India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి విశాఖ YCPలో ఇప్పటి వరకు వలస నేతలే ఆధిపత్యం చెలాయించేవారన్న విమర్శలున్నాయి. గతంలో రీజనల్ కో-ఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి వంటి వారు ఉండటమే దీనికి కారణం. కాగా..విజయసాయిరెడ్డి,అవంతి,ఆడారి రాజీనామాతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, చోడవరం ఇన్ఛార్జ్గా మాజీమంత్రి అమర్నాథ్కు బాధ్యతలు అప్పగించారు. గుడివాడ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తూ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.
పద్మనాభం మండలం కృష్టాపురంలో ఒకే రోజు <<15283151>>ఇద్దరు సూసైడ్<<>> చేసుకున్న ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివాహిత కనకల లక్ష్మి(30) మరణంతో ఆమె ఇద్దరు కుమారులు తల్లి లేనివారయ్యారు. ఒక్కగానొక్క కొడుకు మొరక ఆదిత్య(22) ఇంక లేడన్న వార్తను అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటల్లో చురుగ్గా ఉండే ఆదిత్య తండ్రి వైద్యారోగ్యశాఖలో చిరుద్యోగి కాగా.. లక్ష్మి భర్త లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కసింకోట నుంచి తన మూడేళ్ల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆర్థికసాయం అందించాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్ ను తొలగించారని విశాఖ సీతంపేటకు చెందిన అవ్వ కాంతం విజ్ఞప్తి చేశారు. తన తండ్రి సంపాదించిన భూమి ఆక్రమించారని విజయనగరం జిల్లా అంగటి లక్ష్మి ఫిర్యాదు చేసారు. అర్జీల పట్ల చర్యలు తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్”లో స్థలాలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉన్నాయని వి.ఎం.ఆర్.డి.ఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. విశాఖ జిల్లా రామవరం, పాలవలస, గంగసాని అగ్రహారం, అనకాపల్లి జిల్లా అడ్డూరు, విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతాలలో అన్ని మౌలిక వసతులతో లభ్యమవుతున్నాయన్నారు. అనాధికారిక లేఔట్లలో స్థలాలు కొని మోసపోవద్దని సూచించారు.
విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూపై పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సోమవారం విశాఖలో ఓ హోటల్లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్కు 150కి పైగా పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో 825 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు.
పద్మనాభ (మం) కృష్ణాపురంలో ఓ మహిళ, యువకుడు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివాహిత మహిళ లక్ష్మి(31), మోకర ఆదిత్య(21) గ్రామంలో వేర్వేరు చోట్ల ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పద్మనాభం సీఐ శ్రీధర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూపై పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సోమవారం విశాఖలో ఓ హోటల్లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్కు 150కి పైగా పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో 825 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు.
చట్టాలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టేది లేదని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సోమవారం ఓ కోర్టు కేసుకు సంబంధించి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెడ్ బుక్కును చూసి ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు చట్టాలను ఉల్లంఘించే ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని నోవాటెల్ హోటల్లో పర్యాటక పెట్టుబడిదారుల ప్రాంతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ బాలాజీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యాపారవేత్తలతో టూరిజంలో పెట్టుబడులపై చర్చించనున్నారు.
విశాఖలో మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు మీరెవ్వరూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగలేదని రిపోర్టర్లను ఎదురు ప్రశ్న వేశారు. విశాఖ వచ్చినప్పుడుల్లా మొన్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూ ఫస్ట్ మీడియా మిత్రులు బుల్లేట్ దింపేవారని అన్నారు. ఆనాడు చెప్పిన విధంగా ప్రైవేటీకరణ జరగనివ్వమన్న మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
Sorry, no posts matched your criteria.