India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో సీఎంతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు భేటీ అయ్యారు. అనంతరం కాసేపు పలు విషయాలపై చర్చించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు గంటా వివరించారు.
విశాఖ జిల్లాలో ఈనెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సులపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలందరూ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో సదస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దీపం-2 పథకంపై అధికారులు మరింత ఫోకస్ పెట్టాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమావేశామయ్యారు. గ్యాస్ బుకింగ్, డెలివరీ ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. గ్యాస్ డెలివరీ సమయంలో, E-KYC సమయంలో ప్రజల నుంచి నగదు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. అలా చేస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు.
విశాఖలోని జాలరిపేట ప్రాంతంలో మానసిక స్థితి బాగోలేని 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. దీనిపై ఏసీపీ కాళిదాస్ మాట్లాడుతూ.. వైద్యుల నివేదిక వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పుష్ప-2 హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో విశాఖ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డులు సృష్టిస్తోన్న పుష్ప-2 బెనిఫిట్ షోలు వేసుకొనడానికి అనుమతిచ్చిన ప్రభుత్వాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన, చేస్తున్న కృషి.. తెలుగు సినిమా పరిశ్రమ ఆర్థికంగా తన స్థాయిని పెంచడానికి దోహదపడుతుంది. YCP ప్రభుత్వం ఉంటే నిర్మాతలతో పాటు రాష్ట్ర ఖజానాకు గండి పడేది’ అని ట్వీట్ చేశారు.
సింహాచలం పుణ్యక్షేత్రంపై ఆధ్యాత్మిక మ్యూజియం నిర్మించాలని సంకల్పించామని బ్రహ్మకుమారీస్ వికే రమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజియంను సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా దేవతల విగ్రహాలతో పాటు, సామాజిక, నైతిక విలువలు తెలియజేసే విధంగా నిర్మిస్తామని అన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, వ్యవసాయ శాఖ అధికారులతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, వినియోగదారుల వ్యవహారాలు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
విశాఖ సెంట్రల్ జైలు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జైలు సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన ఎస్.కిషోర్ కుమార్, అదనపు సూపరింటెండెంట్గా పనిచేసిన ఎం.వెంకటేశ్వర్లుపై జైలుశాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జైలు లోపలకు గంజాయి వెళ్లడం, రాత్రి వేళల్లో ఫోన్లలో మాట్లాడించడం, శిక్షపడ్డ ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడడం వంటి ఘటనల నేపథ్యంలో వీరిపై వేటు వేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు.
అక్కయ్యపాలెంలో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసాబేగంపై <<14787594>>పెట్రోల్ దాడి<<>> ఘటనలో సంగీత అనే మహిళపై కేసు నమోదైంది. గోపాలపట్నంకి చెందిన సంగీత, రహిమున్నీసాబేగంకి రూ.35 వేలు అప్పుగా ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో బుధవారం పెట్రోల్ తీసుకుని అంగన్వాడీ కేంద్రానికి వచ్చింది. ఇద్దరూ <<14788224>>ఆటోలో<<>> కూర్చొని మాట్లాడుతుండగా.. పెట్రోల్ పోసి అగ్గిపుల్లతో నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ను సీఎంవో తెలిపింది. ఈరోజు రాత్రి 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.
Sorry, no posts matched your criteria.