Visakhapatnam

News June 3, 2024

విశాఖ: నిరుద్యోగుల విక్రయం కేసులో ఏజెంట్ అరెస్ట్

image

కాంబోడియాకు సంబంధించి మానవ అక్రమ రవాణా కేసులో మరో ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రసాద్ గార్డెన్స్‌కు చెందిన బి. మురళిని విచారించారు. మురళి భావన ఫ్యాబ్రికేటర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్ అనే ఇన్స్టిట్యూట్‌ను నడుపుతున్నాడు. మురళి కంబోడియా ఏజెంట్‌లకు నిరుద్యోగ యువతను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మురళిపై ఇప్పటికే 9 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

News June 3, 2024

విశాఖలో నేటి రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

image

ఏయూలో రేపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి మద్దిలపాలెం ఇంజినీరింగ్ ఆర్చ్ గేటు నుంచి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే రహదారిలో సాధారణ వాహనాలకు అనుమతులు ఉండవని ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. 215 మంది ట్రాఫిక్ పోలీసులతో వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

News June 3, 2024

సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ 

image

596 జీవోను రద్దు చేయడంతో పాటు లావాదేవీలను నిలిపివేయాలని కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వందలాది ఎకరాల అసైన్డ్ భూముల్ని అడ్డంగా కొట్టేసిన వైసీపీ నేతలు, అధికార యంత్రాంగం వ్యవహారంపై మాజీ ఐఏఎస్‌లు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. దేశంలో మరెక్కడా జరగని వివిధ విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.

News June 2, 2024

విశాఖ: తంతడి బీచ్‌లో అక్కాచెల్లెళ్లు మృతి

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వారిలో శెట్టిపాలెంకి చెందిన నూకరత్నం, తీడ గ్రామానికి చెందిన కనకదుర్గ(27) మృతిచెందగా.. శిరీష అనే అమ్మాయిని స్థానికులు కాపాడారు. కాగా మృతి చెందిన వారిద్దరూ సొంత అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు. శిరీష పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 2, 2024

తూర్పుగోదావరి జట్టుపై విశాఖ విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో ఆదివారం విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లా జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన తూ.గో జట్టు 45.5 ఓవర్లకు 182 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో విశాఖ జట్టు విజయం సాధించింది.

News June 2, 2024

విశాఖలో పోస్టల్ బ్యాలెట్లు తరలింపు

image

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ బ్లాక్ నుంచి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లకు పోస్టల్ బ్యాలెట్లను అభ్యర్థుల సమక్షంలో ఆదివారం తరలించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనుకూలంగా ఆయా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అభ్యర్థుల సమక్షంలో పటిష్ట భద్రత నడుమ తరలించారు. ఈ తరలింపు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున పర్యవేక్షించారు. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు.

News June 2, 2024

జూన్ 5 వరకు మద్యం షాపులు బంద్: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లా పరిధిలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రేపటి నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కోడ్ ఈనెల 6వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులను మూసివేస్తున్నామన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అదే విధంగా కౌంటింగ్ కూడా శాంతియుతంగా పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.

News June 2, 2024

EXIT POLLS: విశాఖలో ఎంపీగా గెలుపెవరిదంటే.?

image

విశాఖ ఎంపీగా టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు విజయం సాధిస్తారని పేర్కొంది. మరోవైపు, అరకు ఎంపీగా తనూజ గెలవనున్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలోని 3 ఎంపీ స్థానాల్లో 2 వైసీపీ, ఒకటి టీడీపీ సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

విశాఖ: జూన్ 3,4 తేదీల్లో పలు రైళ్ల రద్దు

image

జూన్ మూడో తేదీన పలాస – విశాఖపట్నం, విశాఖపట్నం- పలాస మధ్య నడిచే పాసింజర్ రైలు, విశాఖపట్టణం- గుణుపూర్, గుణుపూర్- విశాఖపట్నం మధ్య నడిచే పాసింజర్ రైలు, 3 వ తేదీన విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ 4వ తేదీన బ్రహ్మపూర్ నుంచి విశాఖకు నడిచే ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.

News June 2, 2024

EXIT POLLS: ఉమ్మడి విశాఖలో ఎన్డీఏ కూటమికే పట్టం.!

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 15 స్థానాల్లో కూటమి 5 సీట్లు గెలుస్తుందని, 6 చోట్ల ఎడ్జ్ ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో వైసీపీకి ఒక సీటు వస్తుందని చెప్పింది. మిగతా మూడు చోట్ల రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేసింది. ఈ సర్వేపై మీ COMMENT.