India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ సిబ్బంది వారికి కేటాయించిన స్థానాలకు మంగళవారం ఉదయం నాలుగు గంటలకే చేరుకోవాలని పోలీస్ కమిషనర్ రవిశంకర్ సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రాంగణంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి కమిషనర్ సూచనలు సలహాలు ఇచ్చారు. మద్యం సేవించారని అనుమానం కలిగితే బ్రీత్ ఎనలైజర్స్ ఉపయోగించాలన్నారు. విధులు సక్రమంగా సమయస్ఫూర్తితో నిర్వహించాలన్నారు. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే విధంగా విధులు నిర్వహించాలన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వెంటనే రౌండ్ వారీ ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు కలెక్టర్ మల్లికార్జున సూచించారు. వెంటవెంటనే నిర్దేశిత వెబ్ సైట్లలో అప్లోడ్ చేయటంతో పాటు మీడియాకు కూడా ఫలితాలను ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు, సూచనలు సలహాలు ఇచ్చారు.
ఉమ్మడి విశాఖలో 15 స్థానాల్లో TDP-8, YCP-2, జనసేన 4, BJP ఒక స్థానంలో విజయం సాధిస్తాయని RTV అంచనా వేసింది. అరకు, మాడుగలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలిపింది. విశాఖ నార్త్లో విష్ణుకుమార్ రాజు గెలుస్తారని అభిప్రాయ పడింది. జనసేన పోటీ చేసిన నాలుగు స్థానాలు పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్, యలమంచిలిలో జెండా ఎగువేస్తుందని అంచనా వేసింది. మిగిలిన 8 స్థానాల్లో TDP గెలుస్తుందని తెలిపింది.
గోపాలపట్నం రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ ఫారం నంబర్-2లో సోమవారం రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు యశ్వంత్ పూర్కు వెళ్ళే రైలు నుంచి జారిపడి ఉంటాడని స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ సోమవారం చోడవరం స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా రావడంతో పాటు.. రేపు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని కోరుకుంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో మరోసారి జగన్ సీఎం అవుతారని చోడవరంలో తాను రెండోసారి గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల నుంచి గూడెం కొత్తవీధి మండలం పెదవలస వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బొంతువలస ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పెదవలస వైపు నుంచి కొయ్యూరుకు వస్తున్న ఓ గ్యాస్ వాహనం ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ఘాట్ దిగుతున్న సమయంలో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వాహనంలో సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు.
ఎన్నికల కౌంటింగ్ 257 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 309 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు వినియోగిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్లు 281 మంది ఉన్నారు. ఓట్ల లెక్కింపుకు మొత్తం 857 మంది సిబ్బందిని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వినియోగిస్తున్నారు. రిజర్వుడ్ స్టాఫ్ తో కలిపి 1045 మంది సిబ్బందిని ఎన్నికల కౌంటింగ్ కోసం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున తెలిపారు.
మంగళవారం జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి అణువు పర్యవేక్షించే విధంగా 176 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 84 మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, 60 మంది ఏపీ ఎస్పీ పోలీసులు, 9 యాక్సెస్ కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం 501 మంది సివిల్ పోలీస్ ఫోర్స్ సైతం వినియోగిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు.
ఈనెల 4న ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విశాఖ నగరంలో 650 మంది రౌడీ షీటర్లను హౌస్ అరెస్ట్ చేసినట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. 91 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. ముఖ్యమైన నాయకులకు అభ్యర్థులకు షాడో టీంలు ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ను స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేశామన్నారు.
పాడేరు ఘాట్ రోడ్డులోకి సోమవారం ఉదయం నుంచి భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్టు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మైదాన ప్రాంతం నుంచి పాడేరు, జీ.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర మండలాలకు సిమెంటు, తదితర సామగ్రిని తరలించే భారీ వాహనాలను ముందస్తుగానే ఘాట్ మార్గంలోకి ప్రవేశించకుండా అవసరమైన చర్యలు చేపట్టామని సీఐ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.