Visakhapatnam

News June 16, 2024

అచ్చుతాపురం: అప్పు తీర్చేందుకు ఆలయంలో చోరీ

image

జల్సాలకు అలవాటు పడి చేసిన అప్పులు తీర్చడానికి ఇద్దరు యువకులు అమ్మవారి గుడిలో చోరీకి పాల్పడిన సంఘటన జీ.ధర్మవరంలో వెలుగు చూసింది. మార్టూరుకు చెందిన అభిషేక్, కిషోర్ మద్యానికి బానిసై అప్పులు చేశారు. అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగడంతో ఈనెల 9న అర్ధరాత్రి జీ.ధర్మవరం దుర్గమ్మ గుడి తలుపులు పగలగొట్టి ఐదు సీసీ కెమెరాలు, హుండీలో ఉన్న రూ.5వేలు చోరీ చేశారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News June 15, 2024

రావికమతం: పిడుగు పడి రైతు మృతి

image

రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామంలో శనివారం పిడుగు పడి రైతు రాజాన పెంటయ్య మృతి చెందాడు. పెంటయ్య తన పశువులను మేతకు తీసుకువెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ఇంటికి వెళ్లే ప్రయత్నంలో రైతుకు సమీపంలో పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 15, 2024

విశాఖ: 17న పలు రైళ్లను రద్దు  

image

వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు వంతెన మరమ్మతుల కారణంగా17న పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. 17న పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 17న బయలుదేరే విశాఖ-బ్రహ్మపూర్, 18న బయలుదేరే బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

News June 15, 2024

కొయ్యూరు: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

కొయ్యూరు మండలం చీడిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న వట్టి కాలువ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శనివారం స్థానికులు వట్టి కాలువ వైపు వెళ్లగా అక్కడ ఉన్న చెట్టుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 15, 2024

ఓడినా జగన్‌కు బుద్ధి రాలేదు: గండి బాబ్జి

image

ఓడిపోయినా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు హామీలను అమలు చేస్తూ సంతకాలు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్నారు. జగన్ రెడ్డిని ప్రజలు వ్యతిరేకించినా ఆయనలో పశ్చాత్తాపం కనిపించలేదన్నారు.

News June 15, 2024

అంతర్వేదిలో హోంమంత్రి వంగలపూడి అనిత పూజలు

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన హోం మంత్రి అనితకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఈవో సత్యనారాయణ మంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

News June 15, 2024

ఏయూ వీసీపై చర్యలు తప్పవు: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

image

ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి. మహేశ్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఏయూలో అరాచక పాలనకు ముగింపు పలుకుతామన్నారు. ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఏయూ వీసీ 200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ గెస్ట్ ఫ్యాకల్టీలను తొలగించారని అన్నారు.

News June 15, 2024

విశాఖ: 28న 100వ తపాలా డాక్ అదాలత్

image

తపాలా వినియోగదారుల సమస్యలు ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 28న విశాఖ నగరం ఎంవీపీ కాలనీలోని తపాలా శాఖ రీజినల్ కార్యాలయంలో 100వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ప్రసన్న రెడ్డి తెలిపారు. అల్లూరి, పార్వతీపురం, కోనసీమ, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తపాలా వినియోగదారులు సమస్యలను ఈనెల 21వ తేదీలోగా రీజినల్ కార్యాలయం చిరునామాకు అందజేయాలన్నారు.

News June 15, 2024

పరవాడ: చేపల వేటకు సిద్ధం అవుతున్న మత్స్యకారులు

image

చేపల వేట నిషేధం గడువు జూన్ 15వ తేదీ అర్ధరాత్రితో ముగుస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధం అవుతున్నారు. 61 రోజుల చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులు చినిగిన వలలు, పాడైన పడవలకు మరమ్మతులు చేసుకున్నారు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం జాలరిపేట మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. పరవాడ మండలంలో 120 పడవల ద్వారా మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ ఉంటారు.

News June 15, 2024

విశాఖ: పెన్షన్ పెంపు వల్ల 1,65,432 మందికి లబ్ధి

image

సామాజిక  పెన్షన్‌లు పెంచుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విశాఖ జిల్లాలో 1,65,432 మంది లబ్ధి పొందనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.  పెన్షన్ పెంపు వల్ల ప్రతినెల అదనంగా రూ.21.27 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ పథకాన్ని ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌గా ప్రభుత్వం మార్పు చేసింది. విశాఖ జిల్లాలో 16 రకాల  పెన్షన్ దారులు ఉన్నట్లు తెలిపారు.