India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. కూరగాయలు దిగుబడి ఎక్కువగా ఉండి మద్దతు ధర లేకపోవడంతో రైతుల అవస్థలు పడుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ చేయక సహాయ సహకారాలతో రైతులు నేరుగా దగ్గరలోని రైతు బజార్లో తమ కూరగాయలు విక్రయించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగికంగా తనను వేధిస్తున్నాడంటూ 2023లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఓ యువతి పెబ్బిలి రవికుమార్పై ఫిర్యాదు చేసింది. వెంటనే అతను హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల పెందుర్తి పోలీసులు రిట్ పిటిషన్ వెయ్యగా బెయిల్ రద్దవ్వడంతో అతనిని శనివారం అరెస్టు చేసినట్లు ఏసీపీ సాయి పృథ్వీ తేజ తెలిపారు. రవికుమార్ ప్రస్తుతం ఏపీ బీసీ సమైక్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిని శనివారం రిమాండ్కు పంపించారు. నగరానికి చెందిన ఓ మహిళకు ఫేక్ ఇన్స్టా ద్వారా తన ఫేస్తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోస్ వచ్చాయి. న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే ఫొటోస్ ఫార్వార్డ్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కంచరపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
విశాఖ నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారిని గమనించి అపరాద రుసుములను వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ప్లానింగ్ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు శనివారం గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు, పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆహ్లాదకర వాతావరణంలో పని చేద్దామని స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిబ్రవరి నెల 3వ శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ఇతర సంస్థల పరిధిలో అధికారులు, సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నాట్లు ఆయన తెలిపారు.
విశాఖలో గులియన్ బారే సిండ్రోం (జీబీఎస్) కేసులు నమోదు కావడం కలకలం రేపింది. గడచిన నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు ఈ సమస్యతో కేజీహెచ్లో చేరారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలోని ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో వీరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే పూర్తిగా కోలుకునేవరకు తమ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు.
గోపాలపట్నంలో శుక్రవారం జరిగిన వివాహిత ఆత్మహత్య ఘటన కలిచివేసింది. తన వికృత చేష్టలతో భార్యను దారుణంగా హింసించిన భర్త.. చివరకు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. పోర్న్ వీడియోలకు బానిసై భార్యతో మానవ మృగంలా ప్రవర్తించాడు. లైంగిక వాంఛకు ప్రేరేపించే మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. మానసికంగా ఎంతో వేదనను అనుభవించిన ఆమె చివరకు ఉరి వేసుకుని తన జీవితానికి ముగింపు పలికింది.
గాజువాకలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో లక్ష్మణరావు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సీతమ్మధారలోని ఓ అపార్ట్మెంట్లో లక్ష్మణరావు వాచ్మెన్గా పనిచేస్తుండగా ధోబీగా రమణ పనిచేస్తున్నారు. రమణ బంధువులలో ఒకరు చనిపోతే పరామర్శ కోసం ఇద్దరూ స్కూటీపై అనకాపల్లి వెళ్లారు. తిరిగి వస్తుండగా పాత గాజువాక వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో లక్ష్మణరావు మృతిచెందినట్లు CI కోటేశ్వరరావు తెలిపారు.
<<15458247>>పోర్న్ వీడియోలకు<<>> బానిసైన గోపాలపట్నంకి చెందిన నాగేంద్ర తన భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే ఘటనను సీరియస్గా తీసుకున్న విశాఖ పోలీసులు నాగేంద్రపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.