India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్- ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంపిక కావడం పట్ల టెక్కలిలో విజయ్ స్నేహితులు, క్రికెట్ అభిమానులు, గ్రౌండ్ ప్లేయర్స్ విజయ్కు అభినందనలు తెలుపుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం రోడ్డులో ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్కు ఎంపికైన మొట్టమొదటి యువకుడు త్రిపురాన విజయ్కు “All The Best” చెప్తూ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు.
భోగాపురం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కారు డ్రైవర్ జయేశ్ కన్నీటి గాథ ఇది. శ్రీకాకుళానికి చెందిన జయేశ్ తండ్రి సైతం ప్రమాదంలోనే చనిపోయారు. తల్లి సున్నపు వీధిలో టీస్టాల్ నిర్వహిస్తూ జయేశ్ను కష్టపడి పెంచింది. ఈక్రమంలో అతను కౌశిక్ వద్ద డ్రైవర్గా చేరాడు. విశాఖ విమానాశ్రయానికి బయల్దేరగా మార్గమధ్యలో చనిపోయారు. అప్పుడు భర్త, ఇప్పుడు కొడుకు ప్రమాదంలోనే కన్నుమూయడంతో ఆ తల్లి బోరున విలపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని చౌక బజార్ వీధికి చెందిన మగాటపల్లి సీతారత్నం (81) అనే వృద్ధురాలు ఈనెల 24వ తేదీన తన ఇంట్లో ఉన్న పూజ గదిలో పూజ అనంతరం కర్పూర హారతి వెలిగించింది. అవి పొరపాటున తన ఒంటిపై పడడంతో చీరకు నిప్పంటుకొని శరీరం అంతా కాలిన గాయాల పాలయింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పట్నంలో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ఆమె శనివారం రాత్రి మృతి చెందింది.
అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో సాక్ష్యాధారాలతో సమగ్రమైన దర్యాప్తుతో పురోగతి సాధించాలని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ గ్రేవ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తప్పనిసరిగా గ్రామ సందర్శనలు చేయాలన్నారు.
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో గంజాయి పట్టివేత, ప్రాపర్టీ నేరాలు చేదనా, తదితర అంశాలపై చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన వారికి ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి చేతులు మీదుగా ప్రశంస పత్రాలను ప్రదానం చేసి ప్రశంసించారు. అదనపు ఎస్పీ కెవి రమణ ఉన్నారు.
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయసంచాలకులు కె.కవిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతుందన్నారు. ఇటీవల జిల్లాలో విభిన్నప్రతిభావంతులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని ఆమె వెల్లడించారు.
శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు సంబంధించి (ఆర్ట్స్ & సైన్స్) 3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ శనివారం విడుదల చేశారు. పరీక్షలు డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నారు.
పింఛను సొమ్ము కోసం సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన ట్రిపుల్ ఐటీ సమీపంలోని రాజీవ్ స్వగృహ కాలనీ వద్ద శుక్రవారం జరిగింది. బాధితుని కథనం..ఎస్ఎం పురం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ విష్ణు ఎచ్చెర్ల SBIలో రూ. 24 లక్షలకు పైగా డ్రా చేసుకుని వస్తున్నారు. గమనించిన ఇద్దరు ఆగంతకులు బైకు ఆపే ప్రయత్నం చేసి, రాడ్డుతో దాడి చేయగా తప్పించుకుని సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం చరిత్రను వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రసాద్ పథకం కింద అరసవిల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రూ.100 కోట్లతో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విన్నవించారు.
శ్రీకాకుళం జిల్లాలో నేడే పింఛను లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,14,386 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతినెల రూ.129 కోట్లకు పైగా నగదును అందజేస్తోంది. ఇప్పటికే నగదును బ్యాంకుల్లో జమ చేయగా సచివాలయ సిబ్బంది విత్ డ్రా చేసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు స్వయంగా సిబ్బంది అందజేయనున్నారు. కాగా ఆదివారం సెలవు కావడంతో శనివారం అందజేస్తారు.
Sorry, no posts matched your criteria.