India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ నగరం కైలాసగిరి పై వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా నెలకొల్పిన అడ్వెంచర్స్ స్పోర్ట్స్-జిప్ లైనర్, స్కై స్కైలింగ్లు అందుబాటులోకి వచ్చాయి. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి 2025 నాటికి పూర్తవుతుందన్నారు.
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్పై 20 కేసులు పెట్టారని ఆయన భార్య ఇంటూరి సృజన అన్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. తన భర్తను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, స్టంట్ వేశారని విశ్రాంతి అవసరమని చెప్పినా వినడం లేదన్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టారో స్పష్టం చేయాలన్నారు.
పరవాడ ఫార్మాసిటీలో గల ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీకైన ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు CITU ఆరోపించింది. బుధవారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో CPM అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, CITU ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్స్కు పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆనందపురం మం. ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్న సుందరరావు, వెంకటేశ్వరరావు 2019 ఆగస్టులో విద్యార్థినులతో వీడియోలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై తోటి టీచర్లు MEOకి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా నేరం రుజువైంది. దీంతో జడ్జి ఆనందిని వీరికి ఏడాది జైలు శిక్ష విధించారు.
అనకాపల్లి జిల్లా కుర్రాడు పైలా అవినాశ్ని IPL వేలంలో పంజాబ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అచ్యుతాపురం మండలానికి చెందిన అవినాశ్ సత్యారావు, నాగమణిల చిన్న కొడుకు. వీరది వ్యవసాయ ఆధారిత కుటుంబం కాగా అవినాశ్కు క్రికెట్ మీద ఉన్న మక్కువ చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసిన అవినాశ్ రంజీల్లో సత్తా చాటాడు. దీంతో పంజాబ్ ఫ్రాంచైజీ అతడిని రూ.30 లక్షల బేస్ ప్రైస్తో తీసుకుంది.
రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న రైల్వే యూనియన్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ను గెలిపించాలని ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ విశాఖ రైల్వే ఉద్యోగులను కోరారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల బోనస్ కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ చేసిన పోరాట విజయాలను వివరించారు.
విశాఖ హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు బెంచి సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వీనర్, న్యాయవాది ఐఎం.అహమ్మద్, కోకన్వీనర్ గుడిపల్లి సుబ్బారావు ఆద్వర్యంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం విశాఖలో హైకోర్టు బెంచి ఏర్పాటు అవశ్యకతపై వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మోహన్, ఐఎఎల్ రాష్ట్ర అద్యక్షులు సురేశ్ కుమార్ పాల్గొన్నారు.
విశాఖలోని నరవ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల అటెండర్ నీచంగా విద్యార్థులతో ప్రవర్తించాడని ఆరోపణలొస్తున్నాయి. అటెండర్ లోకేష్ విద్యార్థులను హోమో సెక్సువల్ వేధింపులకు గురిచేశారని విద్యార్థులు ఆరోపించారు. జరిగిన ఘటనపై విద్యార్థులు ప్రిన్సిపల్కు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పాటల రచయిత కులశేఖర్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి తెలిసిందే. 100 సినిమాలకు పైగా పాటలు రాసిన కులశేఖర్ సింహాచలంలోనే పుట్టి పెరిగారు. వైష్ణవ కుటుంబానికి చెందిన ఆయన తన తల్లిదండ్రులకు ఆరో సంతానం. ఓ దిన పత్రికలో కెరియర్ ప్రారంభించి.. సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద పాటలు రాయడం నేర్చుకున్నారు. చిత్రం, జయం, నువ్వు నేను, సంతోషం వంటి చిత్రాలకు పాటలు రాశారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో సినీ తరహాలో దారుణ హత్య జరిగింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని హత్య చేసి కాలికి బరువైన రాయి కట్టేసి సముద్రంలో దుండగులు విసిరేశారు. ఈ నేపథ్యంలో ఫిషింగ్ హార్బర్లో జెట్టి నంబర్ 10 వద్ద సముద్రంలో మృతదేహం తేలుతూ కనిపించడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.