India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల దృష్ట్యా భవానీపట్నం- విశాఖపట్నం ప్రత్యేక రైలు గమ్యాన్ని రాయగడ స్టేషన్ వరకు పరిమితం చేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే సీనియర్ డీసీఎం, సందీప్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెం.08503/04, భవానీపట్నం-విశాఖపట్నం- భవానీపట్నం పాసెంజర్ 3.01.2025 నుండి 9.01.2025 వరకు రాయగడ-విశాఖపట్నం స్టేషన్ ల మధ్య రాకపోకలు సాగిస్తుందని తెలియజేసారు.
విశాఖ: 22ఏ నిషేధిత జాబితా భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విశాఖలో అన్నారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత 22ఏ నుండి భూముల తొలగింపుపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మార్కెట్ రేట్ ఎక్కువగా ఉన్నచోట మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతామని, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లకు ఛార్జీలు తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ భూ కబ్జాలపై విచారణ చేస్తున్నామన్నారు.
విశాఖ: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారంటూ షర్మిలను ఆమె Xద్వారా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలుగు కాంగ్రెస్ నేతలా షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు షర్మిల ఎవరి మీద పోరాటం చేస్తున్నారో అనే క్లారిటీ ఆమెకైనా ఉందా అని అన్నారు.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను ఆధారం చేసుకుని స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ అందించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 లో ఏ.యు మెరుగైన స్థానాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 35% విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఏయూ నిలచింది. ప్రపంచవ్యాప్తంగా 8536 విద్యాసంస్థలను పరిశీలించి వీటిలో టాప్ 35% ఎంపిక చేసింది. దీనికి సంబందించిన అధికారిక ఉత్తర్వులు రిజిస్ట్రార్ ధనుంజయరావుకు మంగళవారం అందాయి.
‘ఫేక్ వీడియో కాల్స్తో జాగ్రత్త’ అంటూ విశాఖ సిటీ పోలీసులు పోస్టర్ విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి మీ వీడియోలను రికార్డ్ చేస్తున్నారని, వాటిని అశ్లీలంగా ఎడిట్ చేసి డబ్బులు కావాలంటూ బెదిరింపులకు దిగుతారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచిత అకౌంట్స్ నుంచి వచ్చే రిక్వస్ట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 సంప్రదించాలన్నారు.
విశాఖలో మెట్రో ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే <<14776969>> కారిడార్ -1<<>>, <<14777184>>కారిడార్-2<<>>, <<14777236>>కారిడార్-3<<>> కింద రూట్మ్యాప్ రెడీ చేశారు. దీనిపై అసెంబ్లీలోనూ విశాఖ MLAలు తమ అభిప్రాయాలు తెలిపారు. మరికొన్ని ప్రాంతాలు కలపాలని సూచించారు. SMలోనూ మెట్రో రూట్లపై చర్చ నడుస్తోంది. మరి ఇంకా ఏయే ప్రాంతాలకు మెట్రో ఎటాచ్ అయితే మరింత ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
విశాఖ కలెక్టరేట్లో మంగళవారం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ సదస్సులు, 22 ఏ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై మంత్రి సమీక్షిస్తారు. ముందుగా ప్రజల నుంచి మంత్రి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు.
ఎలమంచిలి పట్టణ రామ్మూర్తి నగర్లో గల రిటైర్డ్ ఎక్సైజ్ ఉద్యోగి బీవీ రమణ ఇంటిలో దొంగలు పడి రూ.4 లక్షలు, 4 తులాల బంగారం దోచుకుపోయారు. ఇంటికి తాళాలు వేసి రమణ కుటుంబ సభ్యులు బళ్లారి వెళ్లారు. సోమవారం పనిమనిషి వచ్చి చూడగా తాళం తీసి ఉంది. రమణ ఇంటికి వెళ్లమనడంతో బంధువులు వెళ్లి పరిశీలించగా నగదు, బంగారం పోయినట్లు గుర్తించారు. ఈ మేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ నగర్లో బాల శేఖర్ (19) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ మొబైల్ షాప్లో పనిచేస్తున్న బాల శేఖర్ ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో ప్రేమలేఖ లభ్యమయింది. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్లో సోమవారం 117 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. ప్రజలు నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడాలని ఆదేశించారు.పిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా సమస్య పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.