India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనకాపల్లి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం అనకాపల్లి కలెక్టరేట్లో జరుగుతున్న శిక్షణా తరగతులలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుందన్నారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుందన్నారు.
సాగర్ నగర్ జూ పార్క్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి భయపడి రాంగ్ రూట్లో కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు ఎర్నాకులం టాటానగర్ మధ్య నడిచే రైలును విజయనగరం, కుర్థరోడ్, కటక్, జక్కాపుర, జరోలి మీదుగా మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 7 నుంచి 14 వరకు టాటా నుంచి బయలుదేరే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ జరోలీ, ఖాజాపూర్, కటక్, కుర్థరోడ్, విజయనగరం మీదుగా మళ్లించారు. సంబల్పూర్ డివిజన్లో జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రైళ్లు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
ఎస్.రాయవరం మండంలం అడ్డరోడ్డు సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్ పెదగుమ్ములూరు గ్రామానికి చెందిన జూమాల రాంబాబు(45) బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాంబాబు అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సికింద్రాబాద్- సిల్చార్ (12513) మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ రైలును జూన్ 1వ తేదీన రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు. న్యూహాల్ ఫామ్ రైల్వే స్టేషన్ బంద్రాకల్ మధ్య జరుగుతున్న ట్రాక్ మరమ్మతుల కారణంగా రైలును రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు దీనిని గమనించి తదనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
జూన్ 12వ తేదీలోగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ చేసుకోవాలని ఉప రవాణా కమీషనర్ రాజరత్నం అన్నారు. గురువారం ఉపరవాణా కమీషనర్ కార్యాలయంలో స్కూల్ బస్సుల యాజమాన్యంతో సమావేశమై మాట్లాడారు. స్కూల్, కళాశాల బస్సులలో డ్రైవర్లకు కనీసం ఐదేళ్ల అనుభవంతో పాటు 50 ఏళ్లు మించకుండా ఉండాలన్నారు. డ్రైవర్లకు విధిగా కంటి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. స్కూల్ బస్సులో తప్పనిసరిగా ఒక సహాయకుడు ఉండాలని చెప్పారు.
ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పనిచేయాలని విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి శేషమ్మ అన్నారు. జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల ప్రభుత్వ అధికారుల శిక్షణ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి శేషమ్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇంటర్ సంప్లమెంటరీ పరీక్షల్లో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కూర్మన్నపాలెంలోని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకులు నగదు వసూలు చేసి మాస్కాపీయింగ్కు సహకరిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఆ కళాశాలలో అధికారులు బుధవారం తనిఖీ చేశారు. గదులను, సీసీ ఫుటేజీని పరిశీలించి ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించారు.
డ్రెస్సింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరం సమయానికి రూ.35.68 కోట్ల లాభాన్ని ఆర్జించిందని డీసీఐ అధికారి నటరాజన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్ల లాభం సాధించగా ఈ సంవత్సరం రెట్టింపు లాభాన్ని సాధించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.945.5 కోట్ల టర్నోవర్ సాధించామని, 2024-25 సంవత్సరానికి రూ.1840 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలియజేశారు.
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇంచార్జ్గా కేజీహెచ్ గైనిక్ విభాగానికి చెందిన డాక్టర్ ఐ.వాణీకి బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ అశోక్ కుమార్ లైంగికంగా వేధించారంటూ కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భాస్కరరావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.