Visakhapatnam

News December 16, 2024

కైలాసగిరిలో స్కై సైక్లింగ్ జిప్‌లైనర్

image

ఏపీలో పర్యటక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిలో స్కై సైక్లింగ్ జిప్‌లైనర్ ఇటీవల ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రూ.300గా టిక్కెట్ ధరను నిర్ణయించారు. జల విన్యాసాలపై అసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్‌లో మళ్లీ స్కూబా డైవింగ్ అందుబాటులోకి వచ్చింది. ఆకాశంలో విహరించేందుకు పారా గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు.

News December 16, 2024

విశాఖ: 170 మంది హెల్త్ అసిస్టెంట్లు తొలగింపు

image

ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న 170 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను తొలగించారు. ఎంతోకాలంగా సేవలందిస్తూ వచ్చిన తమను ఈ విధంగా తొలగించి రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. నియామక ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగానే కోర్టు తమను తొలగించిందని వారు పేర్కొన్నారు.

News December 16, 2024

చీడికాడలో యువకుడి ఆత్మహత్య

image

చీడికాడకు చెందిన వేచలపు మణికంఠ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ చెప్పారు. మణికంఠ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని ఎవరో అవమానించడంతో ఈనెల 11న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

News December 15, 2024

మంగమారిపేట: తీరానికి కొట్టుకు వస్తున్న తాబేళ్ల కళేబరాలు

image

భీమిలి పరిధిలో మంగమారిపేట తీరానికి గత మూడు రోజులుగా తాబేళ్ల కళేబరాలు  కొట్టుకొస్తున్నాయి. శనివారం రాత్రి 10 తాబేళ్ల మృత కళేబరాలు కొట్టుకురాగా, 11వ తేదీన నాలుగు, 12న రెండు కొట్టుకువచ్చాయి. అవి గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు వస్తున్న సమయంలో శ్వాస అందక ఎక్కువ శాతం మృతి చెందుతున్నాయని జువాలజీ నిపుణులు తెలిపారు.

News December 15, 2024

పెందుర్తి: తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై జనసేన నేత స్పందన

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చేశాడా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ శనివారం ‘X’ ద్వారా స్పందించారు. మీ పోలీసులు చేసిన తప్పును సమర్థించ వద్దని బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. తొక్కిసలాటలో రేవతి చనిపోతే మీ పోలీసులు అల్లు అర్జున్‌పై పెట్టిన సెక్షన్లు ఏమిటని సీఎంను ప్రశ్నించారు.

News December 15, 2024

జగన్‌ను విమర్శించే నైతిక హక్కు అవంతికి లేదు: కృష్ణ

image

మాజీ సీఎం జగన్‌ను విమర్శించే నైతిక హక్కు అవంతి శ్రీనివాస్‌కు లేదని వైసీపీ రాష్ట్ర నాయకుడు ఆల్ఫా కృష్ణ అన్నారు. శనివారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం అవంతి శ్రీనివాసరావు ఇప్పటికే నాలుగు పార్టీలు మార్చారన్నారు. జగన్ తాడేపల్లిలో కూర్చుని ఆదేశాలు ఇస్తే పాటించాలా అని అవంతి అనడం సమంజసం కాదని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News December 14, 2024

భీమిలి: అల్లు అర్జున్ నివాసంలో కలిసిన గురు శిష్యులు

image

అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భీమిలి ఎమ్మెల్యే గంటా, మాజీ ఎమ్మెల్యే అవంతి కలిశారు. గురు శిష్యులుగా ముద్ర వేసుకున్న వారు చిరు నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్నారు. ఇరువురి కలయికపై భీమిలిలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి రాజీనామా చేసిన అవంతి తిరిగి టీడీపీలో చేరతారని చర్చ నడుస్తోంది.

News December 14, 2024

విశాఖ: 18 ఏళ్లు నిండని బాలుడిపై 11 కేసులు

image

విశాఖలోని కంచరపాలెంకు చెందిన బాల నేరస్థుడిని శుక్రవారం 3వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్లు కూడా నిండని బాలుడిపై 11 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నేరస్థుడిపై చోరీ కేసులు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో నిందితుడిని మద్దిలపాలెంలో అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.

News December 13, 2024

పెందుర్తి: మెగా, అల్లు ఫ్యామిలీలు ఒక్కటే: బొలిశెట్టి

image

అల్లు అర్జున్‌ అరెస్ట్ వ్యవహారంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ‘X’ ద్వారా స్పందించారు. ‘హైకోర్టు తీర్పు రాకముందే అల్లు అర్జున్‌ను జైలుకు తరలించాలన్నది పోలీసుల అత్యుత్సాహంగా కనిపిస్తోంది. సంధ్య థియేటర్‌కు హీరో వస్తున్న విషయం మీడియాలో 2రోజుల ముందే వచ్చింది. CP తెలియదనడం హాస్యాస్పదం. మెగా, అల్లు ఫ్యామిలీలు రెండు కాదు ఒక్కటే.. ఈ తప్పుడు కేసు వల్ల అనేక నోర్లు మూతపడతాయి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. 

News December 13, 2024

విశాఖ: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహార కేసులు వంటివి రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చనన్నారు.