India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసకాండతో ఓట్ల లెక్కింపు నిర్వహణపై విశాఖ నగర పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీపీ రవిశంకర్ అయ్యర్ ప్రత్యేక వ్యూహంతో నగరమంతటా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందు తర్వాత నగరంలో ప్రశాంత వాతావరణ నెలకొనడంలో పోలీసులు కీలకపాత్ర పోషించారు.
అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సీఎం రమేశ్ జిల్లా కలెక్టర్ రవి సుభాష్ నుంచి మంగళవారం రాత్రి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు.
విశాఖ ఎంపీగా ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిన శ్రీభరత్ను చంద్రబాబుతో పాటు బాలకృష్ణ అభినందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీభరత్ సతీమణితో చంద్రబాబును, బాలకృష్ణుడు మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యధిక మెజార్టీ సాధించిన శ్రీభరత్కు చంద్రబాబు, బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
విశాఖ సీతకొండ దగ్గర YSR వ్యూ పాయింట్ పేరును అబ్దుల్ కలాం వ్యూ పాయింట్గా గుర్తు తెలియని వ్యక్తులు మార్చారు. జీ-20 సమయంలో విశాఖ నగరాన్ని సుందరీకరించి సీతకొండ దగ్గర వ్యూ పాయింట్ను వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా నామకరణ చేసి ఇక్కడ నేమ్ బోర్డు సైతం పెట్టారు. తాజాగా వైఎస్సార్ అక్షరాలపై అబ్దుల్ కలాం స్టిక్కర్ను గుర్తుతెలియని వ్యక్తులు అతికించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. భీమిలిలో గెలిచిన గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమలో పీవీజీఆర్ నాయుడు (గణబాబు) విజయం సాధించారు.
అనకాపల్లి ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ 2,96,530 పైచిలుకు మెజార్టీలో ఉన్నారు. సీఎం రమేశ్కు 7,62,069 ఓట్లు పోలవ్వగా.. తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుకి 4,65,539 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్తి వేగి వెంకటేశ్కు 25,651 ఓట్లు పోలవ్వగా.. నోటాకు 26,235 మంది ఓటేశారు.
విశాఖ ఎంపీగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీభరత్కి 9,07,467 ఓట్లు పోలవ్వగా.. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి 4,03,220 ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి పి.సత్యారెడ్డి 30,267 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
విశాఖ ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. భరత్కి 9,07,467 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కేవలం 4,03,220 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీగా నిలవనుంది. కూటమి అభ్యర్థిగా నిలిచిన శ్రీభరత్కు భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు.
విశాఖ పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థుల కంటే నోటాకు అధికంగా ఓట్లు లభించడం విశేషం. విశాఖపట్నంలో 33 మంది పోటీ చేయగా కేవలం ఐదుగురు మాత్రం 5 వేల కంటే అధికంగా ఓట్లు సాధించారు. నోటాకు 5171 ఓట్లు లభించాయి. మిగిలిన 28 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగా ఓట్లు పోలవరం గమనార్హం. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి పార్టీ, బీఎస్పీ అభ్యర్థులకు మాత్రమే 5000 కంటే అధికంగా ఓట్లు వచ్చాయి.
⁍ విశాఖ(E): వెలగపూడి(TDP), విశాఖ(W):గణబాబు(TDP)
⁍ విశాఖ(N): విష్ణుకుమార్(BJP), విశాఖ(S): వంశీకృష్ణ(JSP)
⁍ భీమిలి: గంటా(TDP), గాజువాక: పల్లా శ్రీను(TDP)
⁍ పెందుర్తి: పంచకర్ల(JSP),యలమంచిలి:సుందరపు(JSP)
⁍ చోడవరం:KSNS రాజు(TDP), అనకాపల్లి: కొణతాల(JSP)
⁍ మాడుగుల: బండారు(TDP),నర్సీపట్నం: అయ్యన్నపాత్రుడు(TDP)
⁍ పాయకరావుపేట: అనిత(TDP)
⁍ అరకు: మత్స్యలింగం(YCP)
⁍ పాడేరు: విశ్వేశ్వరరాజు(YCP)
Sorry, no posts matched your criteria.