India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు వెళ్లాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. వుడా చిల్డ్రన్ ఎరీనాలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిధర్, నేవీ అధికారులతో కలిసి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. గిరిధర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,59,277 మంది లబ్ధిదారులకు రూ.69.21 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు.
చింతపల్లి మండలంలోని అన్నవరం సంతపాకలు వద్ద మద్యం అధికంగా తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. చోడిరాయి గ్రామానికి చెందిన మువ్వల నాగేశ్వరరావు (50)అనే వ్యక్తి గురువారం రాత్రి మద్యం అధికంగా తాగాడు. మద్యం మత్తులో రాత్రి అక్కడే పడుకున్నాడు. అయితే చలి తీవ్రతకు శుక్రవారం ఉదయానికి మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని అన్నవరం ఎస్ఐ జీ.వీరబాబు తెలిపారు.
చోడవరం పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి మేనల్లుడిని మేనమామ హత్య చేశాడు. స్థానికంగా రెల్లివీధిలో నివాసం ఉన్న మేనల్లుడు ఎస్ ప్రేమ కుమార్ మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని విక్రయిస్తూ రోజు మద్యం తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరి మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. ప్రేమ కుమార్ను మద్యం మత్తులో ఉన్న దుర్గ కర్రతో దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సంక్రాంతి సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కే సందీప్ తెలిపారు. 5,12 తేదీల్లో సికింద్రాబాద్లో సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు విశాఖ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో జనవరి 6, 13 తేదీల్లో విశాఖలో రాత్రి 7:30 గంటలకు బయలుదేరుతుందన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనను అందరం బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా స్థాయి బాల్య వివాహాల కమిటీ హైబ్రిడ్ సమావేశం నిర్వహించారు. పీవీటీజీ తెగలు, బడి మానేసిన పిల్లలలో బాల్య వివాహాలు జరుగుతున్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గత రెండేళ్లలో 25 బాల్య వివాహాలు నిరోధించినప్పటికీ గత రెండేళ్లలో 357 మంది టీనేజ్ గర్భవతులు ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
మెముకు బదులుగా సాధారణ రైళ్లును ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు నడపనున్నట్లు వాల్తేరు డిసీఎం కే సందీప్ తెలిపారు. విశాఖ-పలాస-విశాఖ నెంబర్లతో ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు శుక్ర, ఆదివారాలు మినహా ఈ రైలు నడుస్తుందన్నారు. విశాఖ-విజయనగరం మధ్య మెము పాసింజర్ ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 28 వరకు గురువారాలు మినహా సాధారణ రైలుగా నడుస్తుందని అన్నారు. ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు నడుస్తుందన్నారు.
అల్లూరి ఏజెన్సీ విభిన్న వాతావరణాలకు నిలయం. ఇక్కడ ఏ సమయంలో వాతావరణం ఏ రకంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అందుకు నిదర్శనమే ఈ దృశ్యం. ఎప్పుడూ మేఘాలతో ఉండే పాడేరు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి పరిసర ప్రాంతాల్లో గురువారం ఆకాశం ఎర్రగా మారింది. దీంతో స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యానికి లోనై తమ సెల్ ఫోన్ కెమెరాలలో ఈ దృశ్యాల్ని బంధించి ఆందించారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు పరిధిలో వాల్తేరు డివిజన్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆయన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. వాల్తేరు డీఆర్ఎంగా పనిచేసిన సౌరబ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. అప్పటినుంచి ఏడీఆర్ఎం ఇన్ఛార్జ్ డీఆర్ఎంగా పనిచేస్తున్నారు.
భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఏపీజీవీబీ ఆంధ్రా, తెలంగాణ విభాగాల విభజన దృష్ట్యా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ ఎస్.సతీశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. జనవరి ఒకటి నుంచి బ్యాంకు సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.