India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ సబ్జెక్టులలో తప్పిన విద్యార్థుల కోసం నిర్వహించే స్పెషల్ ఎగ్జామినేషన్స్ జూలై 13 నుంచి ప్రారంభం కానున్నాయని డిప్యూటీ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరిగే తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.
ప్రజలు చాప కింద నీరులా చేసిన విప్లవం వలనే కూటమి భారీ విజయం సాధించిందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అహకారానికి , అభివృద్ధికి జరిగిన యుద్ధంలో అభివృద్ధే గెలిచిందన్నారు. రాక్షస పాలన పోయిందని ఆంధ్ర ప్రజలు ఊరిపి పీల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏ శాఖ ఇచ్చినా తన మార్కు ఉండే విధంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబు, ఎన్డీఏ మార్కు పాలన చేస్తానని వెల్లడించారు.
మంత్రి వంగలపూడి అనితకు కేటాయించే శాఖపై ఆసక్తి నెలకొంది. అధికార పక్షంతోపాటు ప్రతిపక్ష నేతలు సైతం ఆమెకు కేటాయించే శాఖపై చర్చించుకుంటున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయించే అవకాశాలున్నాయని పలువురు భావిస్తుండగా.. ఆమె టీచర్గా పనిచేసిన కారణంగా విద్యాశాఖతో పాటు హోంశాఖ అయినా అప్పగించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న బీఎస్సీ- ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 26వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ.నాయుడు తెలిపారు. ఈనెల 28వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు జరుపుతామని తెలిపారు. ఇంటర్ విద్యార్హత కలిగిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఏ.యూ వెబ్ సైట్లో సంప్రదించాలన్నారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అనితతో పదవీ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపైన ఉన్న పెద్దలకు అనిత నమస్కరించారు.
MA, BED చేసిన వంగలపూడి అనిత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2014లో పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె దశాబ్ధ కాలంలో ఎన్నో పదవులు చేపట్టారు. టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా, టీటీడీ సభ్యురాలిగా సేవలందిచారు. పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిత చంద్రబాబు కేబినెట్లో చోటుదక్కించుకున్నారు.
విశాఖ నగర పరిధిలో గల రైతు బజార్లలో కిలో టమోటా రూ.50కి విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో కిలో రూ.70కి పెరిగింది. ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు తెలిపారు. వర్షాలు లేకపోవడం, తోటలకు తెగుళ్లు సోకడం తదితర కారణాల వల్ల దిగుబడి తగ్గిందని తెలిపారు. దీంతో మధ్యతరగతి ప్రజలు టమాటాల జోలికి వెళ్లడం లేదు.
ఏపీ నూతన కేబినెట్ కూర్పు చంద్రబాబు రాజకీయ చతురతకు నిదర్శనంగా మారింది. ఉమ్మడి విశాఖకు సంబంధించి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణ వంటి సీనియర్లను సైతం పక్కనపెట్టి పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు మంత్రి పదవి ఇచ్చారు. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరికి మాత్రమే కేబినెట్లో చోటుదక్కడం గమనార్హం.
ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఒకరికే అవకాశం దక్కింది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను మంత్రి పదవి వరించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ జాబితా విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలో కీలకపాత్ర వహించిన అనితకు మంత్రి పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ జాబితాలో గంటా, అయ్యన్న వంటి సీనియర్లకు చోటు లభించకపోవడం గమనార్హం.
ఎస్ రాయవరం మండలం గోకులపాడు వద్ద లారీ మంగళవారం ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విశాఖ నుంచి కర్ణాటక వెళుతున్న లారీ గోకులపాడు వద్దకు వచ్చేసరికి లారీ డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకుని ఇంటిని ఢీకొట్టాడు. ఇంటిని ఢీకొని లారీ ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
Sorry, no posts matched your criteria.