Visakhapatnam

News June 21, 2024

విశాఖ: ‘పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ద్వారా గంజాయి రవాణా జరిగితే చర్యలు’

image

పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ద్వారా తెలియకుండా గంజాయి రవాణా జరిగినా సంబంధిత ఏజెన్సీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సెబ్ ఏడీసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిరోధానికి వందరోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నగరంలోని పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ప్రతినిధులతో నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల రవాణా నేరమని హెచ్చరించారు.

News June 21, 2024

ఆ వైసీపీ కార్యాలయాలను కూల్చివేయాలి: విశాఖ కార్పొరేటర్

image

విశాఖ నగరం ఎండాడ, అనకాపల్లి జిల్లా రాజుపేటలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనాలను చట్టపరంగా కూల్చివేయాలని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సురేశ్‌కు వినతి పత్రం అందజేశారు. విశాఖలో కార్యాలయ స్థలానికి ఏడాదికి ఎకరానికి కేవలం రూ.1000 అద్దె చెల్లించడానికి 33ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు తెలిపారు.

News June 21, 2024

పల్లా శ్రీనివాసురావు అనే నేను..

image

గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసురావు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యుక్షుడిగా పనిచేస్తున్నారు. ఈసారి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఆయన ప్రమాణస్వీకారం చేసే సమయంలో మిగతా సభ్యులు చప్పట్లతో అభినందించారు.

News June 21, 2024

నేటి నుంచి కిరండూల్ రైలు గమ్యం కుదింపు

image

వాల్తేరు డివిజన్ దంతేవాడ – కమలూర్ సెక్షన్ మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈరోజు నుంచి 25వ తేదీ వరకు విశాఖపట్నం- కిరండూల్ ఎక్స్ప్రెస్ రైలు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు కిరండూల్- విశాఖ ఎక్స్ప్రెస్ కిరండోల్ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది.

News June 21, 2024

పక్కపక్కనే కూర్చున్న అయ్యన్న.. రఘురామ

image

అసెంబ్లీలో నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పక్కపక్కనే కూర్చున్నారు. అయ్యన్నకు స్పీకర్ పదవి ఖరారవ్వగా.. ఆ పదవికి రఘురామ పేరు కూడా వినబడేది. కాగా.. వైసీపీపై వీరిద్దరూ తమదైన శైలీలో ఆరోపణలు చేసేవారు. ఈరోజు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

News June 21, 2024

ఏ.యూలో ప్రభుత్వ ఉత్తర్వుల గుబులు

image

పదవీ విరమణ చేసి కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను తక్షణం రాజీనామా చేయాలని ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గుబులు రేగుతోంది. ఇప్పటికే ఓఎస్డీగా పని చేస్తున్న మాజీ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణ మోహన్‌తో పాటు ఫార్మసీ, న్యాయ, సైన్స్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పరిస్థితి ఏమిటనే సందేహం కలుగుతోంది. వీరంతా రాజీనామా చేసి కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే చర్చ నడుస్తోంది.

News June 21, 2024

విశాఖ షిప్ యార్డ్ 84వ వ్యవస్థాపక దినోత్సవం

image

విశాఖ షిప్ యార్డ్ 84వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. దేశంలో తొలి నౌక నిర్మాణ కేంద్రంగా విశాఖపట్నంలో హిందుస్థాన్ ప్రారంభమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. గత మూడేళ్లుగా సంస్థ లాభాలను చూస్తోంది.. 2021-22లో 51 కోట్ల లాభాన్ని, 2022-23 సంవత్సరంలో 65 కోట్ల లాభాన్ని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 109 కోట్ల లాభాన్ని అర్జించింది.

News June 21, 2024

ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌పై సస్పెన్షన్ ఎత్తివేత..!

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.లావణ్యదేవిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన భర్త అయిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తరఫున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. తాజాగా ఆమె సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News June 21, 2024

వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో తనిఖీలు

image

వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలోని బొబ్బిలి, విజయనగరం, రాయగడ రైల్వే స్టేషన్లలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్ వాల్ గురువారం తనిఖీలు నిర్వహించారు. రైల్వే ప్రయాణికులకు భద్రతతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నిర్మాణంలోనూ ఉన్న వివిధ ప్రాజెక్టుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. జీఎం వెంట వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ ఉన్నారు.

News June 20, 2024

పిచ్చి కూతలు కూస్తే రోడ్లమీద తిరగనీయరు: ఎస్.అనంతలక్ష్మి

image

పిచ్చి కూతలు కూస్తే రోడ్లమీద ప్రజలు తిరగనీయరని మాజీ మంత్రి కొడాలి నానిని విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఎస్.అనంతలక్ష్మి హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం మీద కొడాలి నాని చేసిన విమర్శలపై స్పందించారు. ఈ మేరకు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని, దోచుకుతినే ప్రభుత్వం కాదన్నారు. కూల్చే ప్రభుత్వం మీది అయితే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తమదన్నారు.