Visakhapatnam

News January 4, 2025

స్టీల్ ప్లాంట్: మోసానికి పాల్పడిన తండ్రి-కొడుకులకు జైలు శిక్ష

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో తండ్రి-కొడుకులకు న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి పోతయ్య ఆయన కుమారుడు వెంకటరమణ ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 మంది నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు. బాధితులు 2017లో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News January 4, 2025

విశాఖ: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్ లో జిల్లా ఇంచార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈనెల 8న ప్రధాని విశాఖలో పర్యటించి అనకాపల్లి, విశాఖ జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.

News January 4, 2025

ప్రధాని పర్యటనపై సీఎస్ సమీక్ష

image

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అమరావతి నుంచి అనకాపల్లి విశాఖ, కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సమీక్షించారు. ప్రధాని పర్యటనకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలను బస్సులు ఇతర వాహనాల్లో సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. వాహనాల ట్రాఫిక్ పార్కింగ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.

News January 3, 2025

విశాఖలో ప్రధాని సభకు లక్ష మంది..!

image

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రానున్న తరుణంలో ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో ప్రధానమంత్రి సభకు దాదాపు లక్ష మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు, చెట్లు ట్రిమ్మింగ్, గ్రౌండ్ ఎత్తు పల్లాలు లేకుండా చదును చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News January 3, 2025

విశాఖ: పీఈటీ టెస్టులకు 278 మంది హాజరు 

image

పోలీస్ కానిస్టేబుల్స్ ఎంపికకు కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నాలుగవ రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ పరీక్షల్లో 718 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 278 మంది మాత్రమే ఈ పరీక్షలకు హాజరయ్యారు. ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి అనంతరం బయోమెట్రిక్ తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

News January 3, 2025

జగదల్పూరు వరకే విశాఖ-కిరండూల్ రైలు

image

కేకే లైన్లో జరుగుతున్న పనుల వలన విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లు జగదల్పూరు వరకు నడుస్తాయని అరకు రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 5న విశాఖ-కిరండూల్ (18514) నైట్ ఎక్స్ ప్రెస్, జనవరి 6న విశాఖ-కిరండూల్(58501) పాసింజరు జగదల్పూర్ వరకు నడుస్తాయన్నారు. తిరుగు ప్రయాణం జనవరి 6న కిరండూల్-విశాఖ(18513) నైట్ ఎక్స్ ప్రెస్, జనవరి 7న కిరండూల్-విశాఖ(58502) పాసింజర్ రైళ్లు జగదల్పూర్ నుంచి బయలుదేరుతాయన్నారు.

News January 3, 2025

ఒడిశా గవర్నర్‌గా హరిబాబు ప్రమాణ స్వీకారం 

image

విశాఖ మాజీ ఎంపీ చెందిన కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మిజోరం గవర్నర్‌గా ఉన్న హరిబాబును ఒడిశాకు బదిలీ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్‌కు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, గాజువాక బీజేపీ కన్వీనర్ నరసింహారావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

News January 3, 2025

పెందుర్తి: ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. దంపతుల సూసైడ్

image

పెందుర్తి మండలం పురుషోత్త పురంలో భార్యాభర్తలు ఉరివేసుకుని చనిపోయిన విషయం <<15043276>>తెలిసిందే<<>>. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. చీపురుపల్లికి చెందిన సంతోష్ (35) విశాఖకు చెందిన సంతోష్ శ్రీ (25) లవ్ చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం పెళ్లి కాగా పిల్లలు లేరు. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవండంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని మృతిచెందారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 3, 2025

జనవరి 4న విశాఖకు సీఎం.. షెడ్యూల్ ఇదే 

image

విశాఖలో జనవరి 4న జరగనున్న నేవీ విన్యాసాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. శనివారం మధ్యాహ్నం 3:40కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆర్‌కె బీచ్‌కు వెళ్లి నేవీ విన్యాసాలు తిలకిస్తారు. 6:15 నిముషాలకు ఆర్‌కె బీచ్ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రోడ్డు మార్గన వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు.

News January 3, 2025

ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 8న అచ్చుతాపురం, నక్కపల్లిలో పలు పరిశ్రమలను విశాఖ నుంచి ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాప చేస్తారని వెల్లడించారు. అనంతరం ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.