India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిరకాలంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం బుధవారం ఫుల్ స్టాప్ పెట్టింది. సీఎం చంద్రబాబు విశాఖ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పంచ గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 12వేల మందికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పంచగ్రామాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో భేటీ కానున్నట్లు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో స్టీల్ ప్లాంట్ను గురువారం సందర్శించనున్నట్లు వెల్లడించారు. ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పెద్దలను ఒప్పించి, నచ్చజెప్పి ప్యాకేజీ తీసుకొచ్చామన్నారు.
విశాఖ పరిధిలోని సాగర్ నగర్ బీచ్లో మత్స్యకారుల వలకు బుధవారం ఉదయం 9:30కి ఓ విషపూరిత పాము చిక్కింది. ‘హైడ్రో ఫికస్ సీ స్నేక్’ అనే శాస్త్రీయ నామంతో పిలువబడే ఈ పాము చిన్న చేపలు, రెయ్యిలను, నాచును తింటుంది. ఈ పాము విషపూరితమైనదని కాటేస్తే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని మత్స్యకారులు తెలిపారు. పర్యాటలకులు ఈ పామును చూసి ఫొటోలు తీసిన అనంతరం.. మత్స్యకారులు పామును సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.
విశాఖ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ<
విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో న్యాయ సహాయకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ తెలిపారు. పదో తరగతి పూర్తయిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తుతో పాటు, ఆధార్ కార్డు జిరాక్స్, విద్యార్హత ధ్రువపత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో జిల్లా కోర్టులో న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో జనవరి 31 లోపు అందజేయాలన్నారు. ఎటువంటి జీతం ఉండదని తెలిపారు.
సింహచలం పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు కూటమి ప్రభుత్వం పుల్స్టాప్ పెట్టింది. కోర్టు కేసుల విత్ డ్రాకు ఇరుపక్షాలు అంగీకరించడంతో వివాదం ముగిసిందని ఎమ్మెల్యే గంట శ్రీనివాసు తెలిపారు. ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు ధర్మకర్తలు కూడా అంగీకరించడంతో సింహాచలంలో సమావేశం ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
విశాఖ టూటౌన్ పోలీసులు చిట్టీల పేరుతో మోసం చేసి పరారైన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రవీణ్ కుమార్ గతంలో విశాఖ పోలీస్ కమిషనర్ ఎదురుగా జ్యూస్ షాప్ నిర్వహించేవాడు. ఆ సమయంలో పోలీసులతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం కానిస్టేబుల్స్, స్థానికుల నుంచి చిట్టీలు కట్టించుకునేవాడు. రెండేళ్ల క్రితం రూ.80 లక్షలతో పరారీ కాగా బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.
CBI అంటూ తిరుపతికి చెందిన మహిళ నుంచి రూ.2.5 కోట్లు దోచుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో <<15291930>>ఆరుగురు<<>> విశాఖ జిల్లాకు చెందిన వారిగా తిరుపతి SP హర్షవర్ధన్ మంగళవారం తెలిపారు.
➱సింగంపల్లి గణేశ్ @ త్రినాథపురం
➱పాలకొల్లు రవికుమార్ @ చిన్న వాల్తేరు
➱జగదీష్ @ కంచర పాలెం
➱ పెంకి.ఆనంద్ సంతోష్ కుమార్ @ మల్కాపురం
➱ఊటా అమర్ ఆనంద్ @ పెందుర్తి మండలం, సుజాతా నగర్
➱కర్రి.వాసుదేవ్ @ మురళి నగర్
విశాఖ కేంద్ర కారాగారంలో ఆన్లైన్లో ముందుగా ములాఖత్ రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ మహేశ్ బాబు తెలిపారు. https://eprisons.nic.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుని ముందుగా ములాఖత్ డేట్ తీసుకోవచ్చని తెలిపారు. ఒక్కో ములాఖాత్కు ముగ్గురు విజిటర్స్ సంబంధిత ఖైదీని కలిసి మాట్లాడుకునే సదుపాయం ఉందన్నారు. రిమాండ్ నిందితులకు వారానికి రెండు ములాఖత్లు అందుబాటులో ఉంటాయన్నారు.
విశాఖకు చెందిన ఆరుగురు నిందితులను తిరుపతి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తిరుపతి SP హర్షవర్ధన్ వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన నిందితులు ఇటీవల తిరుపతి మహిళకు ఫోన్ చేశారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ జరిగిందని భయపెట్టి ఆమె నుంచి రూ.2.5 కోట్ల దోచుకున్నారు. మోసపోయినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులో తీసుకుని ఓ కారు, రూ.3.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.