India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్లూరి ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మోదకొండమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శతకం పట్టు వద్దకు ఘటాలను ఊరేగింపుగా తరలించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మాజీ సీఎం జగన్ శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్ అన్నారు. శనివారం అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల కాలంలో అరాచకాలు విధ్వంసాలు కక్ష సాధింపులకు తెగపడి ఆస్తులు నష్ట పరిచారని విమర్శించారు. జగన్ ఒక్కరోజులోనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మాట్లాడడం సరికాదన్నారు.
ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ పాడేరులో జరగనున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈమేరకు 800 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు జరగకుండా నివారించడానికి పది క్రైమ్ పార్టీలను ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో చెకింగ్ సిబ్బందికి డీఆర్ఎం సౌరం ప్రసాద్ బాడీ వోర్న్ కెమెరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారదర్శకత, జవాబుదారీతనం భద్రతను పెంచడానికి ఈ కెమెరాలు దోహద పడతాయన్నారు. రైళ్లలోను, రైల్వే స్టేషన్లలోనూ తనిఖీ ప్రక్రియను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.
విశాఖలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కాన్వెంట్ జంక్షన్ సమీపంలోని ఓ డ్రైన్లో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్థానికులకు సహాయంతో గెడ్డలో పడిపోయిన వ్యక్తిని పోలీసులు బయటకు తీశారు. మృతుడు 45 వయస్సు పోలీసులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. పత్రికా రంగంలో కొత్త ఒరవడలు సృష్టించిన ఈనాడు దినపత్రిక విశాఖ నుంచే ఆయన ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ పత్రిక అపూర్వ ప్రజాధరణ పొందింది. అదేవిధంగా నగరంలో డాల్ఫిన్ హోటల్ను ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నగరంలో ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ ఆ డాల్ఫిన్ హోటల్కు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.
విశాఖ ఆర్.కె బీచ్లో గుర్తు తెలియని ఓ యువకుడి మృతదేహం కొట్టుకువచ్చింది. నలుపురంగు టీషర్ట్ వేసుకొని.. చేతిపై జైశ్రీరాం అని పచ్చబొట్టు ఉందని మహారాణిపేట ఎస్.ఐ లక్ష్మీ తెలిపారు. ముఖంపై గాయాలను గుర్తించామని వెల్లడించారు. మృతుని వివరాలు తెలిసినవారు మహారాణిపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. 94407 96010, 83310 41628 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాలోని అరకు, పాడేరు మినహా మిగిలిన చోట్ల కూటమి విజయం సాధించింది. TDP నుంచి గంటా, అయ్యన్న, బండారు వంటి మాజీ మంత్రులు ఉన్నారు. మహిళా కోటాలో అనిత ఉండగా.. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన పల్లాతోపాటు ఎక్కసార్లు గెలిచిన వెలగపూడి, గణబాబు కూడా TDP అభ్యర్థులే. జనసేనలో మాజీ మంత్రి కొణతాలతో పాటు పంచకర్ల, మొదటిసారి గెలిచిన సుందరపు, వంశీ ఉన్నారు. బీజేపీ తరఫున విష్ణుకుమార్కు ఇది రెండో విజయం.
రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 52 ఆన్లైన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. పరీక్షకు 10,805 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ ఆచార్య టీవీ కృష్ణ తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.