India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాజువాకలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో రోలుగుంట ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచర్ పీవీఎం.నాగజ్యోతి 3 బంగారు పతకాలు సాధించారు. పవర్ లిఫ్టింగ్లోని మూడు విభాగాలలో బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వేట్ పాల్గొని మూడింటిలోనూ బంగారు పతకాలు సాధించారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు.
ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న ఆమె గతంలో అంతర్జాతీయ, జాతీయ మెడల్స్ సాధించారు.
సముద్రంలో చేపల వేటపై నిషేధం గడువు ముగుస్తున్న నేపాథ్యంలో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి వేటకు మత్స్యకారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తూర్పు తీరంలో విశాఖ చేపల రేవు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ 700 మరపడవలు, మరో వెయ్యి వరకు ఇంజిన్ పడవలు ఉన్నాయి. మత్స్య పరిశ్రమపై ప్రత్యక్షంగా 15,000 మంది పరోక్షంగా 10వేల మంది ఆధారపడి ఉన్నారు. వేట ప్రారంభించే ముందు ఈనెల 11న గంగాదేవి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్లో ఇగ్వానాలు సందర్శకులను అలరిస్తున్నాయి. పెద్దబల్లి జాతికి చెందిన ఇగ్వానాలు వయసు పెరిగే కొద్దీ వాటి రంగులు మారిపోతుంటాయి. పిల్లలగా ఉన్నప్పుడు కొంతవరకు ఆకుపచ్చని రంగులో కనిపిస్తాయి. పెరిగేకొద్ది బూడిద రంగులోకి మారుతాయి. అవి వివిధ రకాల పండ్లతో పాటు మెత్తని మట్టి తింటాయి. ప్రస్తుతం జూలో పిల్లలతో పాటు పెద్దవి 50 వరకు ఉన్నాయి.
గన్నవరం మండలం కేసరపల్లి IT పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ట్రాఫిక్పై ఆంక్షలు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి మీదుగా విశాఖ చేరుకుంటాయి.
పాడేరులో ఆదివారం నుంచి జరుగుతున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరలో ఐఏఎస్ అధికారులు సందడి చేస్తున్నారు. ఉదయం జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత భక్తులతో కలిసి స్వయంగా ఘటాలను ఊరేగింపుగా శతకం పట్టుకు తరలించారు. ఆదివారం రాత్రి జాయింట్ కలెక్టర్ భావన వశిస్ట్, ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తదితరులు జాతరలో సందడి చేశారు. జాతరలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జెయింట్ వీల్, ట్రైన్ ఎక్కి సందడి చేశారు.
విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవి శంకర్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో సంబంధిత రౌడీ షీటర్లకు పోలీస్ అధికారులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హద్దు మీరితే పీడీ యాక్ట్ అమలు చేయాల్సి వస్తుందని అన్నారు.
విశాఖ రుషికొండ బీచ్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావటంతో బీచ్లో సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకుల రద్దీ పెరగటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. RK బీచ్, భీమిలి బీచ్లలో కూడా ఇదే పరిస్థితి. వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో పిల్లలతో బీచ్లకు పోటెత్తారు.
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్ రేపు విడుదలకానుంది. అభిమానుల కోసం విశాఖ జిల్లాలోని పలు థియేటర్లలో రేపు 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. విశాఖలో శరత్, శ్రీ కన్య, మెలోడీలో స్క్రీనింగ్ ఉండగా.. గాజువాకలో లక్ష్మీ కాంత్, శ్రీ కన్యా స్క్రీన్-2 థియేటర్లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు.SHARE IT
రేపు అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి అన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.
➩ విశాఖలో 20,570 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా.. NDA కూటమి-13,583(66.03%), YCP-5,399(26.25%), INDIA కూటమి-837(4.07%) మంది ఓటేశారు
➩ అనకాల్లిలో మొత్తం 19,125 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA కూటమి-12,042(62.96%), YCP-5,777(30.20%), INDIA కూటమి-818(4.27%) మంది ఓటేశారు
➩ అరకులో 21,432 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA కూటమి-9,312(43.44%), YCP-5,535(25.83%), INDIA కూటమి-4,113(19.19%) మంది ఓటేశారు
Sorry, no posts matched your criteria.