India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏయూ డాక్టర్. బి.ఆర్.అంబేడ్కర్ లా కాలేజ్ విద్యార్థులు విందెల గీత భార్గవి, కెంబూరి నైమిశలు ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో విజయం సాధించి చిన్న వయస్సులో జడ్జిలుగా ఎంపికయ్యారు. ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె. సీతామాణిక్యం హర్షం వ్యక్తం చేశారు. గీత భార్గవి, నైమిశలు మరిన్ని ఉన్నత విజయాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో అల్లిపురంలో శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పోటీలు జర్నలిస్టులకు ఆటవిడుపుగా పేర్కొన్నారు. డిసెంబర్ 16 నుంచి 22 వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పోటీలు జరుగుతాయని శ్రీనుబాబు తెలిపారు.
విశాఖలోని వడ్లపూడికి చెందిన జి.తులసి అనే మహిళను నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి శుక్రవారం సత్కరించారు. తులసి తన ఇంటికి సమీపంలో ఐదేళ్ల బాలిక ఒంటరిగా తిరగడం గమనించి, బాధ్యతగా డయల్ 112కి కాల్ చేశారు. వెంటనే పోలీసులు బాలిక కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వారికి అప్పగించారు. దీంతో కమిషనర్ ఆమెను శుక్రవారం అభినందించి సత్కరించారు.
విశాఖపట్నం లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్లో శుక్రవారం ఒడిస్సా, పాండిచ్చేరి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వాతావరణం సహకరించకపోవడం వలన 20 ఓవర్ల మ్యాచ్ను 6 ఓవర్లకు కుదించారు. దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన పాండిచ్చేరి 6 ఓవర్లలో 91/2 చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఒడిశా 6 ఓవర్లలో 75/3 పరుగులు చేసింది. 35 పరుగులు చేసిన కె.బి.అరుణ్ కార్తీక్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్గా నిలిచాడు.
పరవాడ టాగూర్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై షీలా నగర్లో చికిత్స పొందుతున్న కార్మికులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి ఆరా తీశారు. భద్రత ప్రమాణాలను పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.
ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ సమస్యకు ఆపరేషన్ లేకుండా వాటర్ వెపర్ థెరపీతో AINU హాస్పిటల్ చికిత్స అందిస్తోంది. అంగస్తంభన, వీర్యస్ఖలనం సరిగా కాకపోవడం లాంటి సమస్యలకు ఈ వాటర్ వెపర్ థెరపీతో సరైన పరిష్కారం లభిస్తుంది. ఇది చేసిన తర్వాత నెల రోజుల్లోపు ఫలితాలు కనిపిస్తాయని, ఈ సమస్యలు ఉన్నవారికి ఈ చికిత్స ఒక వరం లాంటిదని AINU ఎండీ, చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు.
విశాఖ పేరు వెనుక ఒక చరిత్రే ఉంది. వైశాఖేశ్వరుని ఆలయం చుట్టూ నగరం విస్తరించిందని, వైశాఖ కాస్త విశాఖగా మారిందని పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నగరంలో కుమార స్వామి ఆలయం ఉండేదని అతని నక్షత్రం విశాఖ కావడంతో నగరానికి ఆ పేరు వచ్చిందనేది మరో కథనం. కాగా బ్రిటిష్ వారు విశాఖపట్నం పేరు పలకలేక వైజాగపట్నం అనే వారు. అది కాస్త వైజాగ్గా మారింది. నగరానికి విశాఖ పేరు ఎలా వచ్చిందో మీకు తెలిసిన కథ కామెంట్ చేయండి.
ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో నిందితుడు పచ్చిపాల గోవింద్కు ఏడీజీ న్యాయస్థానం యావజ్జీవ కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2,000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. 2022లో చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తితో గోవిందు గొడవపడ్డాడు. కాగితాలు ఏరుకునే వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడ్డుతో దాడి చేసి గోవిందు హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.
పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని ఎక్స్లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.