Visakhapatnam

News January 31, 2025

న్యాయవాదులకు విశాఖ జిల్లా న్యాయమూర్తి సూచన

image

న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచించారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కోర్టులో కొత్తగా దాఖలయ్యే దావాలు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారానికి ముందు మధ్యవర్తిత్వానికి పంపిస్తామన్నారు. మధ్యవర్తత్వంలో మెళుకువలను ఆయన వివరించారు. శిక్షకులు సత్యారావు, రత్నతార, జిల్లా న్యాయ సేవాధివార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ ఉన్నారు.

News January 30, 2025

మత్స్యకారుల జీవనోపాధి కాపాడాలి: డా.రాజేంద్రసింగ్

image

1000 కి.మీ.ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఏపీలో పరిశ్రమల కాలుష్యం వలన సుమారు 2లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నారని డా.రాజేంద్రసింగ్ అన్నారు. విశాఖలో తీర ప్రాంతాన్ని ఆయన గురువారం సందర్శించారు. మత్స్యకారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తాబేళ్లు మృత్యువాత బాధాకరమన్నారు. దీనిపై పొల్యూషన్ బోర్డు, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని కోరారు.

News January 30, 2025

పరీక్ష ఫీజు గడువు పెంపు: విశాఖ డీఈవో 

image

2023-2025లో జరుగబోయే డీ.ఎల్.ఈడి 3rd సెమెస్టర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్ష రుసుము గడువు తేది ఫిబ్రవరి 4వరకు పొడిగించడమైనదని డిఈఓ ప్రేమ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు రూ.250, నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెలించాలన్నారు.

News January 30, 2025

విశాఖ జిల్లాలో ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 23 బృందాలు

image

విశాఖ జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లుకు చర్య‌లు తీసుకున్నామ‌ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. వివిధ స్థాయి అధికారుల‌తో కూడిన‌ 12 ఎంసీసీ బృందాల‌ను నియ‌మించామ‌న్నారు. మండ‌లానికి ఒక‌టి చొప్పున‌ 11ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. జీవీఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్, జ‌డ్పీ సీఈవో, భీమిలి, విశాఖ‌ ఆర్డీవోల‌ను నోడ‌ల్ అధికారులుగా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు.

News January 30, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

విశాఖలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. తుంగ్లాంలో ఉంటున్న కింతాడ దేవి (35) భర్త వదిలేయడంతో ఇంటిపనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో బుధవారం వడ్లపూడిలో పని ముగించుకొని సైకిల్‌పై ఇంటికి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందినట్లు దువ్వాడ పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

News January 30, 2025

విశాఖ: ఆసక్తి గలవారు అప్లే చేసుకోండి..! 

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో న్యాయ సహాయకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ తెలిపారు. పదో తరగతి పూర్తయిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తుతో పాటు, ఆధార్ కార్డు జిరాక్స్, విద్యార్హత ధ్రువపత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో జిల్లా కోర్టులో న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో జనవరి 31 లోపు అందజేయాలన్నారు. ఎటువంటి జీతం ఉండదని తెలిపారు.

News January 30, 2025

మహా కుంభమేళాకు విశాఖ నుంచి RTC సర్వీసులు

image

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఫిబ్రవరి 4,8,12 తేదీలలో విశాఖ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నాయుడు తెలిపారు. ప్రయాగ రాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా 7 రోజుల ప్రణాళికను రూపొందించారు. పూర్తి వివరాలకు www.apsrtconline.in వెబ్‌సైట్, బస్సు స్టేషన్‌లో బుకింగ్ కౌంటర్‌లో సంప్రదించాలన్నారు.

News January 30, 2025

విశాఖ: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

image

విశాఖలో మార్చి 8న జిల్లా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. విశాఖలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ పాల్గొన్నారు.

News January 29, 2025

ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌.. విశాఖలో ఐదుగురు అరెస్ట్

image

ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌ కేసులో ఐదుగురు ముద్దాయిలును విశాఖ టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో మద్దిలపాలెంకు చెందిన గొర్లె నరేశ్, వన్ టౌన్ ఏరియాకు చెందిన గంగిరీ పవన్ కళ్యాణ్, సుబ్బలక్ష్మి నగర్‌కు చెందిన నీలగిరి వెంకటలక్ష్మి, ఆరిలోవకు చెందిన గంగిరి పద్మ, విజయనగరానికి చెందిన పెదగాడి శ్రీను ముద్దాయిలుగా ఉన్నారు. పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

News January 29, 2025

విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పేడాడ 

image

విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పేడాడ రమణకుమారి నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు రిలీజ్ చేశారు. పేడాడ రమణకుమారి వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా, బిఆర్ అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. విశాఖలో వైసీపీ మహిళల అధ్యక్షురాలిగా పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానన్నారు.