India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో చేపట్టిన కులగణనను పారదర్శకంగా చేపట్టాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారుల ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాలపై సమీక్ష చేసేందుకు, పథకాలు అమలు చేసేందుకు, మెరుగైన పాలసీ రూపకల్పన కోసం నిర్వహించిన కులగణనపై గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సామాజిక సర్వే(సోషల్ ఆడిట్)ను చేపడుతున్నట్లు వెల్లడించారు.
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ బీజేపీలో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన స్పీకర్ అయ్యన్న సైతం వారి ఆరోపణలకు ఏకీభవించి విచారణకు ఆదేశించారు. దీంతో ఆడారి టీడీపీలో చేరాలని ప్రయత్నించగా బాహటంగానే ఆ పార్టీ నేతలు వ్యతిరేకించడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంధన పొదుపులో గోల్డ్ అవార్డు గెలుచుకుంది. అవార్డును విశాఖ ఉక్కు కర్మాగారం తరఫున ఇంధన, పర్యావరణం జనరల్ మేనేజర్ ఉత్తమ బ్రహ్మ, డీజిఎం విజయానంద్ గురువారం విజయవాడలో స్వీకరించారు. స్టీల్ ప్లాంట్కు మరోసారి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు సాధించినందుకు ప్లాంట్ సీఎండీ ఏకె సక్సేనా అధికారులు సిబ్బందిని అభినందించారు.
పనోరమ హిల్స్ వద్ద మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. మర్రిపాలెంకు చెందిన ఎస్.నాగేశ్వరరావు(38) ఆటోలో కేటరింగ్ సామాన్లు తీసుకువచ్చి అనుమాస్పద స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతిపై ఎలాంటి అనుమానం లేదని..అతిగా మద్యం తాగిన కారణంగానే అతను మరణించినట్లు పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపారు.
వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్లు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ కారణంగా రాష్ట్రంలో తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలమైనా విశాఖలో బీచ్లు చెక్కుచెదరలేదు. రాకాసి అలలు కృష్టా జిల్లాలో 27, నెల్లూరులో 20, ప్రకాశంలో 35 మందిని బలితీసుకోగా.. విశాఖలో ఒక్క ప్రాణం కూడా పోలేదు. దీనికి కారణం ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధంగా సముద్రంలోకి చొచ్చుకొచ్చే కొండలు, డాల్ఫిన్స్ నోస్.
విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన ఫాతిమా ఉస్మాన్ చౌదరి, ఆమె భర్త తన్వీర్, అవినాశ్, వారి స్నేహితుడు బెంజిమన్ పాత్ర ఉన్నట్లు రుజువు కావడంతో వారిని కంచరపాలెం పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరు జాయ్ జమీమా బృందానికి మత్తుమందులు, స్ప్రేలు సరఫరా చేసేవారని పేర్కొన్నారు.
సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్ను జత చేస్తున్నట్లు తెలిపారు.
పాతడెయిరీ ఫారం ఇందిరాగాంధీ నగర్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అప్పారావు, సత్యవతి, రాజశేఖర్, చంద్రశేఖర్ గాయపడ్డారు. వీరిని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లిన వీరు తిరిగి వచ్చే ఇంటి మొత్తం గ్యాస్ లీకై వ్యాపించింది. నాగరాజు లైట్ వెయ్యగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం.
అంతర్ జిల్లా యువ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు బుధవారం వైఎస్ఆర్ కడప వెళ్లినట్లు NYK జిల్లా అధికారి మహేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి 30వరకు ఈ యువ సమ్మేళనం జరుగుతుందన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన 25 మంది యువతీ యువకులు ఇందులో పాల్గొన్నారన్నారు. యువ సమ్మేళనాలతో వివిధ సమూహాల సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కలుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు జనవరి 4న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, నేవీ కమోడర్ మోహన్ పరిశీలించారు. సీఎం సభాస్థలికి చేరుకునే దగ్గరనుంచి తిరుగు ప్రయాణం అయ్యేవరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్సీబీ మీదుగా ఆర్కే బీచ్కు చేరుకుంటారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.