India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి పెట్టుబడుల వరద మొదలైందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తను ప్రాతినిత్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో రాజయ్య పేటలో ఉక్కు దిగ్గజ సంస్థలైన ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్స్ ముందుకు రావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపన్నారు. రూ.1.40 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు.
ఈనెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు పలు విభాగాల ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ఐఎన్ఎస్ డేగాలో బస చేస్తారని వెల్లడించారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు.
సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు ఆదివారం ఉదయం వైభవంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సంప్రదాయ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా గోవిందరాజుల స్వామిని ఆలయ కళ్యాణ మండపంలో అదిష్ఠింపజేసి వేదమంత్రాలు, నాదస్వర వాయిద్యాల మధ్య 108 బంగారు సంపెంగలతో స్వర్ణపుష్పార్చన నిర్వహించారు.
విశాఖలో ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు సంబంధించి GM ఆఫీస్, కాంప్లెక్స్ (B2+B1+G+9) భవనాల నిర్మాణానికి రైల్వే శాఖ ఈ- టెండర్లను ఆహ్వానించింది. దీనికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం తెలిపారు. డిసెంబర్ 13 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ టెండర్ దాఖలు చేసుకోవచ్చని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ ఈ భవనాలను రెండు సంవత్సరాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విశాఖకు చెందిన కేఎస్ భరత్ రూ.75 లక్షల బేస్ ప్రైస్తో రిజిస్టర్ చేసుకున్నారు. మరి మన విశాఖ జిల్లా కుర్రాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు? ఏ టీమ్కు సెలెక్ట్ అయితే బాగుంటుందని భావిస్తున్నారో? కామెంట్ చేయండి.
భీమిలి మం. మజ్జివలసకు చెందిన రాశి(22) అదే ప్రాంతానికి చెందిన రాజు (26) వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాశి విద్యా వాలంటీర్గా పనిచేస్తోంది. ప్రేమ పేరుతో రాజు ఆమెను వేధింపులకు గురిచేయగా ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఫోన్డేటా ఆధారంగా రాజును ఈనెల 22న అరెస్ట్ చేశారు.
విశాఖ జిల్లాలో క్రీడల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా సంఘాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవోతో పాటు ఒలింపిక్ సంఘం పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈనెల 25న విజయవాడ-విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్, కాకినాడ-విశాఖ-కాకినాడ మెము ఎక్స్ప్రెస్, గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి పాసింజర్ రైలు రద్దు చేశామన్నారు. 26న విశాఖ గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
చంద్రబాబు ఏం చేసినా ఒప్పు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ్చ మంద దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.6.99 లకు కొంటే తప్పులేదు కానీ జగన్ కేవలం యూనిట్ రూ.2.49లకు కొంటే మాత్రం తప్పు అన్నట్లుగా ప్రచారం చేస్తుందని శనివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
హోం మంత్రి అనిత చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి రాజీ కుదుర్చుకున్నానని తనపై కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70 లక్షలు అప్పుతీసుకున్నారు. 2018లో అప్పుకు అతనికి చెక్కును ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా.. ఇటీవల ఆమె హోం మంత్రి అయ్యాక రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.