లతో రోడ్ల అభివృద్ధి.!

image

శ్రీకాకుళం జిల్లాలో రూ.40.23 కోట్ల ఖర్చుతో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 101.15 కిలోమీటర్ల మేర గుంతలు లేని రోడ్లు మరమ్మతులు కోసం ఈ నిధులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో జిల్లాలోని ఆర్ అండ్ బి, ప్రధాన, జాతీయ రహదారులు అభివృద్ధి జరగనున్నాయి. ఆయా రోడ్డుల అభివృద్ధికి జిల్లా ఆర్ అండ్ బి అధికారులు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

News October 9, 2025

ఎల్.ఎన్.పేట: ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి యువకుడు మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం జంబాడ గ్రామానికి సమీపంలోని కడగండి రిజర్వాయర్లో నిమ్మక సతీష్ (23) ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. బుధవారం సాయంత్రం రిజర్వాయర్ వద్దకు జంబాడ గ్రామానికి చెందిన నిమ్మక సతీష్, కొండగొర్రె లక్ష్మీనారాయణ, పాలక సతీష్ వెళ్లారు. రిజర్వాయర్ మదుము (కాన) వద్ద నిమ్మక సతీష్ దిగి మదములో పడిపోయాడు. ఆసుపత్రికి తరలించిగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 9, 2025

‘మద్యం తాగి వీరంగం ..45 రోజులు జైలు శిక్ష’: SKLM SP

image

మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన తమిరి సాయి (24)కి కోర్టు 45 రోజుల జైలు శిక్ష విధించారని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి బుధవారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. సాయి అనే యువకుడు మద్యం తాగి పోలీసులకు పట్టుబడి వీరంగం చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. SKLM సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారించి జైలుశిక్ష విధించింది.

News October 9, 2025

SKLM: ‘ఈ నెల 10న ZP స్థాయి సంఘం సమావేశం’

image

ఈనెల 10న జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని సీఈవో డీ. సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి వివిధ స్థాయిల్లో జరగనున్న సమావేశాలకు విధిగా ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని ఆయన కోరారు. సంబంధిత సభ్యులకు సమాచారం పంపించినట్లు పేర్కొన్నారు.

News October 8, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➥టెక్కలి: ప్రమాదాలకు కుదేలవుతున్న కార్మిక కుటుంబాలు
➥కంచిలి: విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి: కలెక్టర్
➥సంతబొమ్మాళి: మంత్రి ఆదేశాలతో శరవేగంగా పారిశుద్ధ్య పనులు
➥క్వారీ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్, ఎస్పీ
➥శ్రీకూర్మనాథుని సన్నిధిలో గోవా గవర్నర్
➥ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలి: MLA కూన
➥కొత్తూరు: కేజీబీవీ ప్రిన్సిపాల్, అకౌంటెంట్‌పై వేటు

News October 8, 2025

శ్రీకాకుళం: ‘మరో మూడు గంటలు..సురక్షిత ప్రదేశాల్లో ఉండండి’

image

శ్రీకాకుళం జిల్లాలోని మరో మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చిరికలు జారీ చేసింది. ఈ వానలు ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో పడతాయని చెప్పారు. పిడుగులతో పాటు 40-50 కి.మీ ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలెవ్వరూ బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని కలెక్టరేట్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

News October 8, 2025

పొందూరు : రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

పొందూరు మండలం తుంగపేట సమీపంలో రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు బుధవారం తెలిపారు. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉండి గడుల కలర్ చొక్కా ధరించినట్లు తెలిపారు. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News October 8, 2025

కొత్తూరు: కేజీబీవీ ప్రిన్సిపల్, అకౌంటెంట్‌లపై వేటు

image

కొత్తూరు కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రిన్సిపల్ రాధిక, అకౌంటెంట్ శ్రీదేవిలను విధుల నుంచి తొలగిస్తూ సమగ్ర శిక్ష ఏపీసీ ఎస్ శశిభూషణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీని కొత్తూరు తహశీల్దార్ బాలకృష్ణ ఇటీవల ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో రికార్డులో 248 కిలోల బియ్యం మిగిలి ఉన్నట్లు నమోదు చేశారు. వాస్తవానికి 1,400 కిలోల బియ్యం మిగిలి ఉన్నాయి. దీంతో వారిపై వేటు పడింది.

News October 8, 2025

మంత్రి అచ్చెన్నాయుడుపై జగన్‌కు ఫిర్యాదు

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం, మంత్రి అచ్చెన్నాయుడు వల్ల వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు తిలక్ తెలిపారు.

News October 7, 2025

SKLM: పిడుగుపాటుతో ముగ్గురు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి

image

మెలియాపుట్టి మండలం గంగరాజపురం క్వారీ వద్ద పిడుగుపాటుతో ముగ్గురు కూలీలు మృతి చెందడం పట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పిడుగుపాటుతో మృతి చెందడం చాలా దురదృష్టకరమన్నారు. అస్వస్థతకు గురై టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.