Visakhapatnam

News December 30, 2024

హుకుంపేట: దూలానికి బోర్డు.. రెండు రేకులే పాఠశాల పైకప్పు

image

అల్లూరి జిల్లా హుకుంపేట(M) ఎగరూడి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. నిధులు మంజూరయినప్పటికీ పాఠశాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలిపారు. దీంతో రేకుల షెడ్డులో బోధనలు సాగుతున్నాయని చెప్పారు. ఎండ, చలి, విష సర్పాల నుంచి రక్షణ లేకుండా పోయిందని, పిల్లలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

News December 30, 2024

కంచరపాలెం: ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా

image

కంచరపాలెం ఉపాధి కార్యాలయంలో 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ అధికారి చాముండేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో పలు కన్స్ట్రక్షన్, హెచ్డీబీ ఫైనాన్స్, మెడిప్లస్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. SSC, ఇంటర్, ఐటిఐ ఎలక్ట్రిషన్, డిగ్రీ డిప్లమో ఎలక్ట్రికల్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 

News December 30, 2024

సబ్బవరం: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

image

సబ్బవరం PS పరిధిలోని అమ్ములపాలెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడ్డారు. బలిజపాలెంకు చెందిన సూర్యారావు(48), భార్య మంగమ్మ ఆదివారం సబ్బవరం వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు బైక్‌పై స్వగ్రామం బయలుదేరారు. అమ్ములపాలెం వద్ద వెనుక వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యారావు చనిపోయారు. గాయపడ్డ మంగమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News December 29, 2024

ఆస్ట్రేలియాలో సెల్ఫీలు అడుగుతున్నారు: నితీశ్ తండ్రి

image

విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతని తండ్రి ముత్యాలరెడ్డి ఆనందానికి హద్దులే లేవు. ఉంటున్న ప్రాంతంలోని వారికే నేను ఎవరో తెలీదు అలాంటిది ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే సెల్ఫీలు అడుగుతున్నారంటూ మురిసిపోయారు. ఆస్ట్రేలియా వచ్చినప్పడు ఇంత దూరం వచ్చినందుకు గర్వపడుతున్నా అనగా ఇది చాలదు ఇంకా చూపిస్తా అంటూ 24 గంటల్లోనే సెంచరీ చేశాడన్నారు.

News December 29, 2024

విశాఖ: ‘సంక్రాంతికి 800 బస్సు సర్వీసులు’

image

సంక్రాంతి సీజన్‌లో ఉత్తరాంధ్రకు 800 ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. శనివారం ఆయన విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ భీమవరం తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు.

News December 29, 2024

సముద్రంలో ఈదుకుంటూ విశాఖ నుంచి కాకినాడకు

image

విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఈదుతూ ప్రయాణించేందుకు శ్యామల గోలి సాహసయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా విశాఖ ఎంపీ శ్రీభరత్, గండి బాబ్జి పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాహస యాత్ర ఆమె ఆత్మవిశ్వాసానికి, మహిళల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఒక్క రోజులో దాదాపు 30 కిలోమీటర్లు పాటు ఈదుతూ 5 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో శ్యామల గోలి ప్రణాళిక రూపొందించారు.

News December 29, 2024

పెందుర్తి: ఉరి వేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

image

పెందుర్తి మండలం చినముషిడివాడ కార్మిక‌నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన పీవీ శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులకు ముందుగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చాడు. కాగా..శ్రీకాంత్ అదృశ్యం అయినట్లు శనివారం హైదరాబాదులో కేసు నమోదయింది.

News December 29, 2024

మూడు రోజుల పాటు ‘అరకు చలి’ ఉత్సవాలు

image

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ‘అరకు చలి’ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో శనివారం పాడేరు ఐటిడిఏ పీఓ అభిషేక్, జేసీ అభిషేక్ గౌడ్ అరకులోయ వచ్చి స్థల పరిశీలన చేసి, ఉత్సవాల విజయవంతానికి ప్రణాళికను రూపొందించారు. దేశంలో ఉన్న గిరిజన సాంప్రదాయాలు, ఆచారాలను ఉత్సవాల ప్రాంగణంలో ప్రదర్శించేలా ఏర్పాటు చేస్తున్నట్లు పీఓ తెలిపారు.

News December 29, 2024

పాడేరు: గిరిజన విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్

image

కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. శ్రీకృష్ణాపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికలు, దిగు మొదాపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యాలు, పరిస్థితులు, తల్లిదండ్రులు వృత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

News December 28, 2024

విశాఖ: బీచ్‌లో ప్రారంభమైన నేవీ రిహార్సల్స్

image

విశాఖ నగరంలో వచ్చే నెల నాలుగవ తేదీన నేవీ డే సందర్భాన్ని పురస్కరించుకుని బీచ్‌లో శనివారం సాయంత్రం నేవీ రిహార్సల్స్ ప్రారంభం అయ్యాయి. నేవీ అధికారులు, సిబ్బంది అద్భుత విన్యాసాలు ప్రదర్శించారు. ఒకేసారి మూడు హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నగరంలో ప్రజలు విన్యాసాలను తిలకించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు రిహార్సల్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు.