India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ వీఐపీ రోడ్డులో Devinci థాయ్ స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు త్రీటౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు ఆదివారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో మహిళలకు అధిక సొమ్ము ఆశ చూపి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచార నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నలుగురు బాధిత మహిళలను శక్తి సదన్ హోమ్కు పంపారు.
విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మునగపాక మండలం వెంకటాపురంలో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమంలో బుచ్చియపేట జడ్పీటీసీ, జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు దొండా రాంబాబు, సీనియర్ జడ్పీటీసీ కర్రి సత్యం పాల్గొన్నారు. జడ్పీటీసీల ఫ్లోర్ లీడర్గా పరవాడ జడ్పీటీసీ పైలా సన్యాసి రాజును ఎన్నుకున్నామని రాంబాబు తెలిపారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసిలాటపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. జన సమూహం ఎక్కువగా ఉన్న సమయంలో హీరో అల్లు అర్జున్ వెళ్లకుండా ఉంటే బాగుండేదని.. అయితే ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ముందుగా గ్రహించి సమాచారం ఇవ్వాల్సి ఉందని అన్నారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాలని.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మంచిది కాదని పల్లా అన్నారు. ఈ ఘటన కారణంగా బెనిఫిట్ షోలు ఆపేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
విశాఖ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. దీంతో హరిదాసులు, బసవన్నలు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. అయితే కాలానుగుణంగా హరిదాసులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు కాలినడకన తంబుర పట్టుకుని వీధివీధి తిరిగేవారు. అయితే మర్రిపాలెం గ్రామంలో టూవీలర్ల పై హరిదాసులు తిరుగుతూ సందడి చేస్తున్నారు. దీన్ని చూసిన పలువురు ఆనాటి కళకనిపించడం లేదని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ద్వారా అనంతగిరి మండలం కొర్రపత్తి ఎం.పి.పి. స్కూల్ను అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. బల్లగరువులో సభను ముగించుకుని వెళ్తున్న పవన్ కళ్యాణ్ దారిలో ఉన్న కొర్రపత్తి స్కూల్కు వెళ్లి చిన్నారులు, సిబ్బందితో మాట్లాడగా వారు సమస్యను వివరించారు. అలాగే అంగన్వాడీ సెంటర్, స్కూల్ ప్రహరీ గోడ, ఊరిలో సీసీ రోడ్లు పంచాయతీరాజ్ శాఖ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు.
రైవాడ జలాశయ అందాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఫోన్లో చిత్రీకరించారు. బల్లగరువు బహిరంగ సభకు వెళ్లే క్రమంలో రైవాడ జలాశయ అందాలను తిలకించేందుకు జీనబాడు – కోలపర్తి సమీపంలో పవన్ కళ్యాణ్ కారు దిగి ఆ ప్రాంతంలో అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంలో ఫోన్లో ఆ సుందరమైన కొండల మధ్యలో జలాశయ అందాలను బంధించారు.
జీవీఎంసీ తరపున స్టాండింగ్ కౌన్సిల్లో నియమించుటకు న్యాయవాదుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.8 మంది న్యాయవాదులు నియామకం నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసారు.బార్ కౌన్సిల్స్ లో కనీసం 10 సంవత్సరాల మెంబర్గా రిజిస్ట్రేషన్ అయిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.ఆసక్తి గలవారు జనవరి 6 లోపు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు.
గంజాయి స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులు కొనుగోలు చేయడం నేరం అని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోషులుగా ఉన్న వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయడం గానీ, డబ్బు చెలామణి జరిగినట్టు రుజువు ఐతే జప్తు చేయబడుతుందన్నారు. లావాదేవీలు జరిపే వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
అక్రమంగా 11 మంది అమ్మాయిలను ఒడిశాలోని నవరంగ్పూర్ నుంచి చెన్నై ట్రైన్లో తరలిస్తున్న నిందితుడు రవికుమార్ను శనివారం అరెస్టు చేశామని విశాఖ రైల్వే సీఐ ధనంజయ నాయుడు తెలిపారు. 11 మందిని పని పేరుతో అక్రమంగా ఆధార్ టాంపర్ చేసి గార్మెంట్లో పని కోసం తిమ్మాపూర్ తరలిస్తున్నారని గుర్తించామని అన్నారు. అక్రమ రవాణా, ఆధార్ టాంపరింగ్పై సెక్షన్ 143 (5)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో భాగంగా శనివారం విశాఖలో జరగాల్సిన ఛత్తీస్గఢ్, మిజోరం మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.