India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తగరపువలసలోని ఓ స్వీట్షాప్లో మహిళ మృతిచెందింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్లో పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఒంట్లో బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్కి వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. భీమిలి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మధురవాడ లో ఇంటర్ విద్యార్థి మేడపై నుంచి దూకి మృతి చెందిన ఘటనపై పోలీస్, ఇంటర్ విద్యాశాఖ అధికారులు నివేదిక అందించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒత్తిడి వల్ల చనిపోయాడా, ఇతర కారణాలు వల్ల చనిపోయామా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/08)కు ఏలూరు రైల్వే స్టేషన్లో అదనపు హాల్ట్ మరో ఆరు నెలలు కొనసాగుతుందని వాల్తేరు డివిజన్ డిసిఎం సందీప్ గురువారం తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్లో ఒక నిమిషం పాటు రైలు ఆగనున్నట్లు తెలిపారు. ఈ హాల్ట్ ఇరువైపులా ఉంటుందన్నారు. ప్రయాణికుల విషయాన్ని గమనించాలన్నారు.
ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు.
విశాఖలో బుధవారం అర్ధరాత్రి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా రాష్ట్రం రాయపూర్కి చెందిన చంద్రవంశీ (17) బోరవాణి పాలెంలోని నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. అర్ధరాత్రి కాలేజీ 5వ అంతస్థు నుంచి దూకి చంద్రవంశీ మృతి చెందాడు. మృతదేహాన్ని KGHకి తరలించారు. పీఎంపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. CITU నాయకులు గురువారం ఉదయం ఘటనా స్థలిని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గాజువాక షీలా నగర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. మృతుడు తుంగ్లాం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్గా గుర్తించారు. స్కూటీపై వెళ్తున్న ప్రవీణ్ రోడ్డుపై విగత జీవిగా పడిఉన్నాడు. ఘటనా స్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందా.. ఏదైనా వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం కమిటీ ప్రకటన జారీ చేసింది. వైసీపీ హయాంలో కన్నబాబు మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా కూడా కొనసాగారు. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కన్నబాబు నియామకం చేపట్టారు.
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి కుంభమేళాకు ప్రత్యేక బస్సు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 16న ద్వారకా బస్సు స్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడుపబడునన్నారు. టికెట్ ధర రూ.8 వేలు. టికెట్స్ కావలసినవారు ఆన్లైన్ ద్వారా గాని, సమీప బస్ స్టేషన్లోగాని పొందవచ్చన్నారు.
విశాఖ జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా బాణాల శ్రీనివాసును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గడిచిన ఎన్నికల్లో బాణాల శ్రీనివాసరావు వైసీపీకి కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన జీవీఎంసీ 44వ వార్డు కార్పొరేటర్గా ఉన్నారు. జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్గా పనిచేస్తున్నారు.
హిట్ & రన్ నష్ట పరిహార కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో రవాణా శాఖ, పోలీస్ అధికారులతో బుధవారం సమావేశం అయ్యారు. హిట్ అండ్ రన్ కేసుల విషయంలో సత్వరమే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్కు పంపాలని ఆదేశించారు. నష్టపరిహారం క్లెయిమ్ దరఖాస్తులలో లోపలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.