Visakhapatnam

News January 1, 2025

విశాఖ: ‘గుడ్లు కూడా క్యాచ్ అంటూ విసిరేవాడు’

image

విశాఖ కుర్రాడు నితీశ్ సెంచరీ చేయడంపై అతని చిన్నప్పటి కోచ్ కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. నితీశ్‌కు 8 ఏళ్లు ఉన్నప్పుడు అతని తండ్రి ముత్యాల నాయుడు తన దగ్గరకు తీసుకొచ్చాడని చెప్పారు. ఇంట్లో చాలా అల్లరి చేస్తున్నాడు.. చివరికి కోడి గుడ్లు కూడా క్యాచ్ అంటూ విసురుతున్నాడు కోచింగ్ ఇవ్వండి అన్నారని తెలిపారు. నితీశ్ ఆట చూసి అప్పుడే తన ఆటోగ్రాఫ్‌ను బ్యాట్ పై తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News January 1, 2025

సింహాచలంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు 

image

జనవరి 10న సింహాచలంలో జరగబోయే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలను ఈఓ త్రినాథరావు మంగళవారం పర్యవేక్షించారు. ఆరోజు పెద్దఎత్తున్న భక్తులు రావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. వైదిక కార్యక్రమాలు, విద్యుత్ దీపాలంకరణ, భక్తులకు మంచినీటి సరఫరా, సీసీ కెమెరాలు ఏర్పాటు, బార్కేడింగ్, క్యూలైన్లు ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణకు అధికారులకు సూచనలు చేశారు.

News December 31, 2024

విశాఖ జైల్లో బయటపడిన ఫోన్లు అతనివేనా? 

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ మాజీ MP ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో కీలక ముద్దాయి కోలా హేమంత్ కుమార్ కదలికలపై జైలు అధికారులు నిఘా పెట్టారు. ఈ మేరకు సెంట్రల్ జైలులో అతని వద్ద 3సెల్ ఫోన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. జైల్లో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఫోన్లు బయటపడటం చర్చనీయాంశమైంది. ఎవరు లోపలికి తీసుకొచ్చారు, ఎన్ని రోజులుగా వాడుతున్నారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

News December 31, 2024

నిఘా నీడలో విశాఖ..!

image

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా రద్దీగల ప్రాంతాలతో పాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్, అడవివరం, బీఆర్డీఎస్ రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాలలో నిఘా పెంచారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బలగాలను పహారా పెట్టారు.

News December 31, 2024

విశాఖ కేంద్ర కారాగారంలో సెల్ ఫోన్లు లభ్యం

image

విశాఖ కేంద్ర కారాగారం వరుస ఘటనలతో కొన్ని రోజులుగా వార్తల్లోకి ఎక్కుతోంది. మంగళవారం మరోసారి కలకలం రేగింది. జైలు లోపల అధికారుల తనిఖీల్లో ఒక స్మార్ట్ ఫోన్, ఒక కీప్యాడ్ ఫోన్, పవర్ బ్యాంక్ బయట పడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైలు నుంచి 37 మంది వార్డర్స్‌ను వివిధ జైళ్లకు అటాచ్మెంట్ చేశారు.

News December 31, 2024

విశాఖ: న్యూయర్ వేడుకలకు యువత సిద్ధం

image

ఉమ్మడి విశాఖలో న్యూయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. పదేళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపే వారు. హైటెక్ యుగంలో గ్రీటింగ్ కార్డ్స్ తెరమరుగవగా వాట్సాప్ ద్వారా గ్రీటింగ్స్ తెలుపుకుంటున్నారు. ఇటు విశాఖ బీచ్ రోడ్డులో న్యూయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు యువత ఉత్సాహం చూపుతున్నారు. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి.

News December 31, 2024

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా విడుదల

image

ఉమ్మడి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదాను ఎన్నికల అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. శ్రీకాకుళం విజయనగరం, మన్యం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలో 21,555 ఓటర్లులో ఉన్నట్టు ముసాయిదాలో ప్రకటించారు. ఈ ముసాయిదాను వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ జాబితాను వివిధ రాజకీయ పార్టీలకు అందజేయనున్నారు.

News December 30, 2024

విశాఖ: పలు రైళ్లకు జనవరి 1 నుంచి నంబర్ల మార్పు

image

తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 7 రైళ్ల నంబర్లలో మార్పులు చేశారు. కటక్-గుణుపూర్ ప్యాసింజర్‌కు(68433/34),విశాఖ-కిరండూల్ ప్యాసింజర్‌కు (58501/02),విశాఖ-రాయ్‌పూర్ ప్యాసింజర్‌కు (58528/27), విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్‌కు (58538/37), విశాఖ- బ్రహ్మపూర్ (58532/31), విశాఖ-గుణుపూర్ (58506/05), విశాఖ-భవానీపట్నం (58504/03) నంబర్లను కేటాయించారు. జనవరి 1నుంచి అమలులోకి రానున్నాయి.

News December 30, 2024

విశాఖ: తొలి రోజు 233 మంది హాజరు

image

పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి విశాఖ అభ్యర్థులకు సోమవారం నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కైలాసగిరి పోలీస్ మైదానంలో ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు 600 మంది హాజరు కావాల్సి ఉండగా 233 మంది మాత్రమే బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును డీఐజీ గోపీనాథ్ రెడ్డి, ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు.

News December 30, 2024

పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ విభాగంలో 29 క్యాటగిరీలలో మొత్తం 244 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 31నుంచి జనవరి 10లోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. >Share it