Visakhapatnam

News June 13, 2024

విశాఖ: 509 ఉద్యోగాలు.. టెన్త్ అర్హత

image

కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సీహెచ్ సుబ్బిరెడ్డి తెలిపారు. వివిధ కంపెనీలో 509 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 18-40 ఏళ్ల వయసు గల మహిళ, పురుష అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చునని తెలిపారు.

News June 13, 2024

ఆర్కిటెక్చర్ పదో సెమిస్టర్ ఫలితాల విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి ఫలితాలను పొందవచ్చునని సూచించారు.

News June 13, 2024

పాడేరు ఘోర ప్రమాదంలో.. అచ్యుతాపురం యువకుడి మృతి

image

పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం అచ్యుతాపురంలో విషాదం నింపింది. సౌండ్స్ సిస్టమ్స్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి ముగ్గరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అచ్యుతాపురానికి చెందిన పీ.లక్ష్మణ్(25) మృతిచెందాడు. ఈయనకు భార్య, 5 నెలలు బాబు ఉన్నారు. లక్ష్మణ్ మృతి చెందాడనే విషయం తెలిసి కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుపెట్టుకున్నారు.

News June 13, 2024

అమరావతిలో విశాఖ జిల్లా నేతల సందడి

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా TDP నేతలు సందడి చేశారు. కూటమి తరఫున గెలిచిన MP, MLAలు, పార్టీల నేతలు, నియోజకవర్గాల బాధ్యులు, ముఖ్య కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ MP శ్రీభరత్, MLAలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, TDP విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గండిబాబ్జీ, దక్షిణ నియోజకవర్గ బాధ్యుడు సీతంరాజు సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

News June 13, 2024

పాడేరు ఘాట్ వ్యాన్ ప్రమాదంలో బిడ్డ కోసం తల్లి సాహసం

image

పాడేరు ఘాట్‌లో సౌండ్ సిస్టం లోడుతో వెళ్తున్న వ్యాన్ బుధవారం బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తన బిడ్డను రక్షించుకునేందుకు ఓ తల్లి సాహసం చేసింది. వ్యాన్ కింద నలిగిపోతున్న బిడ్డకు ఏమీ కాకుండా కౌగిలిలో వదలకుండా పట్టుకుంది. దీంతో వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బిడ్డకు ఏమీ కాకుండ తల్లి చేసిన సాహసాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.

News June 13, 2024

విశాఖ: 26 కేంద్రాల్లో పరీక్ష

image

జిల్లాలో ఈనెల 16వ తేదీన రెండో సెష‌న్ల‌లో జ‌రిగే యూపీఎస్సీ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు జిల్లాలో ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహ‌న్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. ఎలాంటి లోపాలు త‌లెత్త‌కుండా స‌మ‌న్వ‌యం పరీక్ష విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలోని 26 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News June 13, 2024

విశాఖ: జూలై 1 నుంచి పలు రైళ్లకు నెంబర్లు మార్పు

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో జూలై 1 నుంచి పలు రైళ్లకు నెంబర్లను మారుస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ-కడప తిరుమల ఎక్స్ ప్రెస్‌కు 18521, రిటర్న్ ట్రైన్‌కు 18522 నంబర్లను కొత్తగా కేటాయించామన్నారు. విశాఖ-బెనారస్ వీక్లీ ట్రైన్‌కు18523, రిటర్న్ ట్రైన్‌కు 18524, విశాఖ-కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్‌కు 18527, రిటర్న్ ట్రైన్‌కు 18528 నెంబర్లు కేటాయించినట్లు వెల్లడించారు.

News June 12, 2024

I LOVE కైలాసగిరి

image

పర్యాటకులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా ఆధునిక హంగులతో కైలాసగిరిపై I LOVE కైలాసగిరి పేరుతో నూతనంగా వ్యూ పాయింట్‌ నిర్మించారు. పెద్దపెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన బోర్డులను విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బుధవారం ప్రారంభించారు. రాత్రి వేళల్లో వెలుగులు వచ్చేలా విద్యుత్ దీపాలను కూడా అమర్చారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఉన్న ఐ లవ్ వైజాగ్ బోర్డులు మాదిరిగానే నూతనంగా దీనిని నిర్మించారు.

News June 12, 2024

పాడేరులో ఘోర ప్రమాదం

image

పాడేరు ఘాట్ రోడ్ 12 మైళ్ళ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. పాడేరు మోదకొండమ్మ జాతరకు సౌండ్, లైటింగ్ సిస్టమ్స్ తెచ్చి తిరిగి వైజాగ్ వెళుతుండగా డీసీఎం లారీ బ్రేకులు ఫెయిలై లోయలోకి దూసుకుపోయింది. లారీలో ఉన్న 11 మంది ప్రమాదానికి గురయ్యారు. వారిలో కనిపించిన ఆరుగురిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురు లోయలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు..?

image

రాష్ట్ర శాసనసభలో బీజేపీ శాసనసభ పక్ష నేతగా విష్ణుకుమార్ రాజును ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విష్ణుకుమార్ రాజు గతంలోనూ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు. బుధవారం సాయంత్రం విజయవాడలో జరుగుతున్న బీజేపీ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.