Srikakulam

News December 2, 2024

నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

image

కొత్త రేషన్ కార్డులకు నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు అర్హుల నుంచి  సచివాలయ సిబ్బంది దరఖాస్తులను స్వీకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. వీరందరూ మార్పులు, చేర్పులు ఈ నెల 28లోపు చేసుకోవచ్చు. ఇప్పటికే కొత్త కార్డుల దరఖాస్తులు 12 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో ప్రభుత్వం అర్హులందరికీ కొత్తకార్డులు మంజూరు చేయనుంది.

News December 2, 2024

SKLM: శీతాకాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: DM&HO

image

గ్రామాల్లో అభయ కార్డుల జారీ, క్యాన్సర్‌పై సర్వే ముమ్మరంగా సాగుతోందని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. ప్రజలు ఈ సర్వేలో తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు అదుపులో ఉన్నాయన్నారు. శీతాకాలం వ్యాధులు విజృంభించకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News December 1, 2024

శ్రీకాకుళం: ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

image

ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేడ్కర్ కళా వేదికలో ఆదివారం ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ప్రస్తుతం ప్రజల్లో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ఉందన్నారు. భవిష్యత్తులో ఎయిడ్స్ రైతు సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. వ్యాధి నియంత్రణకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుంది.

News December 1, 2024

IPLకు విజయ్.. టెక్కలిలో అభినందనలు ఫ్లెక్సీ

image

టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్- ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంపిక కావడం పట్ల టెక్కలిలో విజయ్ స్నేహితులు, క్రికెట్ అభిమానులు, గ్రౌండ్ ప్లేయర్స్ విజయ్‌కు అభినందనలు తెలుపుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం రోడ్డులో ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొట్టమొదటి యువకుడు త్రిపురాన విజయ్‌కు “All The Best” చెప్తూ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు.

News December 1, 2024

SKLM: ఆ తల్లి కష్టం ఎవరికీ రాకూడదు..!

image

భోగాపురం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కారు డ్రైవర్ జయేశ్ కన్నీటి గాథ ఇది. శ్రీకాకుళానికి చెందిన జయేశ్ తండ్రి సైతం ప్రమాదంలోనే చనిపోయారు. తల్లి సున్నపు వీధిలో టీస్టాల్ నిర్వహిస్తూ జయేశ్‌ను కష్టపడి పెంచింది. ఈక్రమంలో అతను కౌశిక్ వద్ద డ్రైవర్‌గా చేరాడు. విశాఖ విమానాశ్రయానికి బయల్దేరగా మార్గమధ్యలో చనిపోయారు. అప్పుడు భర్త, ఇప్పుడు కొడుకు ప్రమాదంలోనే కన్నుమూయడంతో ఆ తల్లి బోరున విలపిస్తోంది.

News December 1, 2024

శ్రీకాకుళం: దేవునికి హారతిస్తూ.. నిప్పంటుకొని మహిళ మృతి

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని చౌక బజార్ వీధికి చెందిన మగాటపల్లి సీతారత్నం (81) అనే వృద్ధురాలు ఈనెల 24వ తేదీన తన ఇంట్లో ఉన్న పూజ గదిలో పూజ అనంతరం కర్పూర హారతి వెలిగించింది. అవి పొరపాటున తన ఒంటిపై పడడంతో చీరకు నిప్పంటుకొని శరీరం అంతా కాలిన గాయాల పాలయింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పట్నంలో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ఆమె శనివారం రాత్రి మృతి చెందింది.

News December 1, 2024

SKLM: సమగ్రమైన దర్యాప్తుతో పురోగతి సాధించాలి: ఎస్పీ

image

అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో సాక్ష్యాధారాలతో సమగ్రమైన దర్యాప్తుతో పురోగతి సాధించాలని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ గ్రేవ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జ్‌షీట్ కోర్టులో దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తప్పనిసరిగా గ్రామ సందర్శనలు చేయాలన్నారు.

News November 30, 2024

SKLM: ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు 

image

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో గంజాయి పట్టివేత, ప్రాపర్టీ నేరాలు చేదనా, తదితర అంశాలపై చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన వారికి ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి చేతులు మీదుగా ప్రశంస పత్రాలను ప్రదానం చేసి ప్రశంసించారు. అదనపు ఎస్పీ కెవి రమణ ఉన్నారు.

News November 30, 2024

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకలు 

image

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయసంచాలకులు కె.కవిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ కార్యక్రమం డిసెంబర్ 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతుందన్నారు. ఇటీవల జిల్లాలో విభిన్నప్రతిభావంతులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని ఆమె వెల్లడించారు.

News November 30, 2024

శ్రీకాకుళం: PG సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు సంబంధించి (ఆర్ట్స్‌ & సైన్స్) 3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ శనివారం విడుదల చేశారు. పరీక్షలు డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నారు.

error: Content is protected !!