India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పిలుపునిచ్చారు. కంచరపాలెం మెట్ట వద్ద విశాఖ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ అవేర్నెస్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలన్నారు. డీసీపీ మేకా సత్తిబాబు మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
పాడేరు మండలం మినుములూరులో బంధువుల మధ్య వివాదం జరిగగా ఒకరు మృతి చెందారు. ఈనెల 18న దాగరి సూరిబాబు (63)కు బంధువైన సాగరి.నరసింహమూర్తి మధ్య ఆర్థిక లావాదేవీల విషయమై వివాదం చెలరేగింది. మద్యం మత్తులో నరసింహ మూర్తి సూరిబాబును కర్రతో కొట్టాడు. గాయపడిన సూరిబాబు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. బంధువుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తోంది ఎంపీపీ కాలనీలోని స్పోర్ట్స్ ఎరీనా ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో యోగాడే వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలిపింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొవాలని జిల్లా కలెక్టర్ తరఫున తెలిపారు.
విశాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వం Y కేటగిరీలో 2+2 భద్రతను కేటాయించింది. ఆశ్రమానికి సమకూర్చిన ఎస్కార్ట్ వాహనాలకు ఇంధనాన్ని సైతం పోలీసుశాఖే భరిస్తోంది. 20-25 మంది సిబ్బంది విధులు నిర్వహింస్తుండగా.. నెలకు రూ.20 నుంచి 25లక్షలు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే భద్రతను తొలగించారంటూ వస్తున్న వార్తలను పోలీసు అధికారులు కొట్టిపారేశారు. కాగా.. ఇటీవల పీఠాధిపతి సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ గారిపేటకు చెందిన మోక్షిత్ అనే చిన్నారి బాత్రూంలో బకెట్లో పడి మృతి చెందాడు. మంగళవారం రాత్రి భోజనాల చేసే సమయంలో మోక్షిత్ కనబడకపోవడంతో తల్లిదండ్రులు పరిసరాలలో వెతకగా.. బాత్రూంలోని బకెట్లో అపస్మారకస్థితిలో ఉన్నాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా బుధవారం చికిత్స పొందుతూ మరణించాడు. కేసును సీఐ ఆధ్వర్యంలో ఏఎస్సై పైడిరాజు దర్యాప్తు చేస్తున్నారు.
చింతపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రం ఆవరణలో సాగు చేపట్టిన వెస్టిండియన్ చెర్రీస్ ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటు న్నాయి. ఎరుపు రంగులో ఉండే వీటిలో సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది. ఇవి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని స్థానిక పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు తెలిపారు. మొక్కలు అన్ని రకాల నేలల్లోనూ ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు.
పూండి-నౌపడా సెక్షన్ మధ్యలో జరుగుతున్న భద్రత పనుల దృష్ట్యా నేడు పలాన పాసింజర్ గమ్యం కుదించినట్లు అధికారులు తెలిపారు. పలాస-విశాఖపట్నం (07471) పాసింజర్ స్పెషల్ గురువారం పలాస నుంచి కాకుండా శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరనుంది. అలాగే విశాఖపట్నంలో బయల్దేరే విశాఖపట్నం-పలాస(07470) పాసింజర్ స్పెషల్ పలాస వరకు కాకుండా శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది.
టమాట ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు వాటిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు. గోపాలపట్నం రైతు బజార్లో బుధవారం కిలో టమాట రూ.58కి విక్రయించారు. బయట మార్కెట్లో కిలో ధర రూ.75 వరకు ఉందని వినియోగదారులు తెలిపారు. టమాటోతో పాటు ఉల్లి ధర కూడా కిలో రూ. 50 దాటింది. రోజు కూరల్లో వినియోగించే వీటి ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఈ నెల 24 నుంచి ‘మీకోసం’ కార్యక్రమాన్ని అనకాపల్లి కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి బదులుగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనకు గట్టి చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కమిషనర్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. గంజాయి మాదకద్రవ్యాల నివారణపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించారు.
Sorry, no posts matched your criteria.