Visakhapatnam

News June 2, 2024

విశాఖ జిల్లాలో ఎగ్జిట్ పోల్స్‌పై మీ కామెంట్?

image

ప్రధాన పార్టీలు విశాఖ జిల్లాలో తమ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయంటూ ఆ పార్టీలలోని ముఖ్య నాయకులు మీడియా ముఖంగా చెప్పారు. ఈ తరుణంలో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదులయ్యాయి. ఇందులో జిల్లాలో చాలా వరకు టీడీపీకే మెజారిటీ అసెంబ్లీ స్థానాలు వస్తాయని, కొన్నిచోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది. విశాఖ ఎంపీ సీటు టీడీపీ, అనకాపల్లిలో బీజేపీ, అరకులో వైసీపీ గెలుస్తాయని తెలిపాయి. మరి ఈ సర్వేలపై మీ కామెంట్?

News June 1, 2024

మరో సర్వే.. విశాఖలో ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 సీట్లకు గాను NDA కూటమి 9-10 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

News June 1, 2024

ఎగ్జిట్ పోల్స్.. విశాఖలో టీడీపీదే ఆధిపత్యం!

image

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం విశాఖలో వైసీపీకి 2-4, ఎన్డీఏ కూటమికి 11-13 వస్తాయని అంచనా వేసింది. అటు అరకు ఎంపీ స్థానంలో వైసీపీ (తనూజ) , విశాఖలో టీడీపీ( శ్రీ భరత్), అనకాపల్లిలో టఫ్ ఫైట్ ఉండనుండగా బీజేపీకి ఛాన్స్ ఉంటుందని చాణక్య ఎక్స్ అంచనా వేసింది.

News June 1, 2024

విశాఖలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..

image

ఉమ్మడి విశాఖలో టీడీపీ -11, వైసీపీ-2, టఫ్ ఫైట్ రెండు చోట్ల ఉంటుందని చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. వైసీపీ-1, టీడీపీ-9, జనసేన-4, బీజేపీ-1 గెలుస్తాయని కేకే సర్వే తెలిపింది. ఆరా మస్తాన్ సర్వే ప్రకారం గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ ఓడిపోతారని తెలిపింది. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ గెలుస్తారని అంచనా వేసింది.

News June 1, 2024

ఆరా సర్వే..గుడివాడ అమర్నాథ్‌ ఓటమి

image

జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా, శనివారం సాయంత్రం కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఆరా మస్తాన్ సర్వే ప్రకారం గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ ఓడిపోతారని తెలిపింది. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ గెలుస్తారని అంచనా వేసింది.

News June 1, 2024

డిగ్రీలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినికి అభినందన

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను వీసీ పీవీజీడీ.ప్రసాద్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో అభినందించారు. బీబీఏ విద్యార్థిని కే.రమ్య యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా కళాశాల విద్యార్థులు కే. రమ్య, టీ.ఊర్మిల విజయనగరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వీరిని అభినందించారు.

News June 1, 2024

బడితెరిచిన రోజునే విద్యా కానుక

image

బడితెరిచిన రోజునే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుక అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్జేడీ విజయభాస్కర్ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు 14,66,883 పాఠ్య పుస్తకాల అవసరం కాగా మే 31 నాటికి 9,16,691 పుస్తకాలు వచ్చాయి. వీటిలో 7,03,154(76 శాతం) స్టాక్ పాయింట్లకు సరఫరా చేశారు. అల్లూరి జిల్లాకు 45 శాతం, అనకాపల్లి జిల్లాకు 48 శాతం, విశాఖ జిల్లాకు 47% పాఠ్య పుస్తకాలు సరఫరా చేశారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. విశాఖ జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం విశాఖ జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

రుషికొండ: పర్యాటక స్పీడ్ బోట్లు పునరుద్ధరణ

image

టూరిజం బోటింగ్ కంట్రోల్ రూం పర్యవేక్షణలో రుషికొండ బీచ్ వద్ద సముద్రంలో నిర్వహించే మూడు పర్యాటక స్పీడు బోట్లను శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. తుపాను కారణంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరికల మేరకు సంబంధిత అధికారులు ఆరు రోజులుగా వీటిని నిలిపివేశారు. తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో మళ్లీ యధావిధిగా నడుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News June 1, 2024

జూన్ 3,4 తేదీలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌కు సెలవు

image

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు జూన్ నెల 3, 4వ తేదీల్లో సెలవు ప్రకటించినట్లు ప్రిన్సిపల్ సర్కులర్ జారీ చేశారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కళాశాలలోని పలు కార్యాలయాలు, విభాగాలను ఎన్నికల కమిషన్ తమ ఆధీనంలోకి తీసుకుని ప్రాంగణాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఎన్నికల అనంతరం ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచింది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో 3,4 తేదీల్లో సెలవు ప్రకటించారు.