India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 5న విశాఖ రానున్న విషయం తెలిసిందే. విశాఖలో సీఎం పర్యటన షెడ్యూల్ను సీఎంవో తెలిపింది. ఈనెల 5న సాయంత్రం 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ఈనెల 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపుతున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు ఈనెల 8 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 2024 డిసెంబర్ నెలలో నిర్వహించబోయే ఉత్సవాలను అధికారులు వెల్లడించారు.11న స్వర్ణ తులసీదళార్చనం, గీతాజయంతి, గ్రామ తిరువీధి, 12న స్వర్ణ పుష్పార్చనం, నృసింహ దీక్ష ప్రారంభం. 13నశ్రీ తాయార్ సన్నిధిని సహస్రనామార్చనం, కృత్తిక, తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్రం,14న శ్రీ స్వామివారి మాస జయంతి16న నెలగంటు జయంతి కార్యక్రమాల నిర్వహించనున్నారు.
విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కయ్యపాలెంలోని 43వ వార్డు శ్రీనివాసనగర్లో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసా బేగం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో గాయపడింది. స్థానికులు సమాచారం మేరకు 4వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో సుమారు మూడేళ్ల మగ, ఐదేళ్ల ఆడ జిరాఫీ జంట సందర్శకులను అలరిస్తూ సందడి చేస్తున్నాయి. ఇటీవల కోల్కతా జూ నుంచి తీసుకొచ్చిన ఈ జిరాఫీల జంట విశాఖ వాతావరణానికి అలవాటు పడి “నీకు నేను.. నాకు నీవు”అనే రీతిలో వాటి హావభావాలతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. విశాఖ జూకు ఈ యువ జిరాఫీ జంట స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరి మీ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 5న విశాఖ వస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. చంద్రబాబు రెండు రోజులు పాటు విశాఖలో ఉండి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)పై సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ మంగళవారం పరిశీలించారు.
కేంద్ర పరిశ్రమలు & వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్తో విశాఖ ఎంపీ శ్రీభరత్ ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. వాణిజ్య మంత్రిత్వ శాఖకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎంపీ పారిశ్రామిక వృద్ధి, అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశాఖ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడలో ఐఐఎఫ్టీ పురోగతిపై చర్చించారు.
విశాఖలో 46.23km మేర 3 కారిడార్లను నిర్మించనునున్న మెట్రో పాజెక్టులో 42 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. <<14776969>>స్టీల్ ప్లాంట్ <<>>నుంచి కొమ్మాది(34.4km) మధ్య 29, గురుద్వార-<<14777184>>పాతపోస్టాఫీసు<<>>(5.08kms)మధ్య 6, తాడిచెట్లపాలెం-<<14777236>>చినవాల్తేర్ <<>>(6.75km) మధ్య 7 స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మరి ఏయే ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో కామెంట్ చెయ్యండి.
తాడిచెట్లపాలెం-<<14773164>>చినవాల్తేర్<<>> (6.75kms) మధ్య 7 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. న్యూరైల్వే కాలనీ, విశాఖ రైల్వేస్టేషన్, అల్లిపురం జంక్షన్-ఆర్టీసీ కాంప్లెక్స్, సంపత్ వినాయక టెంపుల్,సిరిపురం/VUDA, ఆంధ్రాయూనివర్సిటీ, చిన వాల్తేరు వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.