Visakhapatnam

News January 7, 2025

విశాఖ: నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

image

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను మంగళ, బుధవారాల్లో చేపట్టనున్నట్లు APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందన్నారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సూచనలు అభ్యంతరాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వీకరిస్తారని అన్నారు.

News January 7, 2025

విశాఖలో 35 మంది IPSలు.. 4వేల మంది పోలీసులు 

image

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు 4వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. పర్యవేక్షణకు 35 మంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఇతర జిల్లాల నుంచి కొందరు పోలీసులు నగరానికి చేరుకోగా మంగళవారం మిగిలినవారు వస్తారని వెల్లడించారు.

News January 7, 2025

విశాఖ: గాలిపటం ఎగరవేస్తూ వ్యక్తి మృతి

image

విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే న్యూ కాలనీ బలరాం అపార్ట్మెంట్ మేడపై నుంచి సోమవారం ఓ వ్యక్తి జారిపడి మృతి చెందాడు. దల్లి డేవిడ్ (38) పిల్లల కోసం గాలిపటం కొనుగోలు చేశాడు. దానిని మేడ పైకి వెళ్లి ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన డేవిడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య అనూష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 7, 2025

25 వేల మందికి ఉపాధి అవకాశాలు: మంత్రి

image

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న అచ్యుతాపురం మండలం పూడిమడకలో రూ.85 వేల కోట్లతో శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం రాత్రి విశాఖలోని సీతంపేట జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధానికి జనసేన తరఫున ఘనంగా స్వాగతం పలకడానికి కార్యాచరణ రూపొందించామన్నారు.

News January 7, 2025

నిఘా నీడలో విశాఖ..!

image

ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో నగరమంతా నిఘా నీడలోకి వెళ్ళింది. ఢిల్లీ నుంచి ప్రధాని భద్రతా సిబ్బంది ఇప్పటికే నగరానికి చేరుకొని రోడ్ షో, బహిరంగ సభ స్థలాలను క్షుణంగా పరిశీలించారు. డీజీపీతోపాటు నగర పోలీస్ కమిషనర్, మంత్రులు ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ డైవర్షన్ చేసి, డ్రోన్లు నిషేధించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ శ్రమిస్తున్నారు. నగర ప్రజలు సహకరించాలని కోరారు.  

News January 7, 2025

విశాఖలో ప్రధాని మోదీ షెడ్యూల్

image

ఈనెల 8న విశాఖకు ప్రధాని మోదీ రానున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 4:15కు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4:45 నుంచి 5:30వరకు వేంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. 5:30 నుంచి 6:30వరకు ఏయూ గ్రౌండ్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 6:35కు రోడ్డు మార్గాన బయలుదేరి 6:55కు ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని భువనేశ్వర్ పయనమవుతారు.

News January 7, 2025

విశాఖలో ప్రధాని పర్యటన.. డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు

image

పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమని తెలిపారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.

News January 6, 2025

విశాఖలో ప్రధాని పర్యటన.. డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు

image

పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమన్నారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.

News January 6, 2025

విశాఖలో ప్రధాని బహిరంగ సభకు 2లక్షల జనం..!

image

విశాఖలో ఈనెల 8న నిర్వహించనున్న ప్రధాన మోడీ బహిరంగ సభకు సుమారు రెండు లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రులు, నేతలు ఇప్పటికే విశాఖలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సంపత్ వినాయక ఆలయం నుంచి ఏయూ గ్రౌండ్ వరకు నిర్వహించనున్న రోడ్ షోకు సుమారు లక్షమంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

News January 6, 2025

సింహాచలంలో నేటి నుంచి టికెట్ల విక్రయాలు

image

సింహాచలంలో జనవరి 10న నిర్వహించనున్న ఉత్తర ద్వారా దర్శనం టికెట్లు నేటి నుంచి ఈనెల 9 వరకు ప్రత్యేక కౌంటర్‌లో లభిస్తాయని ఈవో త్రినాధరావు తెలిపారు. కొండ కింద పిఆర్ఓ కౌంటర్‌లో రూ.500 టికెట్లు లభ్యమవుతాయన్నారు. www.aptemples.ap.gov.in వెబ్ సైట్‌లో కూడా దొరుకుతాయని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో త్రినాద్ రావు తెలిపారు.