Visakhapatnam

News December 13, 2024

విశాఖ: ‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి’

image

విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వచ్చినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. గురువారం దీనిపై విశాఖ ఎంపీ శ్రీభరత్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రూ.14,309 కోట్ల ప్రతిపాదనలతో సమగ్ర మొబిలిటీ ప్లాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్లాన్ సరిగా లేకపోవడంతో మళ్లీ పంపించాలని కోరామన్నారు.

News December 13, 2024

విశాఖలో యువకుడి మృతిపై స్పందించిన మంత్రి లోకేశ్

image

విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) లోన్‌యాప్ వేధింపులకు బలి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్‌ల కాన్ఫిరెన్స్‌లో మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. యువకుడి ఫొటోతో పాటు అతని భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపి ఆత్మహత్యకు కారణమయ్యారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరగా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించారు. దీనిపై చిట్టా బయటకు తీస్తామని విజిలెన్స్ డీజీ తెలిపారు.

News December 13, 2024

విశాఖ: మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు అరెస్ట్

image

మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రెండో పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. పెందుర్తికి చెందిన జయ గంగాధర కృష్ణ, కే రత్నం, కప్పరాడకు చెందిన శ్యామ్ సుందరరావు యువతలు ఫోటోలను దీపక్‌కు అందజేసేవారు. దీపక్ ఫోటోలను వెబ్ సైట్‌లో పెట్టి ఆ యువతులతో వ్యభిచారం చేయించేవాడు. ఇటీవల దీపక్‌ను అరెస్ట్ చేయగా అతనిచ్చిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తిరుమలరావు తెలిపారు.

News December 13, 2024

విశాఖ: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడు

image

విశాఖలోని చిన్న వాల్తేరుకు చెందిన ఓ బాలికపై యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదయింది. పి.ధణేశ్ గత కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన బాలికను వేధిస్తూ వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు CI రమణయ్య తెలిపారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 13, 2024

పాడేరు: నేటి నుంచి రెవన్యూ సదస్సులు

image

ఈనెల 13వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గురువారం తెలిపారు. జిల్లాలోని 22మండలాల్లో 2,969 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. గ్రామ సభలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. భూ, ఇతర రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కార చర్యలు చేపడతామన్నారు.

News December 12, 2024

విశాఖ: జగ్దల్ పూర్- కిరండూల్ రైల్వే లైన్ తనిఖీ

image

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో జగ్దల్ పూర్-కిరండూల్ రైల్వే లైన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్ గురువారం తనిఖీ చేశారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ట్రాక్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాల్తేరు రైల్వే డిఆర్ఎం మనోజ్ కుమార్ సాహు పాల్గొన్నారు.

News December 12, 2024

నా రాజీనామాకు కారణం ఇదే: అవంతి

image

వైసీపీకి తాను రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించనని.. తనని కౌంటర్ చేస్తే తిరిగి కౌంటర్ ఇస్తానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ‘ఏ రాజకీయా పార్టీ అయినా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అలా జరగకపోవడంతోనే ఓడిపోయాం. ఫలితాల తర్వాత కూడా వైసీపీలో తీరు మారలేదు. అందుకే రాజీనామా చేస్తున్నా. ప్రస్తుతం కూటమి పాలన బాగుంది’ అని అవంతి చెప్పారు.

News December 12, 2024

YCPకి గుడ్ బై చెప్పిన అవంతి శ్రీనివాస్ పయనం ఎటు.!

image

అవంతి శ్రీనివాస్ YCPకి గుడ్ బై చెప్పారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలిసారి MLAగా గెలిచారు. PRP కాంగ్రెస్‌లో విలీనం కావడంతో TDPలో చేరారు. 2014లో MP గెలిచి 19 ఎన్నికల ముందు వైసీపీలో చేరిపోయారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా సేవలందించారు. 2024లో ఓటమితో వైసీపీకి దూరంగా ఉన్న ఆయన తాజాగా రాజీనామా చేశారు. దీంతో ఆయన పయనం ఎటు అనేది చూడాల్సి ఉంది.

News December 12, 2024

వైభవంగా సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవం

image

ఏకాదశి పురస్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవాన్ని బుధవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజు స్వామిని అలంకరించి వాహనంలో అధిష్టింప చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు.

News December 12, 2024

ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు డిన్నర్

image

రెండో విడ‌త జిల్లా కలెక్టర్ల కాన్ఫ‌రెన్స్‌లో భాగంగా బుధవారం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స‌మావేశమాయ్యారు. కలెక్టర్ల సదస్సు అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్, ఎస్‌పీలు, ఇతర అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు డిన్నర్ చేశారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత ఉన్నారు.