India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతను దైవ కార్యంగా భావిస్తానని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తనకు కీలకమైన హోం శాఖను అప్పగించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.
రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. విశాఖ విచ్చేసిన మంత్రి ఐఎన్ఎస్ డేగాలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రక్షణ రంగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ బలమైన స్వావలంబన కలిగిన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మొదటి హోంమంత్రిగా అనిత రికార్డు సృష్టించారు. 62 ఏళ్ల తర్వాత పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి వరించింది. మొదటి సారి కేబినెట్లో చోటు సంపాదించుకున్న అనితకు చంద్రబాబు హోంశాఖను అప్పజెప్పి రాష్ట్ర శాంతిభద్రతలు ఆమె చేతిలో పెట్టారు. వృత్తి పరంగా టీచర్ కావడం ప్లస్ పాయింట్. ప్రతి విషయంపై సమగ్రమైన అవగాహన ఉండటం, వాగ్ధాటి, సూటిగా మాట్లాడేతత్వం ఆమెకు కలిసొచ్చే అంశాలు.
రెండోసారి కేంద్ర రక్షణ శాఖ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా విశాఖపట్నం వచ్చిన రాజ్ నాథ్ సింగ్కు విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో ఐఎన్ఎస్ జలస్వా నౌకపై దిగారు. అనంతరం ఈస్ట్రన్ ప్లీట్లో డేట్ సీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్లో సందర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
త్వరలో మేయర్ను కూడా దించేస్తామని టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు అత్యంత అవినీతి పరులుగా వ్యవహరించారని, కొన్ని సాంకేతిక మార్పులు చేశాక.. మేయర్ మార్పులు జరుగుతాయని అన్నారు. జగన్ ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారని ఆయన విమర్శించారు.
వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖను కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మంత్రిగా అనిత ఉన్నారు. పాయకరావుపేట నియోజకర్గం నుంచి మొదటి మంత్రి అనితే కావడం గమనార్హం. టీచర్ పనిచేసిన అనిత 2014లో మొదటిసారి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 కొవ్వురులో పోటీ చేసి మాజీ హోంమంత్రి తానేటి వనిత చేతిలో ఓడిన అనితను హోంమంత్రి వరించడం విశేషం.
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడితో పాయకరావుపేట ఎమ్మెల్యే, మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో ఆయన స్వగృహంలో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిని అనిత శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పలు విషయాలపై వారు చర్చించారు. మంత్రి పదవి పొందిన అనితను రామకృష్ణుడు అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని రామకృష్ణుడు సలహా ఇచ్చారు.
జూనియర్లకు మంత్రులుగా అవకాశం రావడం పట్ల సీనియర్గా ఆహ్వానిస్తున్నానని అయ్యన్నపాత్రుడు గురువారం తెలిపారు. సీనియర్లకు అవకాశం ఇవ్వలేదంటున్నారని.. తనకు 25 ఏళ్లకే NTR మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఇప్పటికే 5సార్లు మంత్రిగా, ఒకసారి MPగా చేశాను మిగతావారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా’ అని పేర్కొన్నారు. ‘పదవి రానివారిని చంద్రబాబు ఓదార్చాలా.. మాకు MLA టికెట్ ఇవ్వడమే గొప్ప’ అని వ్యాఖ్యానించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ శుక్రవారం నగరానికి రానున్నారు. రెండవసారి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయానికి ప్రత్యేక విమానంలో మద్యాహ్నం 12:20 గంటలకు విశాఖలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మద్యాహ్నం 12:50 గంటలకు విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలస్వా నౌకపై రక్షణ శాఖ మంత్రి దిగనున్నారు.
విశాఖలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడీ కె.రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫ్రీ మెట్రిక్-8, పోస్ట్ మెట్రిక్-14, వసతి గృహాలు ఉన్నట్లు తెలిపారు. ఫ్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 872, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 672 మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. వివరాల కోసం MVP కాలనీ, భీమిలిలోని సహాయ సాంఘీక సంక్షేమశాఖ కార్యాలయాలను సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.