India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➠ పీఎం పాలెం GVMC కమ్యూనిటీ హాల్(వార్డు నం.6)
➠ సిరిపురంలోని VMRDA చిల్డ్రన్ ఎరీనా రెండో అంతస్తు
➠ డాబాగార్డెన్స్లోని డ్వాక్రా బజార్ GVMC బిల్డింగ్
➠ అక్కయ్యపాలెం షాధీఖానాహాల్ (వార్డు నం.44)
➠ కంచరపాలెం కాయిత పైడయ్య కళ్యాణ మండపం(వార్డు నం.57)
➠ వేపగుంట కమ్యూనిటీ హాలు(వార్డు నం.94)
➠ గాజువాకలోని చైతన్య నగర్(వార్డు నం.77) LED స్క్రీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
సింహాచలం శ్రీవరాహ లక్ష్మి నరసింహ స్వామి వారికి దివిటీ సేవ నిర్వహించారు. సోమవారం ఒడిశాకు చెందిన భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయంలో ముందుగా టికెట్ తీసుకున్న వారికి దేవస్థానం రెండు దివిటీలను అందజేస్తుంది. ఈ దివిటీలను పట్టుకుంటూ ఆలయం చుట్టు భజనలు చేస్తూ ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ ఆలయంలో ఆధ్యాత్మికతకు నిదర్శనగా నిలుస్తుంది.
ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం గంగమ్మతల్లి పండగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి.. తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మకు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మన ఆంధ్ర-మన ఏపీఎల్ నూతన లోగోను విశాఖలో ఆవిష్కరించారు. ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆరు జట్లు, 11 మ్యాచులు, 120 మంది క్రీడాకారులతో నిర్వహిస్తున్నట్లు ఏపీఎల్ పాలక మండలి సభ్యులు మాంకో ఫెర్రర్, ఛైర్మన్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, కే.ఎస్ భరత్, రికీ భూయా పాల్గొన్నారు.
సౌత్ ఈస్ట్రన్ రైల్వే చక్రధర్ పూర్ డివిజన్ పరిధిలో భద్రత పరమైన పనులు చేపడుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్టేర్ రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. రూర్కెలా-జగదల్పూర్-రూర్కెలా ఇంటర్ సీటీ రైళ్లను ఈనెల 12వ తేదీన రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే రూర్కెలా-గుణపూర్-రూర్కెలా ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈనెల 12న రద్దు చేసినట్లు తెలిపారు.
విశాఖలో ప్రశాంతతను తిరిగి నెలకొల్పుతామని MP శ్రీభరత్ హామీ ఇచ్చారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన ఆయన.. ముందుగా తన తాత ఎం.వీ.వీ.ఎస్ మూర్తికి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తప్పు చేసిన YCP నాయకులు, కార్యకర్తలపై చట్టప్రకారం చర్యలుంటాయన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో మొన్నటి ఎన్నికల్లో YCP నాయకులు, కార్యకర్తలు చూశారని అన్నారు.
అనంతగిరి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు పర్యాటకులు పోటెత్తారు. శనివారం మూడు వేల మంది బొర్రాగుహలను సందర్శించగా రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారం నాలుగు వేల మంది బొర్రా గుహలను సందర్శించగా రూ.3.91 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. అలాగే బొర్రా జిఫ్ లైన్కు సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం రూ.1.16 లక్షల ఆదాయం వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఓ వ్యక్తికి బైక్పై లిఫ్ట్ ఇచ్చి దోచుకొని.. దాడిచేసిన ఘటన ఆదివారం జరిగింది. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలానికి చెందిన జవ్వాది శ్రీను(32) దేవరాపల్లిలోని అత్తారింటికి శనివారం రాత్రి బయలుదేరాడు. వావిలపాడు నుంచి దేవరాపల్లికి వెళ్తూ, దారిలో బైక్పై వస్తున్న వారిని లిఫ్ట్ అడిగాడు. వారు శారదానది వంతెనపై బైక్ ఆపి చాకు చూపిస్తూ పర్సు, సెల్ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. శ్రీను సెల్ఫోన్ ఇవ్వకపోవడంతో దాడిచేశారు.
విశాఖలోని కంచరపాలెం పరిధిలో దారుణ ఘటన చోటచేసుకుంది. సోమవారం ఉదయం కొంతమంది దుండగులు అదే ప్రాంతానికి చెందిన ఉదయ్( 20)పై కత్తితో మెడపై దాడి చేశారు. దీంతో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
.
విశాఖ పోర్ట్ అథారిటీ నగరవ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కాలుష్య నివారణకు విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. రూ.15 కోట్లతో పోర్టుకు చెందిన 186 ఎకరాల్లో మొక్కలు పెంచుతామన్నారు.
Sorry, no posts matched your criteria.