India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గురుద్వార్ జంక్షన్-<<14773164>>ఓల్డ్ పోస్ట్ ఆఫీస్<<>> మధ్య(5.08kms) ఆరు మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్స్, సరస్వతీ సర్కిల్ స్టేషన్, పూర్ణా మార్కెట్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ స్టేషన్లు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
<<14773164>>స్టీల్ ప్లాంట్<<>>, వడ్లపుడి, శ్రీనగర్, చినగంట్యాడ, గాజువాక, ఆటోనగర్, BHPV/BHEL, షీలానగర్, ఎయిర్ పోర్ట్, కాకాని నగర్, NAD, మాధవధార/GSI, మురళీనగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కంచరపాలెం, తాడిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, MVP కాలనీ/ఇసుకతోట, వెంకోజీపాలెం, హనుమంతువాక, ఆదర్ష్ నగర్, ఇందిరా జువాజికల్ పార్క్, యండాడ, క్రికెట్ స్టేడియం, శిల్పారామం, మధురవాడ, కొమ్మాది.
షీలానగర్ వెంకటేశ్వర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. రెండంతస్తుల భవనం పైనుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్, సుస్మితగా గుర్తించారు. దుర్గా ప్రసాద్ క్యాటరింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. వీరు గతకొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు గాజుకవాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
విశాఖ నగరం కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రారంభమైన మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సోమవారం పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన ఏర్పాట్ల గురించి ఈవో శోభారాణిని అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్స్ మధ్య ఎమర్జెన్సీ గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని మార్గాల వద్ద సూచన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
పోస్టల్ డాక్/పెన్షన్ అదాలత్ను ఈ నెల 30న ఉదయం 11.00 గంటలకు ఎంవీపీ కాలనీలోని పోస్టల్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ భవనంలో నిర్వహించనున్నట్లు ఆర్.ఎం.ఎస్. -వి- డివిజన్ సూపరింటెండెంట్ ప్రసన్నరెడ్డి తెలిపారు. ఆర్.ఎం.ఎస్.(రైల్వే మెయిల్ సర్వీసెస్) -వి- డివిజన్ పరిధిలోని ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన తపాలా సేవలు, పింఛన్లపై ఫిర్యాదులు 23 వరకు స్వీకరిస్తారు.
ఏపీలో జిల్లాల వారీగా మొత్తం 34 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 9 ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ మండలం ఈ.బోనంగి, విశాఖ గ్రామీణ ప్రాంతం మధురవాడ, రేసపువానిపాలెం, నక్కపల్లి మండలం, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు, జి.కోడూరు ప్రాంతాలు ఉన్నాయి.
సెలబ్రిటీలను మోసం చేసిన కేసులో విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్(24)ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. 10th ఫెయిలైన అతను ఈవెంట్స్ సంస్థను నెలకొల్పి సెలబ్రెటీలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం తన వ్యాపారాల్లో సెలబ్రెటీలు పెట్టుబడులు పెడుతున్నారని నమ్మించి పలువురి వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాడు. జ్యూవెలర్స్లో పెట్టుబడుల పేరుతో తనను మోసం చేశాడని శ్రీజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు.
హోంమంత్రి వంగలపూడి అనిత ఎంవీపీ కాలనీలో ఆదివారం ‘టీ’ కాచారు. ఓ టీ స్టాల్ వద్ద షాప్ వద్ద పలువురితో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కంచు పాత్రలో చిన్న కుండలో ప్రత్యేకంగా చేసే ‘టీ’ తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం హోంమంత్రి అనిత స్వయంగా ‘తందూరీ టీ’ని తయారు చేసి తాగారు.
విశాఖ జిల్లా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను ఆదివారం విశాఖలో కలిశారు. ఈ సందర్బంగా టైలర్స్ సమస్యలపై వినతి పత్రం అందజేసారు. టైలర్స్ కు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 50 సంవత్సరాలు దాటిన టైలర్స్కి పెన్షన్ ఇవ్వాలని కోరారు. విశాఖ జిల్లా అధ్యక్షులు కూనూరు మళ్ళికేశ్వరరావు, టైలర్స్ పాల్గొన్నారు.
గాజువాక జింక్ మైదానంలో ఈనెల 9 నుంచి 11 వరకు నిర్వహించే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్కు విశాఖ జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు నిర్వాహకులు మణికంఠ, హేమ సుందర్ తెలిపారు. మొట్టమొదటిసారిగా జరిగే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంటులో 10 జిల్లాల నుంచి పది టీములు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.