India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విశాఖ-గుణుపురం మధ్య నడుస్తున్న రైలును శక్రవారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. పూండి- నౌపడ మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
మెళియాపుట్టి మండలం తొవ్వూరుకు చెందిన ఎమ్మార్వో చలమయ్య(50) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన 2014-2018 వరకు అదే విధులు నిర్వహించారు. 2023 నుంచి సంతబొమ్మలి మండలంలో విధులు నిర్వహించారు. అనంతరం ఎన్నికల విధుల్లో భాగంగా సుబ్బవరానికి బదిలీ అయ్యారు. కాగా ఇటీవలె ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో విశాఖపట్నానికి తరలించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు నిధులలేమితో సతమతమవుతున్నాయి. జిల్లాలో 3,046 పాఠశాలలు ఉండగా 2,6,420 మంది చదువుతున్నారు. వాటిలో విద్యుత్, స్టేషనరీ, గ్రంధాలయాలకు చెందిన ఖర్చులు పెరిగిపోవడంతో తమ సొంత నగదును ఖర్చు చేస్తున్నట్లు ప్రధానోధ్యాయులు వాపోతున్నారు. ఏపీసీ సమగ్ర శిక్షా అధికారి జయప్రకాశ్ మాట్లాడుతూ.. 2022-23 అకాడమిక్ ఇయర్కు 40 శాతం నిధులు జమ చేశామని, ఈ ఏడాది బిల్లులు రాగానే జమచేస్తామన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పనిచేయడం తన కెరియర్లో ఒక మధుర జ్ఞాపకంగా ఉంటుందని బదిలీపై వెళ్తున్న కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గురువారం సాయంత్రం జిల్లా అధికార బృందం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన మాట్లాడుతూ.. తన విధులలో ఒక్కసారి అయినా జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేసి సమర్థవంతంగా, ప్రశాంతంగా నిర్వహించాలనే కల ఇక్కడ నెరవేరడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి, శ్రీ స్వామివారి జ్ఞాపికను అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బి.ఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు జులై 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్గా స్వప్నిల్ దినాకర్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు కార్యాలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్, డీఆర్ఓ గణపతిరావు నూతన కలెక్టర్ను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా రూపొందించిన 2 కీలక కేబినెట్ కమిటీలలో చోటు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో రామ్మోహన్కు కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజకీయ వ్యవహారాల కమిటీకి మోదీ నేతృత్వం వహిస్తారు.
శ్రీకాకుళం నగరంలోని ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సినిమా హీరో శ్రీ సంపూర్ణేశ్ బాబు స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని జ్ఞాపికగా ఆలయ జూనియర్ అసిస్టెంట్ బి. చక్రవర్తి అందజేశారు.
Sorry, no posts matched your criteria.