India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.
అక్రమ ఆస్తుల కేసులో భాగంగా గురువారం నిర్వహించిన ఏసీబీ దాడుల్లో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పీఏ గోండు మురళిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనను అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించారు. కేసు పూర్వాపరాలు గుర్తించిన న్యాయస్థానం ఆయనకు వచ్చే నెల 12వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ తీర్పు ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జైలుకు తరలించారు.
మాజీ మంత్రి ధర్మాన మాజీ పీఏ మురళి నివాసంలో బుధవారం నుంచి ఏసీబీ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఆ దాడుల్లో రూ. 50 కోట్లకు పైగా విలువచేసే బంగారం, వెండి, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అరెస్ట్ చేయగా.. అతడిని మరో గంటలో విశాఖ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అధికారులు ప్రకటించారు.
సంతబొమ్మాళి మండలంలో పులి తిరుగుతున్నట్లు ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. తాజాగా పులి అడుగులను గురువారం గుర్తించారు. సంతబొమ్మాళి మండల ప్రజలను అప్రమత్తం చేస్తూ అటవీశాఖ అధికారులు పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం రైతులు పొలాల్లో కోతలు, నూర్పులు చేస్తున్నారు. దీంతో పులి సంచారం వార్తతో భయపడుతున్నారు. పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు కోరారు.
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేసినట్లు అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు సిద్ధం చేసినట్లు వివరించారు.
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేసినట్లు అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు సిద్ధం చేసినట్లు వివరించారు.
సంతబొమ్మాళి మండలంలో పులి సంచారం సమాచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందిందని అధికారులు తెలపడంతో ఆయన అధికారులతో మాట్లాడారు. అటవీ శాఖ అధికారులతో ఆయన సమాచారం ఆరా తీశారు. పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని, ఒడిశా నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. అక్కడి ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
సంతబొమ్మాళి మండలం మూలపేట పంచాయితీ పోతినాయుడుపేట వద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని గుర్తించడం జరిగిందని టెక్కలి ఫారెస్ట్ రేంజర్ జి జగదీశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున గ్రామంలో ఆవుపై దాడి చేయడంతో అది మృతి చెందిందని తెలిపారు.పులి సంచారంపై గురువారం గ్రామస్థులకు అవగాహన కల్పించామని చెప్పారు. రాత్రి వేళలో ఎవరు బయటకు రావద్దు అంటూ సూచించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మహాత్మా జ్యోతీరావు ఫూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, కెఆర్ఆర్సీ ఉప కలెక్టర్ పద్మావతి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనూరాధ ఉన్నారు.
సీతంపేట మండలంలోని అడలి వ్యూ పాయింట్కు పర్యాటుకులు భారీ ఎత్తున సందర్శిస్తున్నారు. శీతకాలంలోని మంచు అందాలతో ఆకట్టుకుంటున్న వ్యూపాయింట్ను చూసేందుకు వచ్చే పర్యాటకులు ప్రధాన రహదారిని డెవలప్ చేసి పర్యాటకంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలోనే మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా ద్రుష్టి పెట్టాలని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.