Visakhapatnam

News June 18, 2024

అల్లూరికి 2వ స్థానం.. అనకాపల్లికి 10వ స్థానం.. 22వ స్థానంలో విశాఖ

image

➤ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు విశాఖ జిల్లాలో 7,500 మంది విద్యార్థులు హాజరవ్వగా 3,777 మంది ఉత్తీర్ణత సాధించారు. 50 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 22వ స్థానంలో నిలిచింది.
➤ అనకాపల్లి జిల్లాలో 4,400 మందికి 2,713 మంది ఉత్తీర్ణత సాధించారు. 61 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 10వ స్థానంలో నిలిచింది.
➤ అల్లూరి జిల్లాలో 1,691 మందికి 1,370 మంది ఉత్తీర్ణత సాధించారు. 81 శాతంతో జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

News June 18, 2024

వందే భారత్‌లో విజయవాడ బయలుదేరిన హోం మంత్రి

image

విశాఖ నుంచి వందే భారత్ రైలులో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం ఉదయం విజయవాడ బయలుదేరి వెళ్లారు. రైలులో ప్రయాణికులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రైన్లో కలిగి తిరుగుతూ అందరినీ పలకరించారు. హోం మంత్రినైనా ప్రజలతో కలిసిమెలిసి ఉండడమే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. ఎవరు ఏ సమస్య తన దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు.

News June 18, 2024

అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు..!

image

నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకి స్పీకర్ పదవి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యన్న తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పదవి తనకి కేటాయించారని చెప్పినట్లు సమాచారం. ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ఆయన నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News June 18, 2024

విశాఖ: ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం

image

అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్రతీరంలో చాపల వేటకు వెళ్లిన బోటు ఇంజన్‌లో మంటలు చెల్లరేగడం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు ఏపీ మేకనైజ్డ్ బోటు అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు. బోటులో ఉన్న మత్స్యకారులు వాసుపల్లి రాజు, వి.అప్పన్న, వి.దాసిలు, వి. అప్పారావు గనగళ్ల ఎర్రికొండ, మైలపల్లి ఎర్రయ్య, జి.పోలిరాజును మరో బోటు రక్షించి విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు.

News June 18, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో నేపాల్ విద్యార్థి మృతి

image

కె.కోటపాడు మండలం బొట్టవానిపాలెం గ్రామ సమీపంలో ఓ కళాశాలలో చదువుతున్న నేపాల్‌కు చెందిన విద్యార్థి జీవన్ మగర్(23) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. సోమవారం విద్యుత్ మోటారు ఆన్ చేయడానికి వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె.కోటపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 18, 2024

విశాఖ పోర్టుకు ప్రపంచ ర్యాంకింగ్‌లో 20వ స్థానం

image

విశాఖ పోర్టు అథారిటీ ప్రపంచ ర్యాంకింగ్ లో ఉత్తమ స్థానానికి చేరుకుందని పోర్టు చైర్మన్ అంగముత్తు ఒక ప్రకటనలో తెలిపారు. 2023 సంవత్సరానికి 62.29 ఇండెక్స్ పాయింట్లతో ప్రపంచ ర్యాంకింగ్ లో 20వ స్థానం, కంటైనర్ పోర్ట్ పనితీరు సూచికలో 19వ స్థానంలో నిలిచిందన్నారు. పని సామర్థ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతిక అంశాలు అమలులో పోర్టు అద్భుత పనితీరు చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 18, 2024

విశాఖ కేజీహెచ్‌లో పేలిన వెంటిలేటర్ బ్యాటరీ

image

KGHలో సోమవారం అర్ధరాత్రి సీఎస్ఆర్ బ్లాక్ ICU వార్డులో వెంటిలేటర్ బ్యాటరీ పేలిపోయింది. వార్డు మొత్తం పొగ వ్యాపించడంతో రోగులు, సహాయకులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన వైద్యులు 7గురు రోగులను సర్జికల్ ICUకి తరలించారు. రోగులంతా సురక్షితంగా ఉన్నారని కేజీహెచ్ పర్యవేక్షక అధికారి డా.శివానంద వెల్లడించారు. రాత్రి 12 గంటలకు ప్రమాదం చోటు చేసుకోగా.. ఒంటి గంటకు పూర్తిగా అదుపులోకి వచ్చింది

News June 18, 2024

నేడు అప్పన్న సోదరి పైడితల్లమ్మ పండుగ

image

సింహాద్రి అప్పన్న సోదరి తల్లి అమ్మ జాతర మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సింహాచలం అడవివరం తోపాటు 14 గ్రామాల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న అమ్మవారి ఉత్సవం ఏట ఘనంగా నిర్వహించడం పరిపాటి. ఇందుకోసం సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. మంగళవారం సాయంత్రం అనుపు ఉత్సవం నిర్వహిస్తారు.

News June 18, 2024

సింహాచలం: 6 గంటల వరకే అప్పన్న దర్శనాలు

image

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దర్శనాలు ఈనెల 18న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం జరుగుతుందన్నారు. ఈ కారణంగా దర్శనాలు 6 గంటల తర్వాత లభించవని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News June 17, 2024

విశాఖ పోర్టు పనితీరును ప్రశంసించిన మాజీ ఎంపీ

image

విశాఖ పోర్టు పనితీరును బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అభినందించారు. విశాఖ పోర్టు కార్యాలయంలో పోర్టు అథారిటీ చైర్మన్ అంగముత్తుతో భేటీ అయ్యారు. పోర్ట్ అథారిటీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తూ ముందుకు వెళుతుండడం విశాఖకు గర్వకారణం అన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో గణనీయమైన మెరుగుదలను చూపించడానికి కారణమైన పోర్టు ఛైర్మన్‌ను మాజీ ఎంపీ అభినందించారు.