Visakhapatnam

News June 11, 2024

శారదా నదిలో పడి ఇద్దరు యువకుల మృతి

image

యలమంచిలి మండలం తెరవుపల్లిలో శారదా నదిలో మునిగి దిమిలికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాసరావు, గాజువాకకు చెందిన జగన్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. వారం క్రితం మేనమామ ఇంటికి వచ్చిన వీరు ప్రతిరోజు నదికి వెళ్లేవారని ఇవాళ నీటి ఒరవడి ఎక్కువగా ఉండడం వల్ల వీరు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.

News June 11, 2024

విశాఖ: హత్య కేసు.. పదేళ్ల జైలుశిక్ష

image

హత్య కేసులో ముద్దాయికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ విశాఖపట్నం పీడీజే కోర్టు తీర్పునిచ్చిందని SP మురళీకృష్ణ తెలిపారు. ’నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పైల రమణకు సుర్ల వెంకటరమణతో భూతగాదాలున్నాయి. ఈ క్రమంలో జరిగిన గొడవతో వెంకటరమణను పైల రమణ హత్య చేశాడు. మృతుడి తల్లి చిన్నమ్మలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశాం’ అని పేర్కొన్నారు.

News June 11, 2024

తమిళనాడు మాజీ CMకు విశాఖ ఎంపీ ఆహ్వానం

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం గన్నవరం విమానాశ్రయం చేరుకోగా.. విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు కేటాయించిన హోటల్‌కు‌ తీసుకువెళ్లారు.

News June 11, 2024

విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు: చంద్రబాబు

image

రాష్ట్రంలో విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ శాసనసభ పక్ష నేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అత్యంత ఆదరణ ఇచ్చిన విశాఖ నగరం దేశంలోనే పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాం’. ఈ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

News June 11, 2024

పాడేరు జాతరలో దారుణం.. ఆరేళ్ల పాపపై అత్యాచారం?

image

అల్లూరి జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతరలో ఆరేళ్ల పాపపై దుండగులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. జాతరకు ఓ కుటుంబం రాగా.. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో పాపను దుండగులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి పరారయ్యారట. పాప ఏడుస్తూ విషయం పెద్దవాళ్లకి చెప్పడంతో పాడేరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 11, 2024

విశాఖ: పలు రైళ్లును దారి మళ్లించిన రైల్వే అధికారులు

image

సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ ముస్తాబాద్-గన్నవరం సెక్షన్ మధ్య భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్లును దారి మల్లించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ పేర్కొన్నారు.
ఎర్నాకులం-పాట్నా (22643 ) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 11, 17, 18, 24, 25 తేదీల్లో, ఎస్‌న్‌వి బెంగళూరు- గువాహటి (125509) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 14, 21, 28 తేదీల్లో దారి మళ్లించనున్నారు.

News June 11, 2024

స్నేహితుల మధ్య వివాదమే హత్యకు కారణం

image

మద్యం మత్తులో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న <<13412715>>వివాదమే<<>> దారుణ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. ఊర్వశి జంక్షన్ నలంద నగర్‌లో స్నేహితుడి పుట్టినరోజు అని హేమంత్ కుమార్, సాయికిరణ్, అభిషేక్, హరీశ్, ఉదయ్ కలిసి బయటికి వెళ్లారు. మద్యం తాగిన అనంతరం వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో హేమంత్ ఉదయ్ మెడపై కత్తితో పొడవగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.

News June 11, 2024

విశాఖ: సీఎం ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

image

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా <<13417280>>ప్రమాణ స్వీకారం<<>> చేసే కార్యక్రమాన్ని ఈనెల 12వ తేదీన ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖ జిల్లా ప్రజలు వీక్షించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుర్తించిన ఏడు కేంద్రాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News June 11, 2024

విశాఖ: పూర్తి స్థాయిలో ఉక్కు ఉత్పత్తి చేపట్టాలని విజ్ఞప్తి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తిని చేపట్టాలని కొత్తగా నియమితులైన ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్ అయోధ్య రామ్ విజ్ఞప్తి చేశారు. 7.5 మిలియన్ల ఉత్పత్తి చేపడితే రూ. 50,000 ఆదాయం వస్తుందని తెలిపారు. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 9000 కోట్లు వెళతాయన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు.

News June 10, 2024

విశాఖ: ఉక్కు కార్మికుల జీతాలు చెల్లించాలని వినతి

image

విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని స్టీల్ ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షులు అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ బట్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.