India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ తీరంలో నిర్వహించిన వెల్ డెక్ రికవరీ ట్రయల్స్ విజయవంతమైనట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. నావికాదళం సహకారంతో ఈనెల 6వ తేదీన గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ మాడ్యూల్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడ విధులు ముగించుకుని క్రూ మాడ్యూల్లోనే భూమిపైకి తిరిగి వస్తారు. వీటిని సముద్రంలోకి పడేటట్లు చేస్తారు. అక్కడనుంచి వ్యోమగాములు సురక్షితంగా వస్తారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో రెండవ విడత నృసింహ దీక్షలు 12వ తేదీన ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి దీక్షలు తీసుకుంటున్న భక్తులకు ఆలయ వైదికలు మాలాధారణ చేయనున్నట్లు తెలిపారు. దీక్షలు స్వీకరించే భక్తులకు తులసిమాలలు, స్వామివారి ప్రతిమలను ఉచితంగా అందజేస్తామన్నారు. 32 రోజుల తర్వాత వచ్చే నెల 12న మాల విసర్జన జరుగుతుందన్నారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డిసిఎం కె సందీప్ పేర్కొన్నారు. త్రివేండ్రం నార్త్-షాలిమార్ కొచ్చువేలి స్పెషల్ ట్రైన్ వచ్చే నెల 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే తిరునల్వేలి-షాలిమార్-తిరునల్వేలి ప్రత్యేక రైలు, పొదనూర్-బరౌని పొదనూర్ స్పెషల్ ట్రైన్, తాంబరం-సంత్రగచ్చి-తాంబరం స్పెషల్ పొడిగించామన్నారు.
మాకవరపాలెం మండలం కోడూరులో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వేగి పైడమ్మ ఇంటి వద్ద రోజూ స్థానికులు కూర్చుని మాట్లాడుకుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఈ గోడవద్ద మాట్లాడుకుంటున్న కోయిలాడ కాంతం(73), వేడి భీముడు(70) లపై గోడ కూలిపోయింది. దీంతో కాంతం అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ భీముడును 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖ హనిట్రాప్ కేసులో బాధితుడి తల్లి మంగళవారం విశాఖలో ప్రెస్మీట్ పెట్టింది. తమ బిజినెస్ ప్రోమోట్ చేస్తానని జాయ్ జమియా తన కుమారిడితో పరిచయం పెంచుకుందని తెలిపింది. అమెరికా నుంచి అతనిని వైజాగ్కి రప్పించిన ఆమె.. జ్యూస్లో మత్తు మందు కలిపి పెట్టిన ఇబ్బందులను వాయిస్ మెసేజ్ ద్వారా తమకు తెలియజేశాడని పేర్కొంది. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని కేసును లోతుగా విచారించాలని పోలీసులను కోరింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లోనూ ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహార కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చునన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖలోని స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. <<14841020>>మహిళపై అసభ్యంగా <<>>ప్రవర్తించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
వీఎంఆర్డీఏ పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసింది.➤ రూ.200 కోట్లతో సముద్రతీరం కోతకు గురి కాకుండా చర్యలు ➤ ఋషికొండ, గంభీరం వద్ద వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ➤ రుషికొండ వద్ద హ్యాబిటేట్ సెంటర్ ఏర్పాటు ➤ మధురవాడలో ఒలింపిక్ స్టాండర్డ్స్ అనుగుణంగా రూ.3 కోట్లతో క్రీడా మైదానం ఏర్పాటు ➤ రూ.9 కోట్లతో 15 ప్రాంతాల్లో రహదారుల ➤ అనకాపల్లి వద్ద హెల్త్ సిటీ పనులకు ఆమోదం
హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. చెక్బౌన్స్ కేసులో విశాఖ కోర్టులో ఉన్న కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనిత, ఫిర్యాదుదారుడు కోర్టుకు హాజరై రాజీ కుదుర్చుకున్నామని చెప్పడంతో కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70లక్షలు అప్పుతీసుకున్న ఆమె 2018లో చెక్కు ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణము కొనసాగించి బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరుకొనే అవకాశముందని వెల్లడించారు. రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వారు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.