Visakhapatnam

News June 7, 2024

ఆ ఫైల్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి: జనసేన

image

ఉత్తరాంధ్రాలో వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల అసైన్డ్ భూములు జీవో 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్‌లపై నిఘా పెట్టాలని, సంబంధిత ఫైళ్లు మాయం కాకుండా విశాఖ, విజయనగరం జిల్లాల కలక్టరేట్ల నుంచి అసైన్డ్ ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

News June 7, 2024

AU: జూలై 31 నుంచి బీఈడీ నాలుగో సెమిస్టర్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలను జూలై 31 నుంచి ఆగస్టు 3వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టార్ (పరీక్షలు) జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 31న కాంటెంపరరీ ఇండియన్ ఎడ్యుకేషన్, ఒకటో తేదీన జెండర్ స్కూల్ అండ్ సొసైటీ, 2వ తేదీన ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి.

News June 7, 2024

AU: జూలై 9 నుంచి బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను జూలై 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టర్ (ఎగ్జామినేషన్స్) జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి5 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. తేదీల వారీగా పరీక్షలు వివరాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్షలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

News June 7, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై దృష్టి: పల్లా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ ప్రతినిధులు గురువారం గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును సత్కరించి అభినందించారు. స్టీల్ ప్లాంట్ సమస్యలను ఈ సందర్భంగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్లాంట్ పరిరక్షణపై దృష్టి పెడతానన్నారు. ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ యూనియన్ నాయకులు ఆదినారాయణ పాల్గొన్నారు.

News June 7, 2024

విశాఖ: రేపు ఎడ్ సెట్ ప్రవేశపరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

image

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్ సెట్ కన్వీనర్ టీవీ కృష్ణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. నిర్దిష్ట సమయానికి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

News June 7, 2024

విశాఖ పోర్టుకు 18వ స్థానం

image

ప్రపంచ బ్యాంకు రూపొందించిన కంటైనర్ పోర్టు పనితీరు ఇండెక్స్‌లో విశాఖ పోర్టు 18వ స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించింది. విశాఖ కంటైనర్ టెర్మినల్ ఈ నూతన మైలురాయిని చేరుకోవడంలో ప్రతిభ కనబరిచింది. ఈ ఘనతను రైల్వే, కస్టమ్స్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం అభినందించాయి. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాయి.

News June 7, 2024

విశాఖ: వందే భారత్ రైళ్లకు మంచి స్పందన

image

విశాఖ నుంచి నడుస్తున్న మూడు వందే భారత్ రైళ్లకు మంచి స్పందన లభిస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ, విశాఖ-భువనేశ్వర్-విశాఖ మధ్య మొత్తం మూడు వందే భారత్ రైళ్లు ప్రతిరోజు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తయారైన ఈ రైళ్లలో మధ్యతరగతి ప్రయాణికులు సైతం ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 7, 2024

విశాఖ మేయర్ పీఠంపై కూటమి గురి..?

image

విశాఖ నగరం మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. GVMCలో 98 స్థానాలకు ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో TDPకి 29, జనసేనకి 3, BJP, CPM, CPIలకు ఒక్కొక్కరు, 5 స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు. మిగతా 57 మంది YCP కార్పొరేటర్లు. YCPలో అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటే మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవచ్చని చర్చ జరుగుతోంది.

News June 7, 2024

విశాఖ: మత్తు పదార్థాలతో ఇద్దరు అరెస్ట్

image

ఎండీఎంఏ(మిథైలెన్డియోక్సి మెథాంపేటమిన్) డ్రగ్‌ను కలిగి ఉన్న ఇద్దరు యువకులను మహారాణిపేట పోలీసులు, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 3.316 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. టర్నల్ చౌల్ట్రీ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎం.సాయిరాం, టీ.సంగ్రామ్ సాగులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా డ్రగ్స్ లభించాయి.

News June 7, 2024

విశాఖ: మిగులు సీట్లు భర్తీకి నోటిఫికేషన్

image

విశాఖపట్నం జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగుల సీట్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. 6,7,8,9 తరగతులలో మిగిలిన సీట్లు కొరకు ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. సీట్లు వివరాలు, పరీక్ష విధివిధానాలు సంస్థ వెబ్సైట్లో సరిచూసుకోవాలన్నారు.