Visakhapatnam

News June 4, 2024

విశాఖలో 5లక్షల మెజారిటీ‌కి చేరువలో శ్రీభరత్

image

విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5 లక్షల భారీ మెజారిటీకి చేరువులో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 8,93,613 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 3,97,555 ఓట్లు సాధించారు. దీనితో ప్రస్తుతం భరత్ మెజారిటీ 4,96,058కి చేరింది. మరి కొద్దిసేపట్లో ఐదు లక్షల మెజారిటీని శ్రీభరత్ చేరుకోనున్నారు.

News June 4, 2024

మొదట రౌండ్ నుంచి వెనుకంజలో గుడివాడ

image

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి వైసీపీ నుంచి మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్‌పై 94,058 ఓట్ల భారీ మెజారిటీని సాధించారు. 22 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి పల్లా శ్రీనివాసరావు తన ఆధిక్యతను కొనసాగించారు. చివరి రెండు రౌండ్లు ముగిసే సమయానికి పల్లా శ్రీనివాస్‌కు 1,55,587 ఓట్లు లభించాయి.

News June 4, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

ఈనెల 6 తేదీన పలాస-విశాఖపట్నం మధ్య నడిచే పాసింజర్ రైలు, విశాఖ- పలాస మధ్య నడిచే పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం- గుణుపూర్ మధ్య నడిచే పాసింజర్ రైలు, గుణుపూర్-విశాఖకు నడిచే పాసింజర్ రైలు రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.

News June 4, 2024

ఐదేళ్ళ నిరీక్షణ ఫలించింది: గంటా

image

కూటమి సునామీలో వైసిపి కొట్టుకుపోయిందని భీమిలి కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎంవీపీ కాలనీలోని గంటా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో 151 సీట్లతో అధికారం పొందిన వైసీపీ 2024లో తక్కువ స్థానాలకు పరిమితం అయిందన్నారు. కూటమి అభ్యర్థులపై ప్రజల విశ్వాసం ఉంచారని అన్నారు.

News June 4, 2024

మరపురాని గెలుపును సొంతం చేసుకోనున్న శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.శ్రీ భరత్ మరపురాని గెలుపును సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో శ్రీభరత్‌కు 8,20,427 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కేవలం 3,65,190 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో శ్రీభరత్ మెజారిటీ 4,55,231కి చేరింది. విశాఖ వేదికగా ఒక చారిత్రాత్మక విజయాన్ని శ్రీభరత్ సొంతం చేసుకోనున్నారు.

News June 4, 2024

విశాఖ: వంశీకృష్ణకు గుర్తింపు పత్రం 

image

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విజయాన్ని అధికారంగా ప్రకటించిన అధికారులు గుర్తింపు పత్రం అందజేశారు. గుర్తింపు పత్రం అందజేశారు. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఎన్నికల పరిశీలకులు అమిత్ శర్మ, ఆర్వో సీతారామ మూర్తి లాంఛనంగా అందజేశారు.

News June 4, 2024

నాలుగు లక్షలు దాటిన శ్రీభరత్ మెజార్టీ

image

విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ 4 లక్షల మెజారిటీ దాటింది. ఇప్పటివరకు భరత్‌కు 7,28,914 ఓట్లు లభించాయి. బొత్స ఝాన్సీకి 3,23,932 ఓట్లు లభించాయి. దీంతో శ్రీభరత్ 4,04,982 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరొక పది ఓట్లు కలిస్తే భరత్ నాలుగు లక్షల మార్కును చేరుకుంటారు. విశాఖ లోక్‌సభ స్థానంలో సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నారు.

News June 4, 2024

చారిత్రక విజయం దిశగా శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చారిత్రక విజయాన్ని అందుకునే దిశగా టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ కదులుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో శ్రీభరత్ 6,76,463 ఓట్లు సాధించారు. దీంతో ఆయన ఆధిక్యత 3,74,090 ఓట్లకు చేరింది. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికీ కేవలం 3,02,373 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 23 వేల ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

వీ.వీ లక్ష్మీనారాయణ కంటే ఇండిపెండెంట్‌ ముందంజ

image

విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లలో ఇప్పటికే 19 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు 44,975 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు 57,392 ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి వి.శిరీష, 4వ స్థానంలో జేడీ లక్ష్మీనారాయణ, ఐదో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామారావు ఉన్నారు.

News June 4, 2024

మూడు లక్షలు దాటిన శ్రీభరత్ ఆధిక్యత

image

విశాఖపట్నం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీ భరత్ భారీ ఆధిక్యతతో దూసుకు వెళుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు 5,60,792 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన బొత్స ఝాన్సీలక్ష్మికి 2,54,739 ఓట్లు లభించాయి. దీనితో శ్రీభరత్ 3,60,53 ఓట్ల భారీ మెజారిటీతో ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్యా రెడ్డికి 18956 ఓట్లు లభించి 3వ స్థానంలో ఉన్నారు.