Visakhapatnam

News December 7, 2024

విశాఖ: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రాం చాటింగ్

image

విశాఖ పీఎంపాలెంలో నిన్న ఒకరు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం పట్టణానికి చెందిన హేమంత్ రెడ్డికి 2017లో వివాహం జరిగింది. డెలీవరీ బాయ్‌గా పనిచేసే అతను భార్య(25)తో కలిసి పీఎంపాలెంలో ఉంటున్నారు. భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రాంలో ఒకరితో చాటింగ్ చేయడాన్ని భర్త గమనించి గొడవ పడ్డారు. ఈ విషయం అత్తమామలకు తెలిసి మందలించడంతో మనస్తాపానికి గురైంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.

News December 7, 2024

విశాఖ: అమ్మాయి కోసం గొడవ.. అరెస్ట్

image

విజయనగరానికి చెందిన సాయికుమార్ రెడ్డి(27) కంచరపాలెం యువతితో కలిసి పెదరుషికొండ వద్ద ఓ లాడ్జిలో 10రోజుల నుంచి ఉంటున్నారు. PMపాలేనికి చెందిన పి.వినయ్(23) ఆమెకు కాల్ చేయడంతో గురువారం బయటకు వెళ్లింది. తిరిగి మద్యం మత్తులో లాడ్జికి వచ్చిన యువతిని సాయి ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ఆమె వినయ్‌కు చెప్పడంతో అతను తన ఫ్రెండ్స్‌తో కలిసి సాయిని దారుణంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో వినయ్‌ను అరెస్ట్ చేశారు.

News December 7, 2024

నాలెడ్జ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం

image

సాంకేతికత అభివృద్ధికి దోహద పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్‌లో సీఎం పాల్గొన్నారు.1996లో ఐటీ గురించి మాట్లాడిన తను ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగంపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ముందుచూపు వల్లే ఆ రంగంలో మేటిగా నిలిచామన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకొకసారి డీప్ టెక్‌ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు.

News December 7, 2024

విశాఖ: డీప్ టెక్ సదస్సులో ఏడు ఒప్పందాలు

image

విశాఖ వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన డీప్ టెక్ స‌ద‌స్సులో GFST(గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్)కు వివిధ కంపెనీల మ‌ధ్య ఏడు ఒప్పందాలు జ‌రిగాయి. విద్య‌, వైద్య రంగాల్లో టెక్నాల‌జీ, అడ్వాన్స్‌డ్ స్ట‌డీస్, మహిళా సాధికార‌త త‌దిత‌ర అంశాల‌పై GFSTతో స‌మ‌గ్ర‌, జీఎస్‌ఆర్, ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్, జ‌ర్మ‌న్ వ‌ర్శిటీ ఒప్పందాలు చేసుకోగా, గేమ్ కంపెనీ రెండు ఎంవోయూలు చేసుకుంది.

News December 6, 2024

విశాఖ: డ్రగ్స్ కాదు.. డ్రై ఈస్ట్

image

ఈ ఏడాది మార్చిలో ఎన్నికల వేళ విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రగ్స్ వచ్చిందన్న వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సీబీఐ తాజాగా విచారణను ముగించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్‌ లేదని కేవలం డ్రై ఈస్ట్ ఉన్నట్లు కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో సీజ్ చేసిన షిప్‌ను విడుదల చేసినట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.

News December 6, 2024

విశాఖ: వేటలో మేమే మేటి.. మాకు లేరు ఎవ్వరూ సాటి!

image

ఆహార సంపాదనలో పెద్ద పులులు తమదైన శైలిలో వ్యవహరిస్తూ ఉంటాయి. వేటాడే సమయంలో అణకువను ప్రదర్శిస్తూ ఓపికతో వేచి చూసి ఒక్క ఉదుటున ఇతర జంతువులపై దాడి చేసి చంపి తింటాయి. ఈ క్రమంలో వాటి ఓపికకు, సహనానికి సలాం కొట్టాల్సిందే. విశాఖ జూ పార్కులో చెట్టుపై కట్టిన మాంసాన్ని ఒక్క ఉదుటున లాక్కుని తింటున్న టైగర్ విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

News December 6, 2024

విశాఖ: ‘ప్రజల ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది’

image

ప్రజల ఆరోగ్యం పైనే దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. డీప్ కాంక్లీవ్ పై విశాఖలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యమే ఐశ్వర్వమని, అందుకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ముందుకు వెళ్లేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు.

News December 6, 2024

విశాఖలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

image

 సీఎం చంద్రబాబు విశాఖ పర్యనటలో భాగంగా శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. మొదటి పార్టీ కార్యాలయంలో జరిగే అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కొంతసేపు పార్టీ నాయకులను, కార్యకర్తలతో భేటీ అవుతారు. 9:30 నిమిషాలకు నోవాటెల్‌లో “డీప్ టెక్నాలజీ సదస్సు- 2024″లో పాల్గొంటారు. సాయంత్రం వీఎంఆర్డీఏ అధికారులతో భేటీ అవుతారు. అనంతరం 06:45 ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని తిరిగి విజయవాడ వెళ్తారు. 

News December 6, 2024

విశాఖ: NAD కొత్త రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖ పరిధి NAD కొత్త రోడ్డులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ ఢీ కొట్టడంతో అడ్వకేట్ మృతి చెందారు. మృతుడు మర్రిపాలెం ఉడా కాలనీకి చెందిన పోతుల సూర్యనారాయణగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకి తరలించారు.

News December 6, 2024

విశాఖ: కామాంధునికి పాతికేళ్ల జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధునికి విశాఖపట్నం పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. తీర్పులో భాగంగా నిందితునికి 25 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.1,25,000 జరిమానా విధించింది. సబ్బవరం మండలానికి చెందిన ఓ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టగా శిక్ష విధించారు.