India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ సముద్రతీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. అలల ఉద్ధృతి కారణంగా నోవాటెల్ హోటల్ ఎదుట ఉన్న సముద్రతీరం కోతకు గురైంది. దీంతో తీరానికి ఆనుకొని ఉన్న పలు నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి.
ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో రెండు రోజులు పర్యటన కోసం ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్లో పవన్ బస చేశారు. శుక్రవారం పార్వతీపురం జిల్లాలో పర్యటించానున్నారు. ఎన్నికల ముందు ఏజెన్సీలో పర్యటించిన గిరిజనుల సమస్యలు తెలుసుకున్న ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించనున్నారు.
కాఫీ బోర్డ్ 2025-26 సంవత్సరానికి డిప్లొమా ఇన్ కాఫీ ఫార్మ్ మేనేజ్మెంట్, సర్టిఫికేట్ కోర్స్ ఆన్ కాఫీ ఫార్మ్ సూపర్వైజర్ కోర్సులకు ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మినుములూరు కాఫీ బోర్డు SLO రమేశ్ తెలిపారు. డిప్లొమా కోర్స్కు ఇంటర్, సర్టిఫికేట్ కోర్సుకు 8వ తరగతి అర్హత ఉండాలన్నారు. SC, ST వారికి ఫీజులో 50% రాయితీ ఉంటుందని, వివరాలకు https://coffeeboard.gov.in/ని సందర్శించాలన్నారు. >Share it
విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఎంటెక్ చదువుతున్న వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కాబావ దగ్గర ఉంటున్న శిరీష కొద్ది రోజులుగా మనస్తాపంతో ఉంది. తండ్రి చనిపోవడం ఆపై చదువుతుండగానే తనకు పెళ్లి చేశారన్న పలు కారణాలతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శిరీష భర్త శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో వ్యవసాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అనకాపల్లికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు గిన్నీస్ బుక్ రికార్డును సాధించారు. చైనాలో స్థిరపడ్డ కొణతాల విజయ్, ఆయన సతీమణి జ్యోతి గతంలో యోగాలో గిన్నిస్ రికార్డు సాధించారు. తాజాగా వారి పిల్లలిద్దరూ గిన్నీస్ రికార్డ్ నెలకొల్పారు. వారి కుమార్తె జస్మిత(14) ఒంటి కాలితో ఒక నిమిషంలో 168 సార్లు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. వారి కుమారుడు శంకర్(5) 129 సార్లు స్కిపింగ్ చేసి రికార్డు సాధించాడు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరున అరకు ఉత్సవంను నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. అరకు ఉత్సవం ఏర్పాట్లపై కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మూడు రోజులుపాటు అరకు ఉత్సవాన్ని విజవంతంగా నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆధికారులకు సూచించారు. పట్టణాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
విశాఖలోని ఈ నెల 21 నుంచి విజయ్ హజారే టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో మిజోరాం, జమ్మూ-కాశ్మీర్, విదర్భ, తమిళనాడు, చత్తీస్గఢ్ జట్లు తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పంచాయతీరాజ్ కమీషనర్ వి.ఆర్ కృష్ణ తేజ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలులో 100% చురుకైన పాత్ర పోషించాలని, ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలని విశాఖ, అనకాపల్లి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యనిర్వహణాధికారి, అధికారులు ఉన్నారు.
జనవరి 4న విశాఖలో నిర్వహించనున్న నావికాదళ విన్యాసాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏర్పాట్లపై గురువారం సమీక్షించారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు భాగస్వామ్యం కానున్నారన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.