India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాతపట్నం పరిధిలోని చోడసముద్ర ప్రాంతంలో ఇటీవల పులి సంచారం విషయం తెలిసిందే. గడిచిన మూడున్నరేళ్లుగా ఇదే పులి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, ఒడిశా ప్రాంతాల్లోని అడవుల్లో సంచరిస్తోందని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్, సిబ్బంది గుర్తించారు. పులి అడుగుల జాడతో ఇదే పులి ఇక్కడ సంచరిస్తోందని నిర్ధారించారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై ఏసీబీకి చిక్కిన ల్యాబ్ టెక్నీషియన్ గొండు మురళిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి కల్యాణ్ బాబు ప్రకటించారు. బుడితి CHCలో పని చేస్తున్న మురళీ ఇంటిపై ఇటీవల ACB దాడి చేసింది. రూ.50 కోట్ల అక్రమాస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనకు DEC 12 వరకు రిమాండ్ విధించింది. ఈయన గతంలో ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా పని చేశారు.
పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి, యాజమాన్యాల చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు. బాధితులందరినీ స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, నందిగాం, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది సౌదీ వలస వెళ్లి చిక్కుకున్న విషయం తెలిసిందే.
శ్రీకాకుళంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3,906 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముసాయిదా ఓటర్లు డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించినన్నారు. అనంతరం మార్పులు, చేర్పులకు ఈనెల 9వ తేదీన www.coeandhra.nic.in వెబ్సైట్లో కాని, సంబంధిత ఓటర్ల నమోదు అధికారికిగాని సంప్రదించి దరఖాస్తులను సమర్పించవచ్చు.
గంజాయి కేసుల్లో ఇటీవల అరెస్టు అయిన నిందితులు, వారు గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన ఆస్తులను గుర్తించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి జూమ్లో వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన విశాఖ రేంజ్ పరిధిలోని ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డి వర్చువల్గా హాజరయ్యారు. నిందితుల పేరున గుర్తించిన ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు 50 అర్జీలు అందించారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో ట్రెజరీ విభాగంలో గార్డుగా పని చేస్తున్న కానిస్టేబుల్ సవర జోక్యో (55) సోమవారం మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా మృతి చెందడంతో ఎస్.ఐ హరికృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతి చెందడం వెనుక మరేదైనా కోణం ఉందేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాల సహాయార్థం సాయుధ దళాల పతాక దినోత్సవం కోసం విరాళాల సేకరణ పోస్టర్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం అక్షర వెలుగు పుస్తకాన్ని విడుదల చేశారు. ఆయన వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, డిఈఓ తిరుమల చైతన్య ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech కోర్సులకు సంబంధించిన 5, 7వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. ఈ మేరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్షా ఫీజు రూ.770, ప్రాక్టికల్ ఫీజు రూ.250తో కలిపి మొత్తం రూ.1,050 చెల్లించాలి. రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 5 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ BR. అంబేద్కర్ యూనివర్సిటీలో పలు కోర్సులకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా బీటెక్ 5వ సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి, 7వ సెమిస్టర్ 13వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. అలాగే పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి బీపీఈడీ, డీపీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలు కూడా డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.