India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో సోమవారం ఉదయం 10 గంటలకు ఓ పత్రికపై పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు అవుతారు. సాయంత్రం టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను కలవనున్నారు. సాయంత్రం 6 గం.లకు గాజువాక నియోజకవర్గం, గ్రీన్ సిటీ కాలనీలోని శ్రీవైభవ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉండవల్లి వెళ్లనున్నారు.
విశాఖలో కిడ్నీ ఆసుపత్రి నిర్వహిస్తున్న డా.రాజశేఖర్ను చెన్నైలో హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం రోజులుగా హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా నడుస్తున్న కిడ్నీ రాకెట్పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రాకెట్లో విశాఖకు చెందిన డా.రాజశేఖర్ ఓ ముఠాను ఏర్పాటు చేసి కిడ్నీల మార్పిడికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు.
తగరపువలసలోని ఆదర్శనగర్లో పురుగుమందు తాగిన ఘటనలో <<15257483>>విషాదం <<>>చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఇషిత(5) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత మాధవి(25) ఇద్దరి కుమార్తెలతో పాటు పురుగు మందు తాగిన విషయం తెలిసిందే. దీంతో మాధవితో పాటు చిన్న కుమార్తె శనివారం మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగా పనిచేస్తున్నాడు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యరావు, రాజకీయ ప్రముఖులు, నేవీ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి.
విశాఖలోని ఆశీల్మెట్టలో యువకుడి మృతదేహం లభ్యమైంది. త్రీ టౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఓ స్కూల్ గేట్ ఎదురుగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్ఐ సురేష్ కోరారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ పోలీస్ భారక్స్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా నుంచి 446 మందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అందులో 28 మంది జిల్లా స్థాయి అధికారులకు పురస్కారాలు దక్కాయి. వారిలో VMRDA కమీషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ,ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్ ఇమ్మడి పృథ్వీతేజ్, డిప్యూటీ కలెక్టర్లు కె.సంగీత్ మాథుర్, సుధాసాగర్ ఉన్నారు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో వివిధ శాఖల నుంచి 9 శకటాల ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి జీవీఎంసీ , ద్వితీయ బహుమతి డీ.ఆర్.డీ.ఏ, తృతీయ బహుమతి వీఎంఆర్డిఏ శకటాలు సాధించాయి. మిగతా విద్యా, సమగ్ర శిక్ష అభియాన్ శకటాలకు ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందజేశారు.
76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విశాఖ జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న 446 మంది ఉద్యోగులు పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఉదయం నగరంలో గల పోలీస్ శాఖ మైదానంలో కలెక్టర్ చేతుల మీదుగా ఉద్యోగులు ఈ అవార్డులను అందుకోనున్నారు. అవార్డు అందుకోనున్న వారిలో విఎంఆర్డిఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథం, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్తో పాటు పలువురు ఉద్యోగులు ఉన్నారు.
విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఓ స్పా సెంటర్పై పోలీసుల దాడులు శనివారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనలో పశ్చిమ బంగా, విశాఖకు చెందిన ముగ్గురు యువతులతో పాటు విటుడు, స్పా నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పాకు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పెందుర్తిలో గల అప్పన్నపాలెంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వెంకట సత్యనారాయణ ఇంటి బాల్కనీ నుంచి పడి మృతి చెందారు. వెంటనే భార్య హాస్పిటల్కు తరలించారు. తీవ్ర గాయాలవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వెంకట సత్యనారాయణ జీవీఎంసీ జోన్ -8 వేపగుంట కార్యాలయంలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.